India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 45% జరిగిందని,100 శాతం పూర్తయ్యేలా అధికారులందరు సమన్వయంతో పని చేసి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ పాల్గొని జిల్లాలో అమలు తీరును తెలిపారు.

ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచుల శిక్షణా తరగతుల షెడ్యూల్లో మార్పులు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. మున్సిపాల్ ఎన్నికల కారణంగా కొత్త షెడ్యూల్ విడుదలైంది. మూడో విడత శిక్షణ ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు, నాల్గో విడత ట్రైనింగ్ మార్చి 2 నుంచి 7 వరకు, ఐదో విడత శిక్షణ మార్చి 9 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. అప్పటివరకు సర్పంచులు గ్రామాభివృద్ధి పనుల్లో నిమగ్నం కావాలన్నారు.

మెదక్ జిల్లాలో గల 4 మున్సిపాలిటీలలో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. రామాయంపేటలో 1 నామినేషన్ తిరస్కరించారు. 668 నామినేషన్లు సమర్పించారు. ఇందులో అభ్యర్థులు 415 మంది ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే.. బీఆర్ఎస్ 124, కాంగ్రెస్ 127, బీజేపీ 88, స్వతంత్రులు 52, బీఎస్పీ 6, ఎంఐఎం 8
7, ఇతర రాష్టాల గుర్తింపు 7 నామినేషన్లు సమర్పించారు. 3న ఉపసంహరణ అనంతరం పోటీ అభ్యర్థులు జాబితా స్పష్టం కానుంది.

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కోడ్ ముగిసే వరకు ప్రజల నుంచి వినతుల స్వీకరణ ఉండదని, ఆ తర్వాతే యథావిధిగా కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మార్పును జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

జిల్లాలో జనవరి 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా కొనసాగుతుందని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. మెదక్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 81 మంది బాలలను రక్షించి, 69 మందిని తల్లిదండ్రులకు అప్పగించి, 12 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించినట్లు వివరించారు. 6 పాఠశాలలో ప్రవేశం కల్పించడం అభినందనీయమన్నారు.

జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంటే, మధిరలో మాత్రం వింత పరిస్థితి కనిపిస్తోంది. వైరా, సత్తుపల్లిపట్టణాల్లో అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమవగా, మధిరలోని 22వార్డుల్లో ప్రచారం ఇంకా ఊపందుకోలేదు. కేవలం 1,2వార్డుల్లో మినహా మిగిలిన 20 వార్డుల్లో అభ్యర్థుల సందడి ఎక్కడా కనిపించడం లేదు. ఎలాంటి హడావుడి లేకపోవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

మాస్టర్స్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2026 లాంగ్ జంప్లో రిటైర్డ్ పీడీ డా.కే.ప్రభు సిల్వర్ మెడల్ సాధించారు. జాతీయ స్థాయి పోటీలు రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్లో జరిగాయి. గత నెలలో రాష్ట్ర స్థాయి మాస్టర్ పోటీలు కరీంనగర్లో జరగ్గా గోల్డ్ మెడల్ సాధించారు. జాతీయ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించారు. ప్రభు మెడల్ సాధించడం పట్ల వ్యాయామం ఉపాధ్యాయులు, గుల్షన్ క్లబ్ సభ్యులు అభినందించారు.

2026-27 ఆర్థిక ఏడాది బడ్జెట్ను కౌన్సిల్లో జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టింది. GHMC మొత్తం బడ్జెట్ రూ.11,460 కోట్లుగా పేర్కొంది. ఆదాయం రూ.6,441 కోట్లు, జీహెచ్ఎంసీ ఖర్చు రూ.4,057 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.2,384 కోట్లు, రెవెన్యూ గ్రాంట్స్ రూ.400 కోట్లు, కొత్తగా విలీనమైన మున్సిపాలిటీల కోసం రూ.2,260 కోట్లను కేటాయించింది. విలీనమైన 27 మున్సిపాలిటీల నుంచి వచ్చిన రెవెన్యూ రూ.1,860 కోట్లుగా పేర్కొంది.

మెదక్ జిల్లాలో మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్ అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఈవ్ టీజింగ్కు పాల్పడిన వారిపై 6 ఎఫ్ఐఆర్లు, 12 ఈ–పెట్టీ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రెడ్ హ్యాండెడ్గా తూప్రాన్ సబ్ డివిజన్లో 39 మంది, మెదక్ సబ్ డివిజన్లో 65 మంది, మొత్తం 104 మందిని పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించినట్లు వెల్లడించారు.

మెదక్ జిల్లాలో మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్ అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఈవ్ టీజింగ్కు పాల్పడిన వారిపై 6 ఎఫ్ఐఆర్లు, 12 ఈ–పెట్టీ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రెడ్ హ్యాండెడ్గా తూప్రాన్ సబ్ డివిజన్లో 39 మంది, మెదక్ సబ్ డివిజన్లో 65 మంది, మొత్తం 104 మందిని పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించినట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.