India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గ్రామీణ ప్రాంతాల వారికి SBI, RSETI ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకం కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. నేటి నుంచి ఈ శిక్షణ ప్రారంభమవుతుంది. ఉచిత భోజనం, వసతి ఉంటుందన్నారు. 19-45 ఏళ్ల లోపు ఉన్నవారు టెన్త్ మెమో,ఆధార్ కార్డ్,రేషన్ కార్డ్, 3 ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 95424 30607కు సంప్రదించాలన్నారు.

కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచడంతో ఉమ్మడి NLG జిల్లాలోని 5.69 లక్షల మంది కూలీలకు లబ్ధి చేకూరనుంది. జిల్లాలో మొత్తం 7.66 లక్షల జాబ్ కార్డులు ఉండగా.. నల్గొండలో 3.60 లక్షలు, సూర్యాపేటలో 2.63 లక్షలు, యాదాద్రిలో 1.43 లక్షల కార్డులు ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన VB-G RAM G పథకం కింద పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచడం విశేషం. ఈ నిర్ణయంతో గ్రామీణ కూలీలకు ఆర్థిక భరోసా లభించనుంది.

జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 86 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 143 కళాశాలల నుంచి.. 9,251 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. రెండు విడతలుగా జరిగే ప్రయోగ పరీక్షలకు జిల్లా పరిధిలో అన్ని ఏర్పాట్లు అయ్యాయి.

తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ ప్రకటనతో MLG జిల్లా ఏర్పాటు డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఫిబ్రవరి 4న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం MLGలో పర్యటించనున్నారు. జిల్లా ఏర్పాటుపై ఆయన ఏదైనా కీలక ప్రకటన చేస్తారా అని పట్టణ వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దశాబ్దాల కల అయిన జిల్లా ఏర్పాటుపై చర్చ రాజకీయ వర్గాల్లో వేడెక్కింది. CM పర్యటనతో జిల్లా వాసుల నిరీక్షణకు తెరపడుతుందో లేదో చూడాలి.

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే నెల 11న పోలింగ్ జరగనుండగా.. ప్రధాన పార్టీలన్నీ మేయర్ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ BC జనరల్కు రిజర్వ కావడంతో హేమాహేమీలు రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ తన అధికార బలాన్ని, BRS తన పట్టును, BJP ఎంపీ చరిష్మాను నమ్ముకున్నాయి. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తూ ఉత్కంఠను రేపుతున్నాయి.

KNRకు బడ్జెట్లో మరోసారి నిరాశే ఎదురైంది. స్మార్ట్ సిటీకి నిర్మలమ్మ ‘పద్దు’ కరుణించలేదు. ఏళ్ల తరబడి ఊరిస్తున్న హసన్పర్తి రైల్వే లైన్, గ్రానైట్ పరిశ్రమకు ప్రోత్సాహకాలు వంటి అంశాలపై స్పష్టత కరువైంది. టెక్స్టైల్ రంగానికి కొంత ఊరట ఉన్నా, జిల్లాకు ప్రత్యేక పారిశ్రామిక కేటాయింపులు లేకపోవడంతో నిరుద్యోగులు, పారిశ్రామికవేత్తలు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్ నిరాశ కల్పించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 1098 చైల్డ్ హెల్ప్ లైన్కు సమాచారం అందించాలని ఎస్పీ డి.జానకి విజ్ఞప్తి చేశారు. బాల కార్మికత్వం సమాజానికి ముప్పుగా మారుతోందని, పిల్లల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ తరహా అక్రమాలపై ఇకపై కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరిస్తూ.. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. SHARE IT

సౌత్ జోన్లో పాల్గొనేందుకు PU క్రాస్ కంట్రీ (స్త్రీ,పురుషుల) ఫిబ్రవరి 3న యూనివర్సిటీలోని సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్లో నిర్వహిస్తున్నట్లు PD డా.వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ముఖ్య అతిథిగా VC ప్రొఫెసర్ జీఎన్.శ్రీనివాస్,రిజిస్టర్ పూస రమేష్ బాబు హాజరుకానున్నారు. 17-25 ఏళ్ల లోపు ఉన్న క్రీడాకారులు అర్హులని,ప్రిన్సిపల్ సంతకంతో కూడిన బోనఫైడ్, ఎలిజిబిలిటీ ఫామ్ను తీసుకొని రావాలన్నారు.

వైరాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్గాల నుంచి పోటాపోటీగా నామినేషన్లు దాఖలు కావడంతో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ రంగంలోకి దిగారు. ఆయన మంత్రి పొంగులేటితో చర్చించి, ఒక వర్గానికి ఛైర్మన్, మరో వర్గానికి వైస్ ఛైర్మన్ పదవి ఇచ్చేలా రాజీ కుదిర్చారు. ముఖ్య నేతలకు భవిష్యత్తులో పదవులు ఇస్తామని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి అంతర్గత విభేదాలు సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని B.Tech మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపుకు నేడే చివరి తేదీ అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈరోజు సాయంత్రం 5 గం.లోపు చెల్లించాలని ఆయన వెల్లడించారు. అపరాధ రుసుము రూ.100 తో రేపటికి చివరి తేదీయని పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.
Sorry, no posts matched your criteria.