India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అక్రిడిటేషన్ కార్డుల జారీపై ఉన్న జీవో 252లో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. జీవో ఆర్టీ నంబర్ 103 ద్వారా ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల్లో మహిళలకు 33 శాతం తప్పనిసరి చేసింది. మీడియా కార్డు బదులు అక్రిడిటేషన్ పేరుతోనే కార్డు జారీ చేయనుంది. సర్క్యులేషన్ ఆధారంగా అదనపు అక్రిడిటేషన్లకు అవకాశం కల్పించడంతో పాటు, వివిధ విభాగాల్లో పనిచేసేవారికి కార్డులు రానున్నాయి.

మిమ్మల్ని ఎవరైనా వేధిస్తున్నారా..? మౌనంగా భరించకండి. మీకు పోలీసులు అండగా ఉన్నారని చెబుతున్నారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. ఆడపిల్లలను ఎవరు వేధించినా కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. నిందితులకు భయపడకుండా వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని, బాధితుల వివరాలు సీక్రెట్గా ఉంచుతామని తెలిపారు. 9490616555 నంబరుకు వాట్సప్ ద్వారా లేదా, 100కు డయల్ చేసినా క్విక్ రెస్పాన్స్ ఉంటుందంటున్నారు. SHARE IT.

బాలికల పట్ల వివక్ష తగదని, జిల్లాలో బాలికల నిష్పత్తి తగ్గడానికి కారణాలను విశ్లేషిస్తూ తగిన చర్యలు తీసుకోవడానికి కార్యక్రమాలు చేపడుతున్నామని హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. అందుకు సంబంధించిన ప్రచారపత్రాలను పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లోని హెల్త్ స్టాల్ వద్ద ఆవిష్కరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేయడం నేరమని, అలాంటి వారి గురించి 63000 30940 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు.

<<18954194>>రుద్రమదేవి..<<>>దక్షిణ భారత సింహాసనాన్ని అధిరోహించిన తొలి ధీరవనిత. కాకతీయ వంశంలో కాంతులు చిందించిన మహారాణి. దేవగిరి రాజు మహాదేవుడి దండయాత్రలను ధైర్యసాహసాలతో తిప్పికొట్టిన ధైర్యశాలి. నాయంకర వ్యవస్థను అమలు చేసి చరిత్రలో నిలిచారు. గొలుసుకట్టు చెరువులకు ఆజ్యం పోసి నీటిని ఒడిసిపట్టేలా చేశారు. ఓరుగల్లు కోటకు మెరుగులద్దారు. 8పదుల వయసులో కదన రంగంలోకి దిగి కాయస్త అంబదేవుడితో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు.

<<18954194>>రుద్రమదేవి..<<>>దక్షిణ భారత సింహాసనాన్ని అధిరోహించిన తొలి ధీరవనిత. కాకతీయ వంశంలో కాంతులు చిందించిన మహారాణి. దేవగిరి రాజు మహాదేవుడి దండయాత్రలను ధైర్యసాహసాలతో తిప్పికొట్టిన ధైర్యశాలి. నాయంకర వ్యవస్థను అమలు చేసి చరిత్రలో నిలిచారు. గొలుసుకట్టు చెరువులకు ఆజ్యం పోసి నీటిని ఒడిసిపట్టేలా చేశారు. ఓరుగల్లు కోటకు మెరుగులద్దారు. 8పదుల వయసులో కదన రంగంలోకి దిగి కాయస్త అంబదేవుడితో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు పలు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనాలు హాజరయ్యారు. కానీ ఏర్పాట్లు మాత్రం అధ్వానంగా ఉన్నాయని వచ్చిన వారు మండిపడుతన్నారు. కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడంతో పసిపిల్లలను ఎత్తుకుని ఎండలో నిలబడ్డారు.

రెండు మూడు రోజుల్లో మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలుండటంతో జిల్లాలో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. నల్గొండలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ నాలుగు డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించింది. రిజర్వేషన్ల మార్పులు, ఒక్కో వార్డులో పలువురు ఆశావహులు ఉండటంతో ఎంపిక కష్టంగా మారింది. గెలుపు గుర్రాల కోసం ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేశారు.

బోధన్ రూరల్ PS పరిధిలో గుర్తుతెలియని అడ్డా కూలీ మృతి చెందాడు. సాలంపాడ్ గ్రామానికి చెందిన వ్యక్తి నాని అనే కూలీని పనికి తీసుకెళ్లగా, పని అనంతరం అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సదరు కూలీ మరణించాడు. మృతుడు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాడని తెలుస్తోంది. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే బోధన్ రూరల్ ఎస్సై 87126 59872 నంబరుకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర వేడుకలు వైభవంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని మేయర్ ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి పలువురు వికలాంగులకు పరికరాలను అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మహబూబ్నగర్ పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. కలెక్టర్ విజయేందిర బోయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ అమలు స్ఫూర్తితో వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.