India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం రేవంత్ రెడ్డితో ముఖాముఖి కార్యక్రమానికి జన్నారం మండలంలోని కిష్టాపూర్ జడ్పీ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థి రాథోడ్ ఈశ్వర్ ఎంపికయ్యారు. జూన్ 9న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో విద్యాశాఖ సహకారంతో పదో తరగతి టాపర్లతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ నెల 10న హైదరాబాద్లోని హరిహర కళాక్షేత్రంలో విద్యార్థులను, హెచ్ఎంలను, తల్లిదండ్రులను ఆయన సన్మానించనున్నారు.
జనగామ జిల్లా ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో ఈనెల 11న జిల్లాలోని నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఉమారాణి తెలిపారు. ఎస్ బ్యాంక్లో 50 సీనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీ ఉంటుంది అన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతల జిరాక్స్లతో కలెక్టర్ కార్యాలయానికి రావాలన్నారు.
గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ప్లాజా సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఘోరప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు అలంపూర్ చౌరస్తా నుంచి కర్నూలు వైపు వెళుతున్న బైకు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. జాతీయ రహదారిపై కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ లో BJPఅభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని ఎన్నికల అధికారులు ఎలిమినేషన్ చేశారు. కాగా ఇప్పటివరకు 42 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. BJP అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,23,709 ఓట్లు, BRS అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,846 ఓట్లు రాగా.. మొత్తంగా మల్లన్న 19వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరికొన్ని గంటల్లో గెలుపు ఎవరిదో తెలియనుంది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ లో BJPఅభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని ఎన్నికల అధికారులు ఎలిమినేషన్ చేశారు. కాగా ఇప్పటివరకు 42 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. BJP అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,23,709 ఓట్లు, BRS అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,846 ఓట్లు రాగా.. మొత్తంగా మల్లన్న 19వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరికొన్ని గంటల్లో గెలుపు ఎవరిదో తెలియనుంది.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 10 నుంచి యథావిధిగా నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆయన వెల్లడించారు.
WGL-KMM-NLG గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాగా, ఇప్పటివరకు 42 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,712 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,23,709 ఓట్లు, రాకేష్ రెడ్డి(BRS)కి 1,04,846 ఓట్లు రాగా.. మొత్తంగా మల్లన్న 19వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరికొన్ని గంటల్లో గెలుపు ఎవరిదో తెలియనుంది.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వరదల వల్ల ప్రాన నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. గత ఏడాది వరదల కారణంగా ముంపుకు గురైన గ్రామాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని, వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని ఢిల్లీలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బండి సంజయ్ సైతం ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ను శాలువతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నాయకులు ముస్తాపురే అశోక్, తదితరులు పాల్గొన్నారు.
గద్వాల సెకండ్ రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం శివపురానికి చెందిన అంజి కర్నూలు నుంచి గురువారం రాత్రి గద్వాలకు వచ్చాడు. శుక్రవారం అంజి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.