Telangana

News April 9, 2025

హుస్సేన్ సాగర్లో యువతిని కాపాడిన హైడ్రా బృందం

image

కుటుంబ కలహాల కారణంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్లోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మెర్రీ అనే 36 ఏళ్ల మహిళను హైడ్రా DRF బృందం సకాలంలో కాపాడింది. బాలానగర్‌కు చెందిన ఆమెను గమనించిన స్థానికులు హైడ్రాకు సమాచారం అందించగా, DRF సిబ్బంది తాళ్ల సహాయంతో ఆమెను సురక్షితంగా రక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News April 9, 2025

హుస్సేన్ సాగర్లో యువతిని కాపాడిన హైడ్రా బృందం

image

కుటుంబ కలహాల కారణంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్లోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మెర్రీ అనే 36 ఏళ్ల మహిళను హైడ్రా DRF బృందం సకాలంలో కాపాడింది. బాలానగర్‌కు చెందిన ఆమెను గమనించిన స్థానికులు హైడ్రాకు సమాచారం అందించగా, DRF సిబ్బంది తాళ్ల సహాయంతో ఆమెను సురక్షితంగా రక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News April 9, 2025

ADB: విద్యార్థులకు GOOD NEWS.. అడ్మిషన్లు START

image

ADB జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభమైనట్టు ప్రిన్సిపల్ శివకృష్ణ తెలిపారు. బీఏ(హెచ్ఈపీ), బీకాం (సీఏ), బీఎస్సీ, బీజడ్సీ, డాటా సైన్స్, స్టాటిస్టిక్స్ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలకు 9849390498 లేదా https://ttwrdcs.ac.in/Boat వెబ్ సైట్‌ను సంప్రదించాలన్నారు.

News April 9, 2025

ఇచ్చోడ: యాక్సిడెంట్.. నలుగురికి గాయాలు

image

ఎదురుఎదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొని నలుగురికి గాయాలైన ఘటన మంగళవారం పెంబి మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలం సల్లెడ గ్రామానికి చెందిన మాడవి శ్రీకాంత్, పోషన్న ఖానాపూర్ నుంచి పెంబి వస్తున్నారు. ఈ క్రమంలో పరిమండల్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఎదురుఎదురుగా వస్తున్న బైక్‌ను భీకొని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం హాస్పిటల్‌కు పంపారు.

News April 9, 2025

మెదక్: జీవో సవరణ కోసం వీఆర్వోల వినతి

image

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు పూర్వ వీఆర్వోలు వినతి పత్రం సమర్పించారు. వీఆర్వోలు, వీఆర్ఏలను జిపిఓలుగా తీసుకోవడానికి జారీచేసిన జీవో 129ను సవరణ చేసి పాత వీఆర్వోలను యధావిధిగా కామన్ సర్వీస్ ఇస్తూ నియామకం చేయాలని కోరారు. మెదక్‌లో సమావేశం నిర్వహించి 16లోగా గూగుల్ ఫారం నింపాలని జారీ చేసిన ఆదేశాలపై చర్చించారు. జీవో లోపాలను సవరిస్తూ పాత సర్వీస్‌ కౌంట్ చేస్తూ, యధావిధిగా తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు

News April 9, 2025

యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

image

రాజీవ్ యువ వికాసం పథకం కింద వచ్చే దరఖాస్తుల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అప్లికేషన్లు సమర్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లను పరిశీలించారు. కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కోసం 5 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

News April 9, 2025

గురుకుల కళాశాలలో ప్రవేశాలకు మే 10న ఎంట్రన్స్ పరీక్ష

image

ఖమ్మం: గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కళాశాలల్లో 2025-26 విద్యా సం.కి ఇంటర్మీడియట్ మొదటి సం. ప్రవేశాలకు మే 10న ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు గురుకుల జిల్లా సమన్వయ అధికారిణి రమ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూప్‌లలో చేరుటకు మే 10న ఉ.10 నుండి మ.12-30 వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. www.tgrjdc.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

News April 9, 2025

NZB: 29 మంది ఉద్యోగులకు పురస్కారాలు

image

ఆర్టీసీలో పని చేస్తున్న 29 మంది ఉద్యోగులకు త్రైమాసిక ప్రగతి చక్రం పురస్కారాలు అందజేశారు. నిజామాబాద్-1 డిపోలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ టీ.జోత్స్న చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, డిపో మేనేజర్లు, పర్సనల్ ఆఫీసర్, సూపర్ వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

News April 9, 2025

HYD: MMTS మహిళా బోగీల్లో సీసీ కెమెరాలు

image

HYDలోని నాలుగైదు MMTS ట్రెన్లలోనే సీసీ కెమెరాలు ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మహిళల భద్రత కోసం త్వరలో అన్ని MMTS ట్రెయిన్లలోని మహిళా బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే MMTS స్టేషన్లలో కూడా కెమెరాల ఏర్పాటుపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు పరిశీలిస్తున్నారు.

News April 9, 2025

HYD: MMTS మహిళా బోగీల్లో సీసీ కెమెరాలు

image

HYDలోని నాలుగైదు MMTS ట్రెన్లలోనే సీసీ కెమెరాలు ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మహిళల భద్రత కోసం త్వరలో అన్ని MMTS ట్రెయిన్లలోని మహిళా బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే MMTS స్టేషన్లలో కూడా కెమెరాల ఏర్పాటుపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు పరిశీలిస్తున్నారు.

error: Content is protected !!