Telangana

News June 8, 2024

గ్రూప్-1 ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

రేపు గ్రూప్-1 పరీక్ష జరుగుతున్న దృష్ట్యా యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే భువనగిరిలోని జాగృతి, మదర్ థెరిసా కాలేజీలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. నిరుద్యోగులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

News June 8, 2024

ఆటా మహాసభల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

image

అమెరికాలోని అట్లాంటా నగరంలో జరుగుతున్న 18వ ఆటా మహాసభలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. వారి వెంట తెలంగాణ ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రవాస భారతీయులు తదితరులున్నారు.

News June 8, 2024

ADB: పారదర్శకంగా హోంగార్డుల బదిలీ ప్రక్రియ పూర్తి: ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లాలో హోంగార్డుల బదిలీ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం హోంగార్డుల బదిలీ ప్రక్రియను నిర్వహిస్తున్నామన్నారు. హోంగార్డులను లక్కీ లాటరీ విధానం ద్వారా బదిలీ ప్రక్రియను నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

News June 8, 2024

కోకా కోల డైరెక్టర్‌తో మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు భేటీ

image

అమెరికా పర్యటనలో ఉన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు శనివారం అట్లాంటాలోని కోకా కోలా హెడ్ క్వార్టర్స్‌లో కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్ డైరెక్టర్ జోనాథన్ రీఫ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోకా-కోలా మేనేజ్ మెంట్‌ను ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులను విజువల్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు.

News June 8, 2024

UPDATE: చెరువులో గల్లంతయిన వ్యక్తి లభ్యం

image

తూప్రాన్ పట్టణంలోని కొత్తచెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతైన సంగారెడ్డి చెందిన నర్సింలు (50) మృతదేహం అభ్యమైంది. నిన్న ఉదయం తూప్రాన్‌కు చెందిన టేకు పోచయ్య, జెడిగాడి దేవేందర్‌లతో కలిసి నరసింహులు కొత్తచెరువులో చేపలు పట్టేందుకు వెళ్ళాడు. అందులో పడిన గాలం తీసేందుకు చెరువులోకి దిగి గల్లంతయ్యాడు. ఈరోజు నర్సింలు మృతదేహం లభించింది.

News June 8, 2024

WGL: RMP వైద్యం.. చేయి తొలగించాలన్న నిమ్స్ వైద్యులు

image

వైద్యం వికటించడంతో ఓ మహిళ చేయి తొలగించాలని వైద్యులు సూచించిన ఘటన హన్మకొండ జిల్లా ఐనవోలులో జరిగింది. బాధితుల ప్రకారం.. ఉప్పలమ్మ అనే మహిళ గత నెల 30న వాంతులు చేసుకుంది. కుటుంబీకులు స్థానిక RMP వద్దకు తీసుకెళ్లగా కుడి చేతికి సెలైన్ ఎక్కించాడు. 2 రోజుల తర్వాత ఆమె చేయి పనిచేయకపోవడంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. దీంతో చేయి తొలగించాలని వైద్యులు చెప్పడంతో కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News June 8, 2024

BREAKING: HYDలో మరో MURDER

image

HYDలో వరుస హత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాపూర్ సమీపంలోని మీర్‌పేట్ PS పరిధిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద నందనవనం రౌడీ షీటర్ సల్మాన్(23) హత్యకు గురయ్యాడు. అయితే అర్ధరాత్రి అతడి సోదరి.. సల్మాన్‌కి కాల్ చేసి డబ్బులు ఇస్తానని అయ్యప్ప గుడి వద్దకు రమ్మని పిలిచింది. అక్కడే ఉన్న సూరి, అతడి స్నేహితులు కలిసి సల్మాన్‌ని గొంతు కోసి చంపేశారు. కేసు నమోదైంది.

News June 8, 2024

BREAKING: HYDలో మరో MURDER

image

HYDలో వరుస హత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాపూర్ సమీపంలోని మీర్‌పేట్ PS పరిధిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద నందనవనం రౌడీ షీటర్ సల్మాన్(23) హత్యకు గురయ్యాడు. అయితే అర్ధరాత్రి అతడి సోదరి.. సల్మాన్‌కి కాల్ చేసి డబ్బులు ఇస్తానని అయ్యప్ప గుడి వద్దకు రమ్మని పిలిచింది. అక్కడే ఉన్న సూరి, అతడి స్నేహితులు కలిసి సల్మాన్‌ని గొంతు కోసి చంపేశారు. కేసు నమోదైంది. 

News June 8, 2024

KNR: అవి చిరుత పాదముద్రలు కాదట!

image

మల్హర్ మండలంలోని గోపయ్యకుంట వాగులో చిరుతపులి సంచారం చేసిందని స్థానికులు కొయ్యూర్ ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో తాడిచెర్ల సెక్షన్ అధికారి లక్ష్మన్, కొయ్యూరు సెక్షన్ అధికారి ఇంతియాజ్, బిట్ అధికారులు చిరుత ఆనవాళ్ల కోసం జల్లెడ పట్టారు. వాగులో గుర్తించిన పాదముద్రలు తోడేలువని నిర్ధారించారు. ప్రజలు, పశువుల కాపర్లు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.

News June 8, 2024

ఇకనైనా ప్రత్యేక పాలన.. పట్టాలెక్కేనా?

image

గ్రామ పంచాయతీల్లో ఈ ఏడాది జనవరి నుంచి ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. ఖమ్మం జిల్లాలో 589, భద్రాద్రి జిల్లాలో 481 జీపీలు ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. 3 నెలలుగా లోక్ సభ ఎన్నికల క్రతువులో అధికార యంత్రాంగం నిమగ్నమవటంతో పంచాయతీల పాలనపై పర్యవేక్షణ కొరవడింది. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోడ్ శనివారంతో ముగియనుంది. ఇకనైనా జీపీ పాలనపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.