Telangana

News August 29, 2025

ADB: ‘ఉపాధ్యాయులు, ఉద్యోగుల పాత్ర కీలకం’

image

సమాజంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైనదని, తమ వృత్తిని బాధ్యతగా నిర్వర్తిస్తూ మరింత ఉన్నతంగా ఎదగాలని మాదిగ జాగృతి సంఘం జిల్లాధ్యక్షుడు ఆడేల్లు అన్నారు. ఆదిలాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో మాదిగ జాగృతి సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు పదోన్నతులు పొందిన పలువురు ఉద్యోగులను శాలువ, జ్ఞాపికతో సన్మానించారు. విధినిర్వహణలో నిబంధనలు పాటిస్తూ సమాజం మేలు కోసం కృషి చేయాలని సూచించారు.

News August 29, 2025

ADB: పంచాయతీ ఎన్నికలపై ఆల్ పార్టీ మీటింగ్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, నియమావళిని వివరించి పలు సూచనలు చేశారు. సమావేశంలో JC శ్యామలాదేవి, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ ఉన్నారు.

News August 29, 2025

నిజామాబాద్: రేపటి నుంచి తెలంగాణ యువ ప్రో కబడ్డీ లీగ్

image

హైదరాబాద్‌లో రేపటి నుంచి తెలంగాణ యువ ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో పాల్గొనే శాతవాహన జట్టు క్రీడాకారులు నిజామాబాద్‌ జిల్లాలో తమ శిక్షణ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. జట్టుకు జిల్లాకు చెందిన మీసాల ప్రశాంత్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఆకాంక్షించారు.

News August 29, 2025

నెల రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన ఏఎస్పీ

image

చౌటుప్పల్ మండలం <<17212670>>ఖైతాపూరం వద్ద<<>> గతనెల 26న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏఎస్పీ ప్రసాద్‌ చికిత్స పొందుతూ మృతి చెందారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు చక్రధరరావు, శాంతరావు అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్ర గాయాలైన ప్రసాద్‌ను హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో చేర్చారు. నెల రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు.

News August 29, 2025

RR: మీసేవ కేంద్రాలకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

image

మీసేవ కేంద్రాల ఏర్పాటుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని RR జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. గండిపేట మండలం వట్టినాగులపల్లి, గండిపేట, కిస్మత్ పూర్, గంధంగూడ, మొయినాబాద్‌లోని అజీజ్ నగర్, హిమాయత్‌నగర్, కనకమామిడి, చౌదరిగూడలోని తుంపల్లి, ఎదిర, సరూర్‌నగర్‌లోని తుమ్మబౌలి, మంచాలలోని లోయపల్లిలో మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News August 29, 2025

HYDలో రూల్స్ బ్రేక్@98 లక్షలు

image

నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. వేలమంది నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. గత ఏడు నెలల్లో దాదాపు 98 లక్షల మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిచారు. అంటే రోజుకు 44 వేల మంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారన్న మాట. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కోటికి చేరుకోవడానికి పెద్ద సమయమేం పట్టదు.

News August 29, 2025

HYDకు అక్కడ 109.. ఇక్కడ 3వ స్థానం

image

మన నగరానికి ప్రపంచ వ్యాప్త నగరాల సౌకర్యాల జాబితాలో ఉన్న స్థానం 109. అదే జాతీయ స్థాయిలో అయితే మూడవ స్థానం. దేశంలో మొదటి రెండు స్థానాలు ఢిల్లీ, ముంబయి దక్కించుకున్నాయి. ఉద్యోగ, ఉపాధి, ప్రజారవాణా, వైద్యం తదితర రంగాల్లో ఉన్న సౌకర్యాలను చూసి ఐఎండీ అనే అంతర్జాతీయ సంస్థ ఈ ర్యాంకులు ఇచ్చింది.

News August 29, 2025

ఖమ్మం: రైల్వే స్టేషన్ సమస్యలపై బీజేపీ చీఫ్‌కు వినతి

image

చింతకాని మండలం నాగులవంచ రైల్వే స్టేషన్‌ ఉన్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. రైల్వేస్టేషన్లో ప్రయాణికులు కూర్చోవడానికి బళ్లలు, మంచినీటి సదుపాయాలు, విద్యుత్తు లైట్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి, తదితరులున్నారు.

News August 29, 2025

HYD: వినాయకుడి మండపాల వద్ద నిరంతరం నిఘా

image

చంద్రాయణగుట్ట, సైదాబాద్, మలక్‌పేట, సంతోష్ నగర్ పరిధిలోని వివిధ వినాయక మండపాల వద్ద 1,135 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీసు సిబ్బంది 345 మంది, 2 ప్లాటూన్ల సిబ్బంది 40 మందితోపాటు సిటీకి చెందిన 750 మంది ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూస్తున్నారు. ఇక శోభాయాత్ర సందర్భంగా మరికొంతమంది భద్రత కోసం వస్తారు.

News August 29, 2025

మెదక్: విఘ్నేశ్వర నీదే భారం.. ఎస్పీ పూజలు

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడికి ఎస్పీ డీవీ శ్రీనివాస రావు పూజలు నిర్వహించారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచేలా పోలీసులకు మనో ధైర్యం ఇవ్వాలని వేడుకున్నారు. గత మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా రక్షణ చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించగా.. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి మొదటిసారిగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.