India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ HYDలో భయంకరమైన ధార్ గ్యాంగ్ వరుస చోరీలకు పాల్పడుతోంది. తాజాగా హయత్నగర్లో ఒకేసారి 5 ఇళ్లల్లో చోరీలకు పాల్పడింది. దివ్యాంగులు, భిక్షగాళ్లు, పని మనుషుల్లా నటిస్తూ వస్తారని, రెక్కీ నిర్వహించి రాత్రవగానే ఇళ్లలోకి చొరబడతారని పోలీసులు తెలిపారు. అడ్డొచ్చిన వారిని చంపేసేందుకు సైతం వెనకాడరని హెచ్చరించారు. కాలనీల్లో భద్రతా సిబ్బంది నియామకం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటివి చేసుకోవాలన్నారు. SHARE IT
గ్రేటర్ HYDలో భయంకరమైన ధార్ గ్యాంగ్ వరుస చోరీలకు పాల్పడుతోంది. తాజాగా హయత్నగర్లో ఒకేసారి 5 ఇళ్లల్లో చోరీలకు పాల్పడింది. దివ్యాంగులు, భిక్షగాళ్లు, పని మనుషుల్లా నటిస్తూ వస్తారని, రెక్కీ నిర్వహించి రాత్రవగానే ఇళ్లలోకి చొరబడతారని పోలీసులు తెలిపారు. అడ్డొచ్చిన వారిని చంపేసేందుకు సైతం వెనకాడరని హెచ్చరించారు. కాలనీల్లో భద్రతా సిబ్బంది నియామకం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటివి చేసుకోవాలన్నారు.
SHARE IT
కాగజ్నగర్ మండలంలో పులి సంచారం కలకలం రేపింది. మండల సమీపంలోని గోంది అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పిల్లలతో కలిసి స్థావరం ఏర్పాటు చేసుకొని సమీప ప్రాంతాల్లో సంచరిస్తుందన్నారు. దీంతో సమీప మండలాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు భద్రత చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
గ్రేటర్ వరంగల్లోని కాశీబుగ్గ కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్కు చెందిన అద్దెలు ఇద్దరు వ్యక్తులు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ ప్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఆదివారం పోలీసులు విచారణ చేపట్టారు. వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో వివరాలు సేకరించారు. మాజీ కార్పొరేటర్లు ఓని భాస్కర్, అంబి సాంబరాజు, కాంగ్రెస్ నాయకులు దాసరి రాజేశ్, కూచన రవీందర్ తదితరులను పోలీసు స్టేషన్కి పిలిపించి విచారించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వచ్చే 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గ్రేటర్లో 9,103 కిలోమీటర్ల మేర రహదారులున్నాయి. 1,302 కిలోమీటర్ల మేర వరద ప్రవాహ వ్యవస్థ ఉంది. అభివృద్ధి చెందిన నగరాల్లో రహదారులకు ఇరువైపులా వరద నీటి ప్రవాహ వ్యవస్థ ఉంటుంది. కానీ, HYD నగరంలో ఆ పరిస్థితి లేదు. ఇటీవలే గంటసేపు కురిసిన వానకు వర్షపు నీరు రోడ్ల పై నిలిచింది. వరద ఏరులై పారుతోందని, ఇబ్బందులు తప్పడం లేదన్న వివిధ కారణాలతో దాదాపుగా 158 ఫిర్యాదులు అందాయి.
మెదక్ పట్టణంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో జైలులో ఉన్న వ్యక్తులను కలిసేందుకు మెదక్ MP మాధవనేని రఘునందన్ రావుకు హైకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి పొందారు. మెదక్ అల్లర్ల నేపథ్యంలో సుమారు 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జైల్లో ఉన్న హిందువులను కలిసేందుకు ఎంపీ ప్రత్యేక అనుమతి పొందారు. ఈరోజు రాత్రి కలిసేందుకు అనుమతి లభించినట్లు సమాచారం.
గ్రేటర్లో 9,103 కిలోమీటర్ల మేర రహదారులున్నాయి. 1,302 కిలోమీటర్ల మేర వరద ప్రవాహ వ్యవస్థ ఉంది. అభివృద్ధి చెందిన నగరాల్లో రహదారులకు ఇరువైపులా వరద నీటి ప్రవాహ వ్యవస్థ ఉంటుంది. కానీ, HYD నగరంలో ఆ పరిస్థితి లేదు. ఇటీవలే గంటసేపు కురిసిన వానకు వర్షపు నీరు రోడ్ల పై నిలిచింది. వరద ఏరులై పారుతోందని, ఇబ్బందులు తప్పడం లేదన్న వివిధ కారణాలతో దాదాపుగా 158 ఫిర్యాదులు అందాయి.
బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ బక్రీద్ అని ప్రజలంతా సంతోషంగా, భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలన్నారు. సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజావాణి ఉండదని, ప్రజలు దీనిని గమనించి కలెక్టరేట్కి రాకూడదని సూచించారు.
విద్యార్థినీలు తాము ఎంచుకున్న వృత్తితో పాటు లైఫ్ స్కిల్స్ నేర్చుకొని కష్టపడి చదవాలని మహబూబ్నగర్ కలెక్టర్ విజయేంద్ర అన్నారు. ఆదివారం ఏనుగొండలోని కస్తూర్బా గాంధీ, మైనార్టీ బాలికల విద్యాలయం, అర్బన్ జూనియర్ కళాశాలను సందర్శించారు. కష్టపడి చదివి ఉన్నత విద్యనభ్యసించాలని, ఆసక్తి ఉన్న రంగంలో రాణించి జీవితంలో స్థిరపడాలని విద్యార్థినులకు సూచించారు. అనంతరం వంట గదిని పరిశీలించి, మెనూ తెలుసుకున్నారు.
Sorry, no posts matched your criteria.