India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరారు.. గ్రామానికి సమీపంలోని పోగాకు కంపెనీ వద్ద జాతీయ రహదారిపై హైదారాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న ఆర్టీసీ సూపర్ డీలక్స్ బస్సు, టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఎక్స్ ఎల్ పై ఉన్న పెండ్లి రాముడు అక్కడిక్కడే మృతి చెందగా శేఖర్ ఆసుపత్రికు తరలిస్తున్న మార్గమధ్యలో మృతి చెందాడు
MHBD(D) కేసముద్రం(M)లో మతిస్తిమితం లేని మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈనెల 10న ఇద్దరు యువకులు సదరు మహిళ ఇంటికి వెళ్లారు. వారిలో ఒకరు ఆమె కొడుకును బయటకు తీసుకెళ్లగా, మరొక వ్యక్తి అత్యాచారం చేశాడు. బయటకు వెళ్లేటప్పుడు ఆమె కొడుకు ఫోన్లో వీడియో రికార్డింగ్ పెట్టి వెళ్లడంతో ఈ విషయం బయటపడింది. మహిళ కుటుంబం ఫిర్యాదుతో PSలో కేసు నమోదైంది.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.
☞సురవరం <<14119741>>ప్రతాపరెడ్డి <<>>జన్మించిన గ్రామం? – ఇటిక్యాలపాడు
☞ఉమ్మడి జిల్లాలో ఏర్పాటైన తొలి ప్రాజెక్టు? – కోయిల్సాగర్
☞‘శతపత్రం’ పుస్తకాన్ని ఎవరు రచించారు? – రామకృష్ణశర్మ
☞గద్వాల కోటను ఎవరు నిర్మించారు? – రాజా పెద్ద సోమభూపాలుడు, 1666
☞శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని ఎవరు నిర్మించారు? – రాజా బహిరీ గోపాలరావు
SHARE IT..
HYD బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం ప్రతీ సంవత్సరం ఎంతో ఉత్కంఠ నడుమ కొనసాగుతుంది. అయితే ప్రతిసారి ఇందులో పురుషులే పాల్గొంటూ ఉంటారు. కానీ 2009లో మాత్రం సరిత అనే మహిళ వేలంలో పాల్గొని రూ.5,10,000కు లడ్డూ కైవసం చేసుకుని సత్తా చాటారు. 1994 నుంచి 2024 వరకు 30 ఏళ్లలో బాలాపూర్ లడ్డూ కొన్న ఒకే ఒక్క మహిళగా సరిత నిలిచారు. ఈసారి రూ.30,01,000కు కొలన్ శంకర్ రెడ్డి లడ్డూ దక్కించుకున్న విషయం తెలిసిందే.
HYD బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం ప్రతీ సంవత్సరం ఎంతో ఉత్కంఠ నడుమ కొనసాగుతుంది. అయితే ప్రతిసారి ఇందులో పురుషులే పాల్గొంటూ ఉంటారు. కానీ 2009లో మాత్రం సరిత అనే మహిళ వేలంలో పాల్గొని రూ.5,10,000కు లడ్డూ కైవసం చేసుకుని సత్తా చాటారు. 1994 నుంచి 2024 వరకు 30 ఏళ్లలో బాలాపూర్ లడ్డూ కొన్న ఒకే ఒక్క మహిళగా సరిత నిలిచారు. ఈసారి రూ.30,01,000కు కొలన్ శంకర్ రెడ్డి లడ్డూ దక్కించుకున్న విషయం తెలిసిందే.
భార్య గొంతుకోసి భర్త హత్య చేసిన ఘటన వర్నిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన పెంటవ్వ(46), భర్త బాలయ్య మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న బాలయ్య క్షణికావేశంలో కొడవలితో ఆమె గొంతు కోయడంతో పెంటవ్వ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ MLA పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి,
సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ ఎస్ఎన్ఎం క్లబ్ జంక్షన్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ, కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కలెక్టర్ సత్యశారదదేవి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, తదితరులు ఉన్నారు.
హైదరాబాద్ బస్ భవన్లో మంగళవారం ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ ఘనంగా జరిగింది. TGSRTC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) మునిశేఖర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఫైనాన్స్ అడ్వజర్ విజయపుష్ఫ, హెచ్వోడీలు, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.