Telangana

News June 15, 2024

KPHB: లులు మాల్‌కు తాఖీదులు 

image

అక్రమ మురుగు కనెక్షన్లపై జలమండలి దృష్టి సారించింది. KPHBలో తనిఖీలు ముమ్మరం చేసి లులు మాల్‌కు కనెక్షన్ లేదని గుర్తించి నోటీసులు జారీ చేశారు. లులు మాల్‌కు ముందు మంజీరామాల్-మంజీరా మెజిస్టిక్ హోమ్స్‌కు కలిపి ఒకటే ఏస్టీపీ ఉండేది. వేరుగా కనెక్షన్ తీసుకోవాలని మంజీరామాల్‌‌కు గతంలో జలమండలి అధికారులు తాఖీదులు ఇచ్చారు. ఇలా ఒకే కనెక్షన్‌తో ఏళ్లుగా జలమండలి రెవెన్యూ తగ్గిందని మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

News June 15, 2024

HYD: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మనోజ్(24) కొత్తగూడ నీలం మెన్స్ పీజీలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం బైకుపై వెళ్తూ మరో బైకును ఢీకొట్టాడు. ఇద్దరు కిందపడగా మనోజ్ తలకు గాయాలై మృతి చెందాడు. మరో బైకుపై ఉన్న సాయి(23)కి గాయాలుకాగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 15, 2024

HYD: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మనోజ్(24) కొత్తగూడ నీలం మెన్స్ పీజీలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం బైకుపై వెళ్తూ మరో బైకును ఢీకొట్టాడు. ఇద్దరు కిందపడగా మనోజ్ తలకు గాయాలై మృతి చెందాడు. మరో బైకుపై ఉన్న సాయి(23)కి గాయాలుకాగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 15, 2024

కోదాడ: పిడుగుపాటుకు పాడి రైతు మృతి

image

పిడుగు పాటుకు రైతు మృతి చెందిన ఘటన కోదాడ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని నల్లబండ గూడెంకి చెందిన పొందూరు రామారావు గేదెలు పెంచుకుంటూ పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే గేదెలను గుడిబండ రోడ్డులోని వ్యవసాయ భూమిలోకి మేతకు తీసుకెళ్లగా సాయంత్రం ఉరుములతో కూడిన వర్షానికి పిడుగు పడి మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News June 15, 2024

రేగొండ: బైకును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి

image

భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రంగయ్యపల్లి క్రాస్ వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నల్లబెల్లి మండలం ముచింతాల గ్రామానికి చెందిన పులి రవి అనే సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. గోదావరిఖనికి వెళ్లి వస్తున్న ఆయనను పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. 108 వాహనంలో అతని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

News June 15, 2024

2022-24 వరకు కరీంనగర్‌‌లో 516 పోక్సో కేసులు నమోదు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజురోజుకి మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. కరీంనగర్‌ జిల్లాలో 2022లో 68, 2023లో 58, 2024లో 27 పోక్సో కేసులు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్లలో 2022లో 62, 2023లో 42, 2024లో 18, జగిత్యాల జిల్లాలో 2022లో 59, 2023లో 84, 2024లో 48, పెద్దపల్లి జిల్లాలో 2022లో 29, 2023లో 20, 2024లో 01 పోక్సో కేసులు నమోదయ్యాయి.

News June 15, 2024

ఖమ్మం: ఖననం చేసిన వ్యక్తి మృతదేహానికి శవపరీక్ష

image

ఖననం చేసిన వ్యక్తి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించిన ఘటన సత్తుపల్లి మండలం గంగారంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగారంలోని జలగంనగర్-1కు చెందిన విజయకుమారిని జలగంనగర్-2కు చెందిన విజయ్ కుమార్(38)కు ఇచ్చి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేశారు. ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు విచారణ నిమిత్తం పూడ్చిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు.

News June 15, 2024

సికింద్రాబాద్: ఆలస్యంగా విశాఖ.. ప్రయాణికుల తిప్పలు!

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే విశాఖ రైలు పలుమార్లు ఆలస్యంగా రావడం పట్ల ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. విశాఖ రైలు సమయపాలన పాటించేలా రైల్వే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు. ఒక్కోసారి రెండు గంటలకు పైగా ఆలస్యం జరుగుతుందని, అలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

News June 15, 2024

భీంపూర్: పాము కాటుతో మహిళ మృతి

image

భీంపూర్ మండలంలోని కైరి గూడ గ్రామానికి చెందిన మహిళ పెందూర్ లక్ష్మి(30) పాము కాటుకు గురై శుక్రవారం మృతి చెందింది. పెరట్లో పని చేస్తుండగా కాలిపై పాము కాటువేయగా.. ఆ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆమె కుటుంబీకులకు చెప్పారు. అంబులెన్సులో ఆసుపత్రికి తరలించే క్రమంలో పరిస్థితి విషమించి ఆమె మృతి చెందినట్లు ఎస్సై ఖలీల్ తెలిపారు. భర్త ఇది వరకే అనారోగ్యంతో మృతి చెందాడు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు

News June 15, 2024

డిచ్‌పల్లి: సిగరెట్ కొని.. బంగారు గొలుసు లాక్కెళ్లి

image

ఓ మహిళ మెడలోంచి 3 తులాల బంగారు పుస్తెల తాడును లాకెళ్లిన ఘటన డిచ్పల్లి PS పరిధిలో శుక్రవారం జరిగింది. SI మహేష్ వివరాలిలా.. మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో మొగుళ్ల వినోద కిరణా షాప్‌లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి సిగరెట్ తీసుకొని రూ.50 ఇచ్చారు. తిరిగి డబ్బులు ఇచ్చే క్రమంలో మహిళ మెడలోంచి పుస్తెలతాడును లాక్కెళ్లారు. ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.