Telangana

News August 28, 2025

NZB: విద్యా సంస్థలకు రేపు సెలవు: DEO

image

భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని కొన్ని మండలాల్లో విద్యా సంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తున్నట్లు DEO అశోక్ తెలిపారు. ఈ మేరకు సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, భీమ్‌గల్ మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని సంబంధిత యాజమాన్యాలు గమనించాలని ఆయన సూచించారు.

News August 28, 2025

కరీంనగర్: కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ల నియామకం

image

TG యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా నూతన కోఆర్డినేటర్ నియామకం గురువారం జరిగింది. కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్లుగా కడారి కుమార్, ముక్కెర సతీష్ కుమార్ లు నియామకమయ్యారు. అదేవిధంగా మల్లికార్జున్, ప్రశాంత్ లను కో-కో ఆర్డినేటర్లుగా నియమించారు. వీరితో పాటు 6 అసెంబ్లీ కోఆర్డినేటర్లను నూతనంగా ఎంపిక చేశారు. స్థానిక సంస్థల విజయం కోసం పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా ప్రచారంలో నియామకాలు జరిగాయి.

News August 28, 2025

GREAT: కబడ్డీ ఇండియా క్యాంపుకు పాలమూరు బిడ్డ ఎంపిక

image

NGKL జిల్లా పదర మండలానికి చెందిన బండి నందిని, మహిళల కబడ్డీ అండర్-18 విభాగంలో ఇండియా క్యాంపునకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ Way2Newsతో తెలిపారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన నందిని, గురువారం ఢిల్లీలోని సోనీపత్‌లో జరిగే ఇండియా క్యాంపునకు బయలుదేరి వెళ్లారు. ఆమె తల్లిదండ్రులు రమేశ్, రామాదేవి సంతోషం వ్యక్తం చేశారు.

News August 28, 2025

NZB: 7 పునరావాస కేంద్రాలు.. 164 కుటుంబాలు

image

వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం చందూర్, ధర్పల్లి, డిచ్‌పల్లి, NZB రూరల్, జక్రాన్‌పల్లి మండలాల్లో 7 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డ తెలిపారు. అవసరమైన సదుపాయాలు కల్పించామన్నారు. 164 కుటుంబాలకు చెందిన 358 మంది ఈ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగలేదన్నారు. వరద నీటిలో చిక్కుకుపోయిన 17 మందిని సురక్షితంగా కాపాడినట్లు వెల్లడించారు.

News August 28, 2025

NZB: 12,413 ఎకరాల్లో పంట నష్టం: కలెక్టర్

image

జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి, భీమ్‌గల్, ఇందల్వాయి మండలాల్లోని కొండాపూర్, తూంపల్లి, గడ్కోల్, ముషీర్ నగర్, హోన్నాజీపేట్, వాడి, నడిమితండా, బెజ్జోరా, సిర్నాపల్లి గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. పై ప్రాంతాల్లో మూడు చెరువులు తెగిపోగా, సుమారు 12,413 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు చెప్పారు. నీట మునగడం వల్ల పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు.

News August 28, 2025

NZB: ఇప్పటి వరకు జరిగిన నష్టం వివరాలు: కలెక్టర్

image

NZB జిల్లాలో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 13 చోట్ల పంచాయతీ రాజ్ రోడ్లు దెబ్బతిన్నాయని, 29 చోట్ల ఆర్‌అండ్‌బీ రోడ్లకు నష్టం జరిగిందని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. వర్షానికి ఓ నివాస గృహం పూర్తిగా కూలిపోయిందన్నారు. మరో ఆరు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. 60 కరెంటు స్తంభాలు, మరో 60 కండక్టర్లు పడిపోయాయని చెప్పారు. కొన్ని చోట్ల వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు నీట మునిగాయని వెల్లడించారు.

News August 28, 2025

ప్రజలు ఆందోళన చెందవద్దు: NZB కలెక్టర్

image

జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి భరోసా కల్పించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి తలెత్తినా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేశామని పేర్కొన్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమతమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు.

News August 28, 2025

జాతీయ క్రీడా దినోత్సవ రన్‌ను ప్రారంభించిన కలెక్టర్

image

క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి పెంచుకొని రాణించాలని జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవం, హాకీ మాంత్రికుడు ధ్యాన్‌ చంద్‌ జయంతిని పురస్కరించుకుని గురువారం ఆమె మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి కలెక్టర్‌ నుంచి మేకల అభినవ్‌ స్టేడియం వరకు నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.

News August 28, 2025

పాఠశాలల బలోపేతానికి చర్యలు: కలెక్టర్‌

image

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం తన కార్యాలయంలో డీఈవో బిక్షపతి, జిల్లా సెక్టోరియల్ అధికారులు, ఎంఈవోలతో ఆమె విద్యా విషయక సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు అందుతున్న పుస్తకాలు, యూనిఫాంలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుపై ఆమె సమీక్షించారు. విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News August 28, 2025

సురక్ష బీమా యోజన నమోదు చేయించాలి: శేఖర్ రెడ్డి

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలందరినీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై)లో నమోదు చేయించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై.శేఖర్ రెడ్డి ఆదేశించారు. ఉపాధి సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం కింద నమోదైన వారికి జూన్ 1 నుంచి మే 31 వరకు బీమా వర్తిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.