Telangana

News June 17, 2024

జూరాలకు 8,649 క్యూసెక్కుల వరద

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువలో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం ప్రాజెక్టుకు 8,849 క్యూసెక్కుల వరద వస్తుండగా.. మొత్తం 1,476 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.531 టీఎంసీల నీటినిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.

News June 17, 2024

ఉమ్మడి ADBలో పెండింగ్‌లో ధరణి దరఖాస్తులు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 17 వేలకు పైగా ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో తమ సమస్యలు పరిష్కారం కాకా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుల్లో ఎక్కువగా భూ విస్తీర్ణం, సర్వే నెంబర్లలో తప్పులు, పేరు మార్పిడి, పట్టాల్లో తప్పులు దొర్లడం వంటి అంశాలకు సంధించిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా పెండింగ్ దరఖాస్తులు మంచిర్యాల జిల్లాలో ఉండగా అత్యల్పంగా అదిలాబాద్‌లో ఉన్నాయి.

News June 17, 2024

భద్రాద్రి కొత్తగూడెం: ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ఒకరి మృతి

image

బయ్యారంలో విషాదం జరిగింది. మండలంలోని కోటగడ్డలో ప్రేమికులు ప్రవళిక, రవీందర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రవళిక ఉరేసుకుని మృతి చెందిన విషయం తెలుసుకున్న రవీందర్ కత్తితో గొంతు కోసుకున్నాడు. రవీందర్ పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రవళిక మృతదేహం మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

News June 17, 2024

మహబూబాబాద్: ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ఒకరి మృతి

image

మహబూబాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. బయ్యారం మండలం కోటగడ్డలో ప్రేమికులు ప్రవళిక, రవీందర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రవళిక ఉరేసుకుని మృతి చెందిన విషయం తెలుసుకున్న రవీందర్ కత్తితో గొంతు కోసుకున్నాడు. రవీందర్ పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రవళిక మృతదేహం మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

News June 17, 2024

HYD: చేతబడి.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు..!

image

రంగారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చౌదరిగూడ మండలం రావిర్యాల వాసి పద్మమ్మ చేతబడి చేస్తుందన్న నెపంతో కొందరు ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టారు. పద్మమ్మ శ్మశానం నుంచి మృతదేహాల బూడిద తీసుకొని వచ్చి గ్రామంలోని ఇళ్లపై చల్లుతుండడాన్ని గ్రామస్థులు గమనించి ఆమెను దారుణంగా కొట్టారు. ఆమెపై దాడి చేసిన 9మందిపై కేసు నమోదైంది. మూఢ నమ్మకాలకు దూరంగా ఉండాలని SI సక్రం తెలిపారు.

News June 17, 2024

HYD: చేతబడి.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు..!

image

రంగారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చౌదరిగూడ మండలం రావిర్యాల వాసి పద్మమ్మ చేతబడి చేస్తుందన్న నెపంతో కొందరు ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టారు. పద్మమ్మ శ్మశానం నుంచి మృతదేహాల బూడిద తీసుకొని వచ్చి గ్రామంలోని ఇళ్లపై చల్లుతుండడాన్ని గ్రామస్థులు గమనించి ఆమెను దారుణంగా కొట్టారు. ఆమెపై దాడి చేసిన 9మందిపై కేసు నమోదైంది. మూఢ నమ్మకాలకు దూరంగా ఉండాలని SI సక్రం తెలిపారు.

News June 17, 2024

MBNR: విద్యార్థులకు నీట్ ఉచిత శిక్షణ

image

సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షెడ్యుల్ కులాల బాల, బాలికలకు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఉచితంగా ఇవ్వనున్నట్లు గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి ఫ్లారెన్స్ రాణి తెలిపారు. ఇందుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై, నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు రూ.200లు చెల్లించి ఆన్ లైన్ లో www.tgswreis. telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News June 17, 2024

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జూపల్లి

image

పాలమూరు ప్రజలకు మంత్రి జూపల్లి కృష్ణారావు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు చెప్పారు. త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీక బక్రీద్ అన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ సమైక్యతను సహోదర భావాన్ని అందరూ అనుసరించాలని కోరుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

News June 17, 2024

ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

HYD నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్‌లో విద్యా సంవత్సరానికి డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమో కోర్సుల్లో చేరడానికి ఆసక్తి ఉన్నవారు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రాము యాదవ్ తెలిపారు.ఆర్థికంగా వెనుకబడిన వారికి మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ ద్వారా ఫీజుల్లో రాయితీ కల్పించడానికి ఈ నెల 23న పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైనా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News June 17, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు !

image

♥సర్వం సిద్ధం.. నేడే బక్రీద్ పండుగ
♥రాజోలి:నేటి నుంచి వైకుంఠ నారాయణస్వామి ఉత్సవాలు
♥పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్థానిక ఎంపీలు,ఎమ్మెల్యేలు
♥గండీడ్:నూతన బస్సు సౌకర్యం.. ప్రారంభించనున్న నేతలు
♥త్రాగునీటి సమస్యలపై ప్రత్యేక ఫోకస్
♥అక్రమ ఇసుక తరలింపు పై అధికారుల నిఘా
♥ఉమ్మడి జిల్లాలో.. NMMSకు 257 మంది ఎంపిక
♥ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో నూతన అడ్మిషన్లపై అధికారుల నజర్