Telangana

News June 11, 2024

HYD: ఆ ప్రచారం నమ్మకండి: బల్మూరి వెంకట్

image

పదేళ్లు KCR గడీల పాలన సాగిందని, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతే గడీల పాలనకు స్వస్తి పలికామని MLC బల్మూరి వెంకట్ అన్నారు. ఈరోజు HYDలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజా పాలన వచ్చిందన్నారు. పింక్ మీడియా అసత్యపు ప్రచారం చేస్తోందని, కొత్త యూట్యూబ్ ఛానల్స్ పెట్టి నెలకు రూ.3 లక్షలు ఇస్తున్నారన్నారు. TSకు బదులు TGగా మార్చినందుకు రూ.4 వేల కోట్లు ఖర్చు అవుతాయనేది అబద్ధమన్నారు.

News June 11, 2024

HYD: ఆ ప్రచారం నమ్మకండి: బల్మూరి వెంకట్ 

image

పదేళ్లు KCR గడీల పాలన సాగిందని, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతే గడీల పాలనకు స్వస్తి పలికామని MLC బల్మూరి వెంకట్ అన్నారు. ఈరోజు HYDలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజా పాలన వచ్చిందన్నారు. పింక్ మీడియా అసత్యపు ప్రచారం చేస్తోందని, కొత్త యూట్యూబ్ ఛానల్స్ పెట్టి నెలకు రూ.3 లక్షలు ఇస్తున్నారన్నారు. TSకు బదులు TGగా మార్చినందుకు రూ.4 వేల కోట్లు ఖర్చు అవుతాయనేది అబద్ధమన్నారు.  

News June 11, 2024

HYD: అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్‌లో ఉద్యోగ భర్తీలకు నోటిఫికేషన్

image

HYD నానక్‌రామ్‌గూడలో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో ఉద్యోగ భర్తీలకు నోటిఫికేషన్ విడుదలైంది. భర్తీలో భాగంగా స్ట్రాటజిక్ కంటెంట్ కోఆర్డినేషన్ అసిస్టెంట్- కమ్యూనిటీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం కమ్యూనికేషన్స్, బిజినెస్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. SHARE IT

News June 11, 2024

HYD: అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్‌లో ఉద్యోగ భర్తీలకు నోటిఫికేషన్

image

HYD నానక్‌రామ్‌గూడలో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో ఉద్యోగ భర్తీలకు నోటిఫికేషన్ విడుదలైంది. భర్తీలో భాగంగా స్ట్రాటజిక్ కంటెంట్ కోఆర్డినేషన్ అసిస్టెంట్- కమ్యూనిటీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం కమ్యూనికేషన్స్, బిజినెస్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. SHARE IT

News June 11, 2024

సూర్యాపేట: గుండెపోటుతో విద్యుత్ లైన్ ఇన్స్‌పెక్టర్ మృతి

image

కోదాడకి చెందిన విద్యుత్ లైన్ ఇన్స్‌పెక్టర్ దేవరపల్లి సీతారెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం వాకింగ్‌కి వెళ్లి వచ్చిన ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. వైద్యశాలకు తరలించే లోపు ఆయన కన్నుమూశారు. కాగా ఆయన భార్య అనురాధ గుడిబండ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. సీతారెడ్డి మృతి పట్ల విద్యుత్, విద్యాశాఖ ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.

News June 11, 2024

వరదలకు సంబంధించి ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌పై మంత్రి స‌మీక్ష

image

ప్రజా పాలనలో భాగంగా మంత్రి సీతక్క రాష్ట్ర స‌చివాల‌యంలో వరదలకు సంబంధించి ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. ఆమె మాట్లాడుతూ.. ముంద‌స్తుగా స‌మ‌స్య‌ల‌ను గుర్తించి వాటిని ప‌రిష్కరించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా కొత్త కనెక్షన్, పాత కనెక్షన్‌పై సమీక్షించారు. పాత గృహాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని ఆదేశాలిచ్చారు.

News June 11, 2024

వరంగల్: వైద్య కళాశాల భవనాన్ని సందర్శించిన కలెక్టర్

image

వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య నేడు నర్సంపేట పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా పట్టణంలో నిర్మాణంలో ఉన్న నర్సంపేట వైద్యకళాశాల భవనాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మ్యాపును పరిశీలించి, అధికారులకు కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. నిర్మాణంలో అలసత్వం వహించవద్దని, నాణ్యత ప్రమాణాలు పాటించి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

News June 11, 2024

HYD: సెక్రటేరియట్‌లో కొత్త రూల్స్ ఇవే..!

image

HYD ఖైరతాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు నుంచి కొత్త రూల్స్ అమలు కానున్నాయి. గేట్ నంబర్-4 నార్త్ ఈస్ట్ గేటు ద్వారా లోపలికి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ రానుంది. మంత్రులు, సీఎస్, డీజీపీతో సహా ఇదే గేటు నుంచి లోపలికి రానున్నారు. ఇక ఐఏఎస్, ఐపీఎస్, ఇతర వీఐపీలకు సౌత్ ఈస్ట్ గేట్-2 ద్వారా ఎంట్రీ ఉండనుంది. ఇంకా మరమ్మతులు పూర్తి కాని వెస్ట్ గేట్-3 అలాగా ఉండనుండగా ఈస్ట్ గేట్-2ను మూసివేయనున్నారు.

News June 11, 2024

HYD: సెక్రటేరియట్‌లో కొత్త రూల్స్ ఇవే..!

image

HYD ఖైరతాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు నుంచి కొత్త రూల్స్ అమలు కానున్నాయి. గేట్ నంబర్-4 నార్త్ ఈస్ట్ గేటు ద్వారా లోపలికి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ రానుంది. మంత్రులు, సీఎస్, డీజీపీతో సహా ఇదే గేటు నుంచి లోపలికి రానున్నారు. ఇక ఐఏఎస్, ఐపీఎస్, ఇతర వీఐపీలకు సౌత్ ఈస్ట్ గేట్-2 ద్వారా ఎంట్రీ ఉండనుంది. ఇంకా మరమ్మతులు పూర్తి కాని వెస్ట్ గేట్-3 అలాగా ఉండనుండగా ఈస్ట్ గేట్-2ను మూసివేయనున్నారు.

News June 11, 2024

రాజన్న దర్శనానికి వచ్చి గుండెపోటుతో జనగామ వాసి మృతి

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చి గుండెపోటుతో భక్తుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన వినయ్ కుమార్.. రాజన్న దర్శనం చేసుకున్నాడు. అనంతరం బద్ది పోచమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లే మార్గ మధ్యలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికుల సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వినయ్ మృతి చెందాడు.