India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యువతిని వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుబాబు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం బోనకల్లు మండల కేంద్రానికి చెందిన గండమాల రాహుల్, HYDకు చెందిన ప్రనీశ్ స్నేహితులు. తన సోదరుడికి స్నేహితుడు కావడంతో ప్రనీశ్ సోదరి కొంతకాలం క్రితం రాహుల్తో సెల్ఫీ దిగింది. దీన్ని అదనుగా తీసుకుని రాహుల్ ఆ యువతికి అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
యువతిని వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుబాబు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం బోనకల్లు మండల కేంద్రానికి చెందిన గండమాల రాహుల్, HYDకు చెందిన ప్రనీశ్ స్నేహితులు. తన సోదరుడికి స్నేహితుడు కావడంతో ప్రనీశ్ సోదరి కొంతకాలం క్రితం రాహుల్తో సెల్ఫీ దిగింది. దీన్ని అదనుగా తీసుకుని రాహుల్ ఆ యువతికి అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
వార్షిక మరమ్మతుల నేపథ్యంలో కొత్తగూడెం థర్మల్ విద్యుత్తు కేంద్రంలో 250 మెగావాట్ల విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. మరో నెలన్నర రోజుల తర్వాతే గ్రిడ్కు ఉత్పత్తి అనుసంధానం చేయనున్నట్లు సీఈ ప్రభాకర్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కర్మాగారంలో చివరిసారిగా 2021లో వార్షిక మరమ్మతులు నిర్వహించారు. అప్పట్లో రూ.36 కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
ఫాస్ట్ బౌలర్ల కోసం HYD క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టాలెంట్ హంట్ చేపడుతోంది. ఈ నెల 22న HYD ఉప్పల్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను HCA అధికారిక వెబ్సైట్ http://www.hycricket.inలో నమోదు చేసుకోవాలని అసోసియేషన్ వివరించింది.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ధని గ్రామానికి చెందిన దివ్యరాణి,రాజ్ కుమార్ దంపతుల రెండేళ్ల కుమారుడు విహాన్ కొంతకాలంగా కిడ్నీలో నొప్పితో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రుల్లో చూపించగా కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. జిల్లా కేంద్రంలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు శస్త్ర చికిత్స చేసి కిడ్నీలో రాళ్లు తొలిగించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేసినట్లు తెలిపారు.
నగరంలోని 3వ టౌన్ పరిధిలో ఉన్న గౌతమ్ నగర్లో వ్యభిచార గృహంపై శనివారం సాయంత్రం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి చేశారు. ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి, సీఐ పురుషోత్తం ఆధ్వర్యంలో శనివారం తనిఖీలు నిర్వహించారు. నలుగురు విటులను అరెస్టు చేసి వారి వద్ద రూ.10వేలు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జేసీబీ తవ్వకాల్లో బంగారం దొరికిందని మోసంతో రూ. 13 లక్షల తీసుకొని నకిలీ బంగారం అప్పగించిన ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం శివారు పాలెం గ్రామానికి చెందిన ఎం.ఆదెప్ప (32)ను అరెస్టు చేసినట్లు గౌరారం ఎస్సై శివకుమార్ తెలిపారు. జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన బలిజ గూడెం స్వామి మోసం చేశారు. వారి వద్ద నుంచి ఏడు లక్షల నగదు స్వాధీనం చేసుకోగా.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు
ఖమ్మం మున్సిపాలిటీ కమిషనర్గా ఉన్న ఆదర్శ్ సురభి వనపర్తి జిల్లాకు కలెక్టర్గా పదోన్నతిపై రానున్నారు. ఆయనకు ఇప్పటికే పెళ్లి కుదరగా, వచ్చే నెల 7న వివాహం చేసుకోనున్నారు. అడిషనల్ కలెక్టర్గా, మున్సిపల్ కమిషనర్గా సేవలందించిన ఆయన త్వరలో కలెక్టర్ హోదాలో ఇంటివాడు కానున్నారు. కాగా.. ప్రస్తుతం వనపర్తి జిల్లా కలెక్టర్గా ఉన్న తేజస్ నందాల్ పవార్ గతేడాది కలెక్టర్ హోదాలోనే వివాహం చేసుకున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెవెన్యూ డివిజన్ పరిధిలోని రేషన్ డీలర్లు ఈనెల 17 వరకు కార్డు దారులకు బియ్యాన్ని పంపిణీ చేయాలని దేవరకొండ పౌరసరఫరాల శాఖ అధికారి హనుమంతు శ్రీనివాస్ గౌడ్ ఓ ప్రకటనలో సూచించారు. ప్రతినెల 15 వరకు బియ్యం పంపిణీ చేస్తున్నారని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో రెండు రోజులు పొడిగించినట్లు తెలిపారు. రేషన్ షాపులను సకాలంలో తెరిచి కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు.
ఫాస్ట్ బౌలర్ల కోసం HYD క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టాలెంట్ హంట్ చేపడుతోంది. ఈ నెల 22న HYD ఉప్పల్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనుంది. ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను HCA అధికారిక వెబ్సైట్ http://www.hycricket.inలో నమోదు చేసుకోవాలని అసోసియేషన్ వివరించింది.
Sorry, no posts matched your criteria.