India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాలో విషాదం జరిగింది. గూగులోతు దేవేందర్ అనే రైతు తన వ్యవసాయ పొలంలో మోటర్ వద్ద వైర్లు సరిచేస్తుండగా.. విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లికి చెందిన రమేశ్ కార్తీక్ నాయక్కు యువ పురస్కార్ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. వివేక్నగర్ తండాలో సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టిన రమేశ్.. గిరిజనుల జీవిత గాథలపై రాసిన తెలుగు కథల సంపుటి ‘ఢావ్లో’ రచనకు యువపురస్కారానికి ఎంపికయ్యారు. అతిపిన్న వయస్సులో రమేశ్ ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. రమేశ్ కార్తీక్ నాయక్ను బీఆర్ఎస్ నేత కేటీఆర్ అభినందించారు.
నకిలీ వైద్యులను గుర్తించి వారిపై NMCచట్టం 34, 54 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు పబ్లిక్ రిలేషన్ కమిటీ ఛైర్మన్ డా.నరేష్ కుమార్ తెలిపారు. కూసుమంచి, నెలకొండపల్లి, ముదిగొండ, పిండిప్రోలు ప్రాంతాల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వైద్య పట్టా లేకుండా వైద్యం ఎవరు చేయరాదని, పారామెడికల్ కోర్సు చేసిన వారు ప్రాథమిక చికిత్స మాత్రమే చేసి వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలన్నారు.
మెదక్ పట్టణంలో బంద్ ప్రశాంతంగా కొనసాతోంది. స్వచ్ఛందంగా వర్తక, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. నిన్న రాత్రి రెండువర్గాల మధ్య ఘర్షణలు జరుగగా.. దానికి నిరసనగా బీజేపీ నాయకులు మెదక్ పట్టణ బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెదక్లో భారీగా పోలీసులు మోహరించారు.
ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని ఖమ్మం మూడో టౌన్, RPF పోలీసులు రక్షించిన ఘటన శనివారం ఖమ్మంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జమ్మికుంటకు చెందిన అనిల్కు భార్యతో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లి కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందాడు. దీంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఖమ్మం మూడో టౌన్
ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు.
జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలంలో ఎలుగుబంటి ఆనవాళ్లు కలకలం రేపాయి. గ్రామస్థుల వివరాల ప్రకారం.. మండలంలోని నల్లబండ శివారులో ఎలుగుబంటి గత రాత్రి ఓ పెద్ద గుంత తవ్విందన్నారు . కాగా ఆ తవ్వకాలను చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటిని పట్టుకోవాలని స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్థులు కోరుతున్నారు.
గ్రేటర్ జోన్లో UPSC పరీక్ష రాస్తున్న అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని గ్రేటర్ ఆర్టీసీ జోన్ ED వేంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఉదయం, మధ్యాహ్నం పరీక్ష రాసే అభ్యర్థులు సమయానికి పరీక్ష సెంటర్లకు వెళ్లేందుకు పూర్తిస్థాయిలో బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. బస్సుల సమాచారం, ఇతర వివరాల కోసం కోఠి 9959226160, రేతిఫైల్ బస్ స్టేషన్9959226154 సెంటర్లలో సంపద్రించవచ్చన్నారు .
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఈనెల 18న జరగాల్సిన ఎంఈడీ మొదటి సెమిస్టర్ 19వ తేదీకి వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. శ్రీరంగ ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలు తెలిపారు. 18న యూజిసి నెట్ ఎగ్జామినేషన్ కారణంగా 19వ తేదీన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
గ్రేటర్ జోన్లో UPSC పరీక్ష రాస్తున్న అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని గ్రేటర్ ఆర్టీసీ జోన్ ED వేంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఉదయం, మధ్యాహ్నం పరీక్ష రాసే అభ్యర్థులు సమయానికి పరీక్ష సెంటర్లకు వెళ్లేందుకు పూర్తిస్థాయిలో బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. బస్సుల సమాచారం, ఇతర వివరాల కోసం కోఠి 9959226160, రేతిఫైల్ బస్ స్టేషన్9959226154 సెంటర్లలో సంపద్రించవచ్చన్నారు .
తాటి చెట్టుపై నుండి కింద పడి గాయపడిన జైపూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు బొంగోని రమేష్ గౌడ్ శనివారం సాయంత్రం మృతి చెందాడు. రమేష్ గౌడ్ ఈ నెల 9న తాటి చెట్టు ఎక్కుతుండగా మోకు జారి కింద పడడంతో మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.