Telangana

News September 17, 2024

వరంగల్: అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు

image

వరంగల్ ఎస్ఎన్ఎం క్లబ్ జంక్షన్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ, కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కలెక్టర్ సత్యశారదదేవి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, తదితరులు ఉన్నారు.

News September 17, 2024

బస్‌ భవన్‌లో ప్ర‌జా పాల‌న దినోత్స‌వ వేడుకలు

image

హైదరాబాద్ బస్‌ భవన్‌లో మంగ‌ళ‌వారం ‘తెలంగాణ ప్ర‌జా పాల‌న దినోత్స‌వం’ ఘ‌నంగా జ‌రిగింది. TGSRTC ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్(ఆప‌రేష‌న్స్) మునిశేఖ‌ర్ జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేసి జెండా వంద‌నం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ ర‌వింద‌ర్, జాయింట్ డైరెక్ట‌ర్ అపూర్వ‌రావు, ఫైనాన్స్ అడ్వ‌జ‌ర్ విజ‌య‌పుష్ఫ‌, హెచ్‌వోడీలు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

News September 17, 2024

బాలాపూర్ లడ్డూ స్పెషల్.. ఒక్కరే ఐదు సార్లు..!

image

HYD బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. కాగా 1994లో ఈ వేలం ప్రారంభమవగా తొలిసారి కొలన్ మోహన్ రెడ్డి రూ.450కి లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం ఆయనే 1995లో రూ.4,500, 1998లో రూ.51,000, 2004లో రూ.2,01,000, 2008లో రూ.5,07,000 వేలం పాడి ఐదు సార్లు లడ్డూ కైవసం చేసుకున్నారు. గత 30 ఏళ్లలో ఆయన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. SHARE IT

News September 17, 2024

బాలాపూర్ లడ్డూ స్పెషల్.. ఒక్కరే ఐదు సార్లు..!

image

HYD బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. కాగా 1994లో ఈ వేలం ప్రారంభమవగా తొలిసారి కొలన్ మోహన్ రెడ్డి రూ.450కి లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం ఆయనే 1995లో రూ. 4,500, 1998లో రూ.51,000, 2004లో రూ.2,01,000, 2008లో రూ.5,07,000 వేలం పాడి ఐదు సార్లు లడ్డూ కైవసం చేసుకున్నారు. గత 30 ఏళ్లలో ఆయన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. SHARE IT

News September 17, 2024

కొత్తగూడెం: అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన మంత్రి తుమ్మల

image

ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేశ్ వి పార్టీ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News September 17, 2024

వరంగల్: జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్, ఎంపీ

image

వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. అనంతరం ముఖ్యఅతిథి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎంపీ మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

News September 17, 2024

ప్రజా పాలనను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాం: జూపల్లి

image

ప్రజా పాలన అంటే ఇలా ఉంటుందో ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 6 గ్యారంటీల అమలుపైనే తమ దృష్టి అంతా ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

News September 17, 2024

ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

image

నల్గొండ పట్టణంలోని పోలీస్ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను మంత్రి కోమటిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం బాల బాలికల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ పవర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బాలునాయక్ తదితరులున్నారు.

News September 17, 2024

SKZR: నవోదయ దరఖాస్తు గడువు పెంపు

image

కాగజ్‌నగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 23 వరకు గడువు పెంచినట్ల ప్రిన్సిపల్ కొడాలి పార్వతి తెలిపారు. ఈ నెల 16తో గడువు ముగియగా విద్యాలయ సమితి తిరిగి గడువు పెంచినట్లు పేర్కొన్నారు. కాగా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News September 17, 2024

మధిర: ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన దాల్ గోపి (30) గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన గోపి ఇంటి వెనుక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలిస్తున్నారు.