Telangana

News September 18, 2024

సిరిసిల్ల: పత్తి దిగుబడిపై దిగాలు

image

సిరిసిల్ల జిల్లాలో పత్తి పంట సాగు చేసిన రైతులు తెల్లబోతున్నారు. ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన అధిక వర్గాలు పత్తి రైతులను పరేషాన్ చేస్తున్నాయి. భారీ వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడిపై ప్రభావం చూపింది. మరోవైపు తెగుళ్లు మొదలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆకులకు తెగుళ్లు సోకి ఎర్ర రంగులోకి మారుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. కాగా, జిల్లాలో 49,332 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు.

News September 18, 2024

HYDలో పెద్ద ఆఫీసులకు డిమాండ్

image

విశాలమైన ఆఫీసులకు హైదరాబాద్‌లో భారీ డిమాండ్ ఉందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. లక్ష చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ స్థలంలో ఉన్న వాటిని లార్జ్ ఫార్మాట్ ఆఫీసులు అంటారు. ఈ ఏడాది మొదటి ఆర్నెళ్లలో (హెచ్1) 3.08 మిలియన్ చదరపు అడుగుల లావాదేవీల జాగా అమ్ముడైంది. గతేడాది మొదటి ఆర్నెళ్లలో 1.47 మిలియన్ చదరపు అడుగులు ఉంది, లావాదేవీలలో 61% వాటా ఈ సెగ్మెంట్‌లో ఉంది.

News September 18, 2024

HYD: మల్లారెడ్డి మెడికల్ కాలేజీపై ఎంక్వైరీ?

image

మల్లారెడ్డి మెడికల్ కాలేజీపై సర్కారు సీరియస్ ఉన్నట్లు తెలుస్తోంది. డీమ్డ్ హోదా సీట్లు మేనేజ్‌మెంట్ కోటా సీట్లగా భర్తీ చేస్తున్నారని విద్యర్థులు, పేరెంట్స్ అసోసియేషన్ నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. కాగా వైద్య కళాశాల నేషనల్ మెడికల్ కమిషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం దానికి అనుబంధమైన హాస్పిటల్స్ అంశంపై ఆ శాఖ మంత్రి నేడు ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు.

News September 18, 2024

పరుశురామ స్వామి కొలువై ఉన్న ఏకైక ప్రదేశం ఇదే..!

image

ఉమ్మడి జిల్లాలో పరశురాముడు కొలువై ఉన్న ఏకైక ప్రదేశం ఏది అంటే అది జోగులాంబ గద్వాలలోని జమ్మిచెడు మాత్రమే. ఇక్కడ జమ్ములమ్మ దేవస్థానానికి దర్శించుకునేందుకు వివిధ ప్రాంతానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. వీరంతా పక్కనే వెలిసి ఉన్న పరశురామ స్వామి ఆలయాన్ని కూడా దర్శించి మొక్కలు తీర్చుకోవడం గమనార్హం.

News September 18, 2024

భీంపూర్: మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పులుల సంచారం

image

భీంపూర్ మండలం పెనుగంగ నదికి అవతల ఉన్న మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పులులు సంచరిస్తున్నాయి. రామ్‌నగర్- సావర్గాం మార్గంలో మూడు పులులు ఓ ద్విచక్ర వాహనదారుడికి కనిపించగా వాటిని ఫొటో తీశాడు. తిప్పేశ్వర్ అభయారణ్యం ఆయా గ్రామాలకు సమీపంలో ఉండటంతో తరుచూ పులులు కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వేసవిలో నది దాటి భీంపూర్ వస్తున్నాయన్నారు.

News September 18, 2024

పద్మాక్షి అమ్మవారి శరన్నవరాత్రులకు రావాలని సీఎంకు ఆహ్వానం

image

శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవికి వచ్చేనెల 3 నుంచి 14 వరకు శరన్నవరాత్రులు జరుగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-గీతా రెడ్డి దంపతులను పద్మాక్షి అమ్మవారి దేవాలయ వేద పండితులు నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని కలిసి ఆహ్వానించారు. సీఎంకు అమ్మవారి ప్రసాదం అందజేసి ఆశీర్వచనం చేశారు.

News September 18, 2024

యాదగిరిగుట్ట: వినాయక నిమజ్జనాన్ని పరిశీలించిన ఏసీపీ

image

యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో వినాయకుల నిమజ్జన కార్యక్రమాలను ఏసీపీ రమేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఎరుకలి సుధా హేమేందర్ గౌడ్, సీఐ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

News September 18, 2024

HYD: రాత్రంతా ఆగని శానిటేషన్!

image

ఎల్బీనగర్ పరిధిలోని సరూర్‌నగర్ చెరువు, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో అర్ధరాత్రి సమయంలోనూ శానిటేషన్ పనులు కొనసాగాయి. రాత్రుళ్లు విధులు నిర్వహించిన బృందాలను కమిషనర్ ఆమ్రపాలి కాటా ప్రత్యేకంగా అభినందించారు. ఆయా ప్రాంతాల్లో నిమజ్జనాలు సజావుగా సాగినట్లుగా డిప్యూటీ కమిషనర్ సుజాత పేర్కొన్నారు.

News September 18, 2024

NZB: ఈ నెల 19న సర్టిఫికేట్ పరిశీలన

image

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో మిగిలిన PGCRT, CRT, PETలతో పాటు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో CRT ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు NZB జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలు deonizamabad.in వెబ్సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. జాబితాతాలో పేరున్న అభ్యర్థులు ఈ నెల 19న కలెక్టరేట్‌లోని సమగ్ర శిక్ష కార్యాలయానికి సర్టిఫికేట్ పరిశీలనకు రావాలన్నారు.

News September 18, 2024

HYD: రాత్రంతా ఆగని శానిటేషన్!

image

ఎల్బీనగర్ పరిధిలోని సరూర్ నగర్ చెరువు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో అర్ధరాత్రి సమయంలోను శానిటేషన్ పనులు కొనసాగాయి. అర్ధరాత్రిలో విధులు నిర్వహించిన బృందాలను కమిషనర్ ఆమ్రపాలి కాటా ప్రత్యేకంగా అభినందించారు. సరూర్‌నగర్ ప్రాంతాల్లో నిమజ్జనాలు సజావుగా సాగినట్లుగా సరూర్‌నగర్ డిప్యూటీ కమిషనర్ సుజాత పేర్కొన్నారు.