Telangana

News June 17, 2024

HYD: ఘనంగా బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు

image

HYD, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు సోమవారం ఘనంగా జరుగుతున్నాయి. అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అని అన్నారు. పాతబస్తీ రెయిన్ బజార్‌ ఈద్గా వద్ద చేపట్టిన ఈద్ ఉల్ అదా ప్రత్యేక ప్రార్థనల్లో యాకుత్‌పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ పాల్గొన్నారు.

News June 17, 2024

HYD: ఘనంగా బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు

image

HYD, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు సోమవారం ఘనంగా జరుగుతున్నాయి. అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అని అన్నారు. పాతబస్తీ రెయిన్ బజార్‌ ఈద్గా వద్ద చేపట్టిన ఈద్ ఉల్ అదా ప్రత్యేక ప్రార్థనల్లో యాకుత్‌పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ పాల్గొన్నారు.

News June 17, 2024

HYD: డ్రంక్ అండ్ డ్రైవ్.. 349 మంది పట్టివేత..!

image

సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్ద ఎత్తున డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 349 మంది పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. మొత్తం 253 ద్విచక్ర వాహనాలు, 16 త్రిచక్ర వాహనాలు, 80 ఇతర వాహనాల డ్రైవర్లను పోలీసులు పట్టుకున్నారు.

News June 17, 2024

HYD: డ్రంక్ అండ్ డ్రైవ్.. 349 మంది పట్టివేత..!

image

సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్ద ఎత్తున డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 349 మంది పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. మొత్తం 253 ద్విచక్ర వాహనాలు, 16 త్రిచక్ర వాహనాలు, 80 ఇతర వాహనాల డ్రైవర్లను పోలీసులు పట్టుకున్నారు.

News June 17, 2024

HYD: సివిల్స్ పరీక్ష రాసిన యువకుడి ఆత్మహత్య

image

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. అనంతపురం జిల్లా వాసి సాయి(29) సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు HYD వచ్చాడు. ఈ క్రమంలో పరీక్ష రాసిన సాయి ఆదివారం ఫ్రెండ్స్‌తో కలిసి మదాపూర్‌ అయ్యప్ప సొసైటీ ఓయో హోటల్‌‌కి వెళ్లాడు. ఈ క్రమంలో ఈరోజు హోటల్ బిల్డింగ్ ఆరో అంతస్తుపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. నలుగురు ఫ్రెండ్స్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదైంది.

News June 17, 2024

HYD: సివిల్స్ పరీక్ష రాసిన యువకుడి ఆత్మహత్య 

image

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. అనంతపురం జిల్లా వాసి సాయి(29) సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు HYD వచ్చాడు. ఈ క్రమంలో పరీక్ష రాసిన సాయి ఆదివారం ఫ్రెండ్స్‌తో కలిసి మదాపూర్‌ అయ్యప్ప సొసైటీ ఓయో హోటల్‌‌కి వెళ్లాడు. ఈ క్రమంలో ఈరోజు హోటల్ బిల్డింగ్ ఆరో అంతస్తుపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. నలుగురు ఫ్రెండ్స్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదైంది. 

News June 17, 2024

జగిత్యాల: ఆస్తి తగాదాలతో కుమారుడి హత్య

image

ఆస్తి తగాదాలతో కుమారుడిని తండ్రి హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలు.. కోరుట్ల మండలం మోహనరావుపేటకు చెందిన తండ్రి గంగరాజన్, కుమారుడు రాజేశ్(32) మధ్య ఆదివారం రాత్రి ఆస్తి విషయంలో వివాదం జరిగింది. ఈ క్రమంలో గొడవ మరింత పెరిగి గంగరాజన్ రాజేశ్‌ను కత్తితో దాడి చేశాడు. వెంటనే రాజేశ్‌ను HYD తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. గంగరాజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News June 17, 2024

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి ప్రదర్శన

image

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం HYD మాదాపూర్ శిల్పారామంలో కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం కనువిందుగా సాగింది. నాట్య గురువులు పి.నాగజ్యోతి, సీతా నాగజ్యోతి శిష్యబృందం కూచిపూడి దర్పణం పేరిట చూడముచ్చటైన నృత్యాంశాలు ప్రదర్శించారు. చక్కటి హావభావాలతో కళాకారులు చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఐఏఎస్ అధికారి వి.శేషాద్రి ముఖ్య అతిథిగా విచ్చేసి కళాకారులను అభినందించారు.

News June 17, 2024

సంగారెడ్డి: పెళ్లి చేయడంలేదని యువకుడి సూసైడ్

image

పెళ్లి చేయడంలేదన్న మనస్తాపంతో<<13453836>> యువకుడు సూసైడ్<<>> చేసుకున్నాడు. SI అంబార్య వివరాలు.. మహారాష్ట్రకు చెందిన బాలాజీ(31) కుటుంబం కొన్నేళ్లుగా తిమ్మాపూర్‌లో ఉంటుంది. HYDలో పనిచేస్తున్న బాలాజీ.. తనకు పెళ్లి చేయాలని కోరుతున్నా కుటుంబీకులు పట్టించుకోలేదు. ఇటీవల గ్రామానికి వచ్చిన బాలాజీ ఆదివారం తాగిన మైకంలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. బాలాజీ తల్లి మీరాబాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

News June 17, 2024

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి ప్రదర్శన 

image

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం HYD మాదాపూర్ శిల్పారామంలో కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం కనువిందుగా సాగింది. నాట్య గురువులు పి.నాగజ్యోతి, సీతా నాగజ్యోతి శిష్యబృందం కూచిపూడి దర్పణం పేరిట చూడముచ్చటైన నృత్యాంశాలు ప్రదర్శించారు. చక్కటి హావభావాలతో కళాకారులు చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఐఏఎస్ అధికారి వి.శేషాద్రి ముఖ్య అతిథిగా విచ్చేసి కళాకారులను అభినందించారు.