Telangana

News June 14, 2024

NLG: ఎత్తిపోతల పథకాలకు మహర్దశ

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న ఎడమకాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాలకు మహర్దశ పట్టనుంది. సాగర్ ప్రాజెక్టులో భాగంగా ఎడమ కాల్వ పరిధిలోని ఎగువ భూములకు నీరందించేందుకు 1970లో ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను ప్రారంభించింది. లక్ష ఎకరాలకు నీరిచ్చే లక్ష్యంతో ఉమ్మడి జిల్లా పరిధిలో సాగర్ నుంచి నడిగూడెం వరకు పలు దఫాలుగా మొత్తం 54 లిఫ్టులను ఏర్పాటు చేశారు.

News June 14, 2024

HYD: గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్య పెంచాలి: గుజ్జ సత్యం

image

గ్రూపు-2, 3 పోస్టుల సంఖ్యను పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా HYD కాచిగూడలో ఆయన మాట్లాడుతూ.. గ్రూప్-2 ఎక్సైజ్ ఎస్ఐ ఎత్తు 167.6 నుంచి 165కు తగ్గించాలని, డీఎస్సీ పరీక్షను ఆఫ్ లైన్‌లో నిర్వహించాలని కోరారు. ఎంతో మంది నిరుద్యోగులు జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు.

News June 13, 2024

ADB: ఉమ్మడి జిల్లాలోని నేటి ముఖ్యాంశాలివే..!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు * బెల్లంపల్లిలో కర్రల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా * శ్రీరాంపూర్ గనిలో కార్మికునికి గాయాలు *తానూర్‌లో పిడుగు పడి వ్యక్తి మృతి *మంచిర్యాలలో ప్రహరీ గోడ కూలి ముగ్గురు మృతి *భైంసాలోని ఏకముఖి ఆలయంలో చోరీ *సిర్పూర్‌‌లో అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత *భైంసాలో 2BHK ఇళ్ల కోసం మహిళల రాస్తారోకో *ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం

News June 13, 2024

HYD, RR, MDCLలో వర్షపాతం వివరాలు..

image

HYD, RR, MDCL జిల్లాల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం వేళ మోస్తారు వర్షం కురిసింది. అధికంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మంగళ్‌పల్లిలో 74.5 మిల్లీమీటర్లు, మొయినాబాద్ 55.8, సైదాబాద్ 41, చార్మినార్ 39.8, బండ్లగూడ 30, అంబర్‌పేట్ 28.5, సరూర్ నగర్ 22.3, బహదూర్‌పుర 18.8, నాంపల్లి 17.8, మల్కాజిగిరి 11.8, మారేడ్‌పల్లి 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది.

News June 13, 2024

HYD, RR, MDCLలో వర్షపాతం వివరాలు..

image

HYD, RR, MDCL జిల్లాల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం వేళ మోస్తారు వర్షం కురిసింది. అధికంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మంగళ్‌పల్లిలో 74.5 మిల్లీమీటర్లు, మొయినాబాద్ 55.8, సైదాబాద్ 41, చార్మినార్ 39.8, బండ్లగూడ 30, అంబర్‌పేట్ 28.5, సరూర్ నగర్ 22.3, బహదూర్‌పుర 18.8, నాంపల్లి 17.8, మల్కాజిగిరి 11.8, మారేడ్‌పల్లి 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది.

News June 13, 2024

ఉమ్మడి జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

@MBNR:MLCగా నవీన్ రెడ్డి ప్రమాణస్వీకారం.
@MLC తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రి జూపల్లి.
@ అచ్చంపేటలో అవిశ్వాసం.. కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతి: గువ్వల.
@ కొడంగల్ నియోజకవర్గానికి రూ.73.45 కోట్లు మంజూరు.
@ వనపర్తి: కలెక్టరేట్ ముందు ఆశ వర్కర్ల ధర్నా.
@MBNR:ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించండి: కలెక్టర్.
@ కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డిలను కలిసిన ఉమ్మడి జిల్లా నాయకులు.

News June 13, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల, సిరిసిల్ల కలెక్టరేట్ల ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా.
@ వీర్నపల్లి మండలంలో కుక్కల దాడిలో రెండు దుప్పిలు మృతి.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో మైనర్లు నడిపిన వాహనాలను సీజ్ చేసిన పోలీసులు.
@ జగిత్యాల జిల్లాలో బడిబాటలో పాల్గొన్న కలెక్టర్.
@ మిషన్ భగీరథ సర్వేను పరిశీలించిన సిరిసిల్ల కలెక్టర్.
@ మెట్పల్లి ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే.

News June 13, 2024

PU: ‘ఈ ఏడాది నుంచి నూతన కోర్సులు ప్రారంభించాలి’

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఓఎస్డి మధుసూదన్ రెడ్డికి గురువారం విద్యార్థి సంఘాల నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ విద్యాసంవత్సరం నుండే ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఏం, ఇంజనీరింగ్ బీటెక్, ఎంటెక్ కోర్సులను ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సందే కార్తిక్ మాదిగ, పవన్ కుమార్ రెడ్డి, రూప్ సింగ్ నాయక్, మీసాల గణేష్ మాదిగ, బత్తిని రాము మాదిగ తదితరులు పాల్గొన్నారు.

News June 13, 2024

KNR: ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్.. 40 మంది మైనర్లు పట్టివేత

image

కరీంనగర్ పట్టణంలోని పలుచోట్ల టౌన్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో గురువారం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపిన దాదాపు 40 మంది మైనర్లు పట్టుబడ్డారన్నారు. పట్టుబడిన వాహనాలను KNR ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన లేని మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలువ్వొద్దన్నారు.

News June 13, 2024

ఖమ్మం: పిడుగుపాటుతో గీత కార్మికుడు మృతి.!

image

పిడుగుపాటుతో గీత కార్మికుడు మృతి చెందిన ఘటన గురువారం బోనకల్ మండలంలో చోటు చేసుకుంది. మోటమర్రి గ్రామానికి చెందిన చిట్టిమోదు విష్ణు చెట్టుపై కల్లు గీస్తుండగా ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విష్ణు మృతితో వారి కుటుంబంలో, ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అటు సిరిపురంలో పిడుగుపాటుకు రైతులు శ్రీనివాసులు, నారాయణకు చెందిన రెండు పాడిగేదెలు మృతి చెందాయి.