Telangana

News September 17, 2024

కమనీయం భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో మంగళవారం స్వామివారికి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

News September 17, 2024

KNR: అనుమానాస్పద స్థితిలో సింగరేణి ఉద్యోగి మృతి

image

గోదావరిఖని జీఎం కాలనీ సింగరేణి కార్మికుడు హరినాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. నెల రోజుల్లో రిటైర్డ్ కానున్న జీడీకే-1 ఇంక్లైన్‌కి చెందిన బానోతు హరినాథ్ సింగ్ తన క్వార్టర్లో మృతి చెందాడు. అయితే మృతుడి మెడపై గాయాలు ఉండటంతో.. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 17, 2024

WNP: రికార్డు ధర పలికిన వినాయకుడి లడ్డూ

image

వనపర్తి గ్రీన్ పార్క్ వినాయకుడి పెద్ద లడ్డూ రూ.2,50,116ల రికార్డు ధర పలికిందని గ్రీన్ పార్క్ యూత్ తెలిపారు. సమాధాన్ జాదవ్ వేలంపాటలో ఈ లడ్డూ దక్కించుకున్నాడన్నారు. పట్టణంలోనే రికార్డు ధరగా భావిస్తున్నామని చెప్పారు. చిన్న లడ్డు లక్ష్మీ బాలరాజ్ రూ.8,511కు, నోట్ల దండ పుష్పలత రూ.40,116కు, కలశం రమేష్ రూ.40,116కు, ఆపిల్ పండ్లు మద్దిలేటి రూ.10,116 వేలం పాటలో పొందారన్నారు. ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

News September 17, 2024

నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద స్వల్పంగా పెరింది. 2 గేట్లు 8 అడుగుల మేరకు ఎత్తి 24,884 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్‌కు ఇన్ ఫ్లో 68,327 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 22,366 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 589.90 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 311.7462 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

News September 17, 2024

కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న నిమజ్జనం

image

మానకొండూరు, చింతకుంట కెనాల్, కొత్తపల్లి పెద్ద చెరువులో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు చేయగా, మానకొండూరులో తెల్లవారుజాము వరకు నిమజ్జనం ఉత్సవాలు జరిగాయి. నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన వినాయక నిమజ్జనం ఉత్సవాలు.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కరీంనగర్ నియోజకవర్గం నుంచి కాకుండా తిమ్మాపూర్ మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల ప్రతిష్టించిన విగ్రహాలు మానకొండూర్ చెరువులోనే నిమజ్జనం చేశారు.

News September 17, 2024

KNR: ఒకేరోజు పోరులో 11 మంది అమరులయ్యారు!

image

వెట్టిచాకిరి, బానిసత్వానికి నిరసనగా పోరాటం చేసిన కమ్యూనిస్టు యోధుడు బద్దం ఎల్లారెడ్డి SRCL జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లివాసి. ఈ పోరులో గ్రామానికి చెందిన 11 మంది ఒకేరోజు అమరులయ్యారు. వీరి పేర్లతో గాలిపెల్లిలో శిలాఫలకం కూడా ఏర్పాటు చేశారు. 1951లో జరిగిన తొలి ఎన్నికల్లో KNR పార్లమెంట స్థానం నుంచి ఎల్లారెడ్డి విజయం సాధించారు. 1958లో బుగ్గారం, 1972లో ఇందుర్తి నుంచి MLA అయ్యారు. 1979లో మరణించారు.

News September 17, 2024

MHBD: బ్రెయిన్ ట్యూమర్‌తో యువతి మృతి

image

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ.. యువతి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని గాంధీనగర్‌కు చెందిన హరిదాస్యపు వైష్ణవి(24) బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో గత కొద్ది రోజులుగా బాధపడుతోంది. కాగా, చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 17, 2024

నల్గొండ: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు బ్రేక్‌

image

పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రుల్లో ప్రభుత్వం విరివిగా నిర్వహించే డబుల్‌ పంక్చర్‌ ల్యాప్రోస్కోపిక్‌ (DPL) కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు జిల్లాలో బ్రేక్‌ పడింది. రెండో బిడ్డ పుట్టి కుటుంబ నియంత్రణ కోసం జిల్లాలో సుమారు 70 వేల మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కు.ని కోసం పెద్ద సంఖ్యలో మహిళలు ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడ కు.ని ఆపరేషన్లు జరగడం లేదు.

News September 17, 2024

కొత్తగూడెం: గోదావరి వద్ద గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పవిత్ర గోదావరిలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వాహనంపై నుంచి విగ్రహం కిందకి దింపుతుండగా విగ్రహం జారీ కింద పడింది. ఈ ఘటనలో స్విమ్మర్ రాజేశ్‌కు గాయాలయ్యాయి. అధికారులు వెంటనే స్పందించి అంబులెన్సులో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

News September 17, 2024

కాగజ్‌నగర్: లడ్డూ దక్కించుకున్న ముస్లిం దంపతులు

image

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం భట్టుపల్లిలో మతసామరస్యం వెల్లివిరిసింది. గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక లడ్డూను వేలం పాటలో ముస్లిం దంపతులు దక్కించుకున్నారు. గ్రామానికి చెందిన అప్జల్- ముస్కాన్ దంపతులు రూ.13,216లకు వినాయకుని లడ్డూను వేలం పాటలో పాల్గొని కైవసం చేసుకున్నారు.