Telangana

News June 15, 2024

హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా పి. ప్రావీణ్య

image

రాష్ట్రంలో భారీగా వివిధ జిల్లాల కలెక్టర్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణ పేట జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ప్రస్తుతం వరంగల్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పి. ప్రావీణ్యను హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా నియమించారు.

News June 15, 2024

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఆశీష్ సంగ్వాన్

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బదిలీ అయ్యారు. ఆయనను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. కాగా కామారెడ్డి కలెక్టర్‌గా 2016 బ్యాచ్ IAS అధికారి ఆశీష్ సంగ్వాన్ నియమితులయ్యారు. ఈయన నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.

News June 15, 2024

కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా అనురాగ్ జయంతి

image

రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని కరీంనగర్ జిల్లా పాలనాధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత కలెక్టర్ పమెల సత్పతిని బదిలీ చేశారు.

News June 15, 2024

పినపాక: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం గ్రామానికి చెందిన మద్దెల వెంకటరమణ (45) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై శనివారం మృతి చెందింది. గమనించిన కుటుంబ సభ్యులు 108కి సమాచారం తెలపగా పినపాక పిహెచ్‌సీకి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గతంలో తండ్రి మృతి చెందగా, తాజాగా తల్లి మృతి చెందడంతో కూతురు అనాథగా మారింది.

News June 15, 2024

ADB: సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య?

image

ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజానంద్ జైనథ్ హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రేమించిన వాడి కోసం సొంత భార్య.. సుపారీ ఇచ్చి భర్తను దారుణంగా హత్య చేయించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ఫోన్లో సుపారీ గ్యాంగ్‌తో మాట్లాడిన కాల్ డేటా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

News June 15, 2024

చిన్నపొర్లలో భారీగా పోలీసుల మోహరింపు

image

ఊట్కూర్ మండలం చిన్నపొర్లలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భూతగాదాలతో నిన్న సంజప్ప హత్యకు గురైన విషయం విదితమే. కాగా నేడు సంజప్ప అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఈఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.

News June 15, 2024

HYD: ప్రాణాన్ని బలి తీసుకున్న పందేలు

image

పందేలు ఓ ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన శంకర్‌పల్లి PS పరిధిలో జరిగింది. చెందిప్పకు చెందిన సురేందర్(45) ఈనెల 1న గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి సురేందర్ బయటకు వెళ్లారు. ఈ క్రమంలో సరదాగా మాట్లాడుకున్న స్నేహితులు పురుగు మందు తాగితే రూ.లక్ష ఇస్తామని సురేందర్‌తో పందెం కాశారు. దీంతో నిజంగానే పురుగు మందు తాగిన సురేందర్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News June 15, 2024

HYD: ప్రాణాన్ని బలి తీసుకున్న పందేలు

image

పందేలు ఓ ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన శంకర్‌పల్లి PS పరిధిలో జరిగింది. చెందిప్పకు చెందిన సురేందర్(45) ఈనెల 1న గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి సురేందర్ బయటకు వెళ్లారు. ఈ క్రమంలో సరదాగా మాట్లాడుకున్న స్నేహితులు పురుగు మందు తాగితే రూ.లక్ష ఇస్తామని సురేందర్‌తో పందెం కాశారు. దీంతో నిజంగానే పురుగు మందు తాగిన సురేందర్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News June 15, 2024

వరంగల్: 60 కొత్త బస్సులకు ప్రతిపాదనలు

image

మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం 60 నూతన బస్సుల కోసం ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం జిల్లాలోని 9 డిపోల్లో 579 ప్రభుత్వ బస్సులు, 327 అద్దె బస్సులు నడుస్తున్నాయి. ప్రతిపాదనల మేరకు కొత్త బస్సులు వస్తే కొంత మేర బస్సుల్లో రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

News June 15, 2024

KNR: ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. రోడ్డుపై గోడ కట్టిన తల్లిదండ్రులు

image

శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన మమత పొరుగింటి వ్యక్తి రత్నాకర్‌ను 2023లో ప్రేమ వివాహం చేసుకుంది. ఆ పెళ్లి మమత కుటుంబానికి ఇష్టం లేదు. మమత ఇంటి ఎదుట నుంచి రత్నాకర్ ఇంటికి వెళ్లాలి. దీంతో మమత తల్లిదండ్రులు రోడ్డుపై అడ్డంగా గోడ కట్టారు. దీనిపై ఎవరు చెప్పినా వారు వినకపోవడంతో మమత తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.