India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. మాక్లూర్(M) మదన్ పల్లె 9.2°C, కోరాట్ పల్లి 9.6, బెల్లాల్ 9.7, చిన్న మావంది 12.6, నిజామాబాద్ 13.7, సాలురా, తుంపల్లి, పొతంగల్ 13.9, మోస్రా, బాల్కొండ, డిచ్పల్లి, ఏర్గట్ల 14.4, మెండోరా 14.5, కమ్మర్పల్లి 14.6, జకోరా, వేల్పూర్, కోటగిరి 14.7, వేంపల్లి, భీమ్గల్, కోనసముందర్, జానకంపేట్ 14.8°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

‘అహల్య’ అనగానే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీలోని కామెడీ గుర్తోస్తుంది. కానీ నల్గొండ జిల్లాలో ‘అహల్య’ నది ఫేమస్. కానీ ఇది నేటి తరానికి తెలియదు. ఆ నది పేరు మీదుగానే ఆ గ్రామానికి పేరొచ్చింది.. అదే హాలియా. చరిత్ర క్రమంలో నది పూడిపోయి, ఆక్రమణకు గురికావడం వల్ల ప్రస్తుతం అహల్య వాగుగా మారింది. ఈ వాగు ఒడ్డునే హాలియా పట్టణం విస్తరించి ఉంది. చుట్టుపక్కల వ్యవసాయానికి ఈ వాగు ప్రధాన నీటి వనరు.

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కట్టంగూరుకు చెందిన ఎరుకల సంతోష్ కుమార్ హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. హోటల్ వ్యాపారం ఆశించినంతగా సాగకపోవడం, మరోవైపు భార్య అనారోగ్యం బారిన పడటంతో ఆర్థికంగా చితికిపోయి ఒత్తిడికి లోనయ్యాడు. మనస్థాపంతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

నేటి నుంచి కొనుగోలు చేసే వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను డీలర్ పాయింట్ వద్దనే నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ ఉప రవాణా కమిషనర్ రవీందర్ కుమార్ పేర్కొన్నారు. ఈ కొత్త విధానం ద్వారా వ్యక్తిగత వాహన యజమానులుా కానీ, వాహనాలు గానీ రిజిస్ట్రేషన్ కోసం ఇకపై ఆర్టీఓ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. వాహనం కొనుగోలు చేసిన డీలర్ షోరూమ్ నుంచే అవసరమైన అన్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియలు పూర్తవుతాయన్నారు.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. అర్ధరాత్రి దాటినా అశ్లీల నృత్యాలు, డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల MDMA వంటి మత్తుపదార్థాలు పట్టుబడటం సంచలనం రేపింది. మరోవైపు, డేటింగ్ యాప్ల ద్వారా పరిచయమైన యువతులు బాధితులను పబ్లకు పిలిపించి, భారీగా బిల్లులు వేయించి పరారవుతున్నట్లు మోసాలు వెలుగు చూస్తున్నాయి.

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధారణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్లో ఉండే ఎయిర్ క్వాలిటీ శనివారం సికింద్రాబాద్లో తెల్లవారుజామున 240కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత 15 రోజులతో పోలిస్తే గాలి నాణ్యత కాస్త పెరిగింది.

మన HYD చారిత్రక కట్టడాలకు నిలయం. వందలేళ్ల బంగ్లాలు నేటికీ చెక్కుచెదరకుండా చెమక్కుమంటున్నాయి. 1913లో 7వ నిజాం బాగ్-ఇ-ఆమ్(పబ్లిక్ గార్డెన్)లో ఇండో-పర్షియన్ శైలిలో ఓ అద్భుత భవనం నిర్మించారు. తన 25 ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా 7వ నిజాం ఇక్కడ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిపారు. అప్పటినుంచి ఇది ‘జూబ్లీహాల్’గా ప్రసిద్ధి చెందింది. 27 ఏళ్ల పాటు రాష్ట్ర శాసన మండలి ఈ భవనంలో కొనసాగింది. మీరెప్పుడైనా చూశారా?

హైదరాబాద్ నుంచి ORR వరకు చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ భూముల కబ్జాలు, లేఅవుట్ ఆక్రమణలు, పార్కుల కబ్జాలు ఉంటే వెంటనే హైడ్రాకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు. హైడ్రా హెల్ప్లైన్ 040-29565758కు కాల్ చేసి తెలియజేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో (DRF) 9000113667కు నంబర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

నిజామాబాద్లోని కంటేశ్వర్ పాలిటెక్నిక్ కళాశాలలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మున్సిపల్ ఎన్నికలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలపై మాస్టర్ ట్రైనర్లు అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

సీఎం సార్.. మా పిల్లల ఫీజు ఏకంగా 140% పెరిగింది.. ఇపుడు మా పరిస్థితేంటి అని హైదరాబాద్లోని ఓ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ సీఎంకి లేఖ రాశారు. ఇంతగా పెంచేస్తే అంత డబ్బు మేమెక్కడినుంచి తీసుకురావాలి. మీరు ఈ సమస్యను పరిష్కరించండని లేఖలో కోరారు. క్లాస్-1 ఫీజు రూ.93 వేల నుంచి రూ.2లక్షలకు పెంచారని వాపోయారు. ఇలా అన్ని తరగతుల ఫీజులు పెరిగాయని పేర్కొన్నారు. కాగా, అంతగా పెంచలేదని ప్రిన్సిపల్ చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.