India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డు ప్రమాదంలో జడ్చర్లకు చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. మండలానికి చెందిన ఆంజనేయులు భిక్షాటన చేస్తూ.. ప్లాస్టిక్ కవర్లు, కాగితాలు అమ్ముకుంటూ జీవించేవాడు. సోమవారం అర్ధరాత్రి నందిగామ శివారులో రోడ్డు దాటుతున్న క్రమంలో వాహనం ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆంజనేయులు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదైంది.
ఇస్రో నిర్వహిస్తున్న యువిక -2025 యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కొలకాని అశ్విని ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఇస్రోకు చెందిన 8 పరిశోధన కేంద్రాలలో మేలో 12 రోజులు అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణ నుంచి ఎంపికైన 12 మందిలో అశ్విని ఒకరు కావడం విశేషం. దీంతో అశ్వినికి టీచర్లు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
మిర్చి సాగులో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో నిలువగా, రాష్ట్రంలో ఖమ్మం ప్రథమ స్థానంలో ఉంది. కానీ ఖమ్మం మిర్చి రైతుల చిరకాల వాంఛ మిర్చి బోర్డు ఏర్పాటుపై సంధిగ్ధo నెలకొంది. ప్రస్తుతం ధరలు క్వింటాకు రూ.13-15 వేల మధ్యే నడుస్తుండగా, బోర్డు ఏర్పాటైతే రూ.20-25 వేలు పలుకుతుందనే ఆశలు వారిలో రేకేత్తిస్తున్నాయ్. నిర్ణీత ధర లేక నష్టపోతున్న రైతన్నలు బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గోషామహల్ MLA రాజాసింగ్పై మంగళ్హాట్ PSలో 3 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ ప్రసంగిస్తున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం వద్దకు తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతుండగా ‘భక్తులు, కార్యకర్తలపై లాఠీలు ఝళిపిస్తే లాఠీలకు పనిచెప్పాల్సి వస్తుంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేశారు.
సిద్దిపేట జిల్లాలో బర్డ్ఫ్లూ భయం పట్టుకుంది. తొగుట మండలం కన్గల్లోని ఓ లేయర్ కోళ్ల ఫామ్లోని కోళ్లకు H5N1(బర్డ్ఫ్లూ) నిర్ధరణ కావడంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. బర్డ్ఫ్లూ వ్యాపించకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఫాంలోని కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో భూమిలో పూడ్చివేయనున్నారు.
గోషామహల్ MLA రాజాసింగ్పై మంగళ్హాట్ PSలో 3 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ ప్రసంగిస్తున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం వద్దకు తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతుండగా ‘భక్తులు, కార్యకర్తలపై లాఠీలు ఝళిపిస్తే లాఠీలకు పనిచెప్పాల్సి వస్తుంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేశారు.
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ∆} ఖమ్మం నగరంలో జాబ్ మేళా ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన ∆} ప్రశాంతంగా కొనసాగుతున్న SSC జవాబుపత్రాల మూల్యాంకనం.
మహబూబ్నగర్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. మంగళవారం కౌకుంట్ల మండలంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భానుడి ప్రతాపానికి ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. మే నెలలో ఇంకా ఎంత ఎండ ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. వాహనదారులు నిమ్మరసం, పండ్ల రసాలు, జ్యూస్ వంటి శీతల పానీయాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారని తెలిపారు.
జగిత్యాలకు ఈ పేరు రావడానికి పలు రకాల కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. క్రీ.శ. 1110 నుంచి 1116 వరకు పొలాస రాజధానిగా జగ్గ దేవుడు పరిపాలించాడు. తన పరిపాలనా కాలంలో 21 యుద్ధాలు చేసి పరిసర ప్రాంతాల్లో పలు నూతన గ్రామాలను స్థాపించాడు. పొలాస దక్షిణాన 6 కి.మీ. దూరంలో జయదేవుడు అతని పేరిట జగ్గ దేవాలయం నిర్మించి ఉంటాడని, అదే జగిత్యాల స్థిరపడిందని చరిత్రకారుల కథనం. 2016లో జగిత్యాల ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది.
నిర్మల్ పట్టణ ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు అతని 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.
Sorry, no posts matched your criteria.