Telangana

News June 7, 2024

KMM-NLG-WGL: 26 మంది ఎలిమినేట్‌

image

KMM-NLG-WGL పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు 26 మంది ఎలిమినేట్‌ అయ్యారు.27వ అభ్యర్థి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎలిమినేషన్‌ రౌండ్స్‌లో కాంగ్రెస్‌‌కు 220 ఓట్లు రాగా, BRSకు 139 ఓట్లు, BJPకి 118 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 76 ఓట్లు పోలయ్యాయి. మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 7, 2024

పెద్దపల్లి: కూలర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్‌.. ఒకరి మృతి

image

పెద్దపల్లి జిల్లాలో గురువారం రాత్రి కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన రైతు నల్ల శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కూలర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాస్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

News June 7, 2024

KMM-NLG-WGL: గెలుపు కోసం 1,55,095 ఓట్లు..!

image

రెండు రోజులుగా కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. KMM-NLG-WGL ఉపఎన్నిక కౌంటింగ్‌లో ఎవరికి గెలుపునకు సరిపడా ఓట్లు రాలేదు. గెలుపు కోసం 1,55,095 ఓట్లు రావాల్సి ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,22,813 ఓట్లు, BRS అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,246 ఓట్లు, BJP అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,313 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 29,697 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి.

News June 7, 2024

రెంజల్: పిడుగుపాటుకు పశువుల కాపరి మృతి

image

రెంజల్ మండలం కల్యాపూర్ శివారులో గురువారం పిడుగుపడి దండిగుట్ట తండాకు చెందిన పశువుల కాపరి బానోత్ పీర్యానాయక్ (80) మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. కల్యాపూర్ శివారులో పశువులు మేపడానికి వెళ్లిన ఆయన తిరిగి వస్తున్న సమయంలో సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో అక్కడే ఉన్న ఓ మామిడి చెట్టు కింద తల దాచుకోగా చెట్టుపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు.

News June 7, 2024

ఆదిలాబాద్: హమ్మయ్య..! చల్లబడిన వాతావరణం

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం కాస్త చల్లబడింది. ఎండవేడిమి తగ్గినా.. ఉక్కపోత అలాగే ఉండటంతో ఒకటి, రెండు భారీ వర్షాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు ఉగ్రరూపం చూపిన భానుడు వర్షం ప్రభావం వల్ల కొంత చల్లబడ్డాడు. ఈ నెలలో 47 డిగ్రీల వరకు చేరుకున్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 37, 35 డిగ్రీలకు పడిపోయాయి.

News June 7, 2024

NLG: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక అప్డేట్

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు 26 మంది ఎలిమినేట్‌ అయ్యారు. 27వ అభ్యర్థి ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. ఎలిమినేషన్‌ రౌండ్స్‌లో కాంగ్రెస్‌‌కు 220 ఓట్లు రాగా, BRSకు 139 ఓట్లు, BJPకి 118 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 76 ఓట్లు పోలయ్యాయి. మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 7, 2024

KMM: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక అప్డేట్

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు 26 మంది ఎలిమినేట్‌ అయ్యారు. 27వ అభ్యర్థి ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. ఎలిమినేషన్‌ రౌండ్స్‌లో కాంగ్రెస్‌‌కు 220 ఓట్లు రాగా, BRSకు 139 ఓట్లు, BJPకి 118 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 76 ఓట్లు పోలయ్యాయి. మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 7, 2024

ADB: పిడుగు పాటుతో నలుగురు మృతి 

image

ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలో నిన్న ఒక్కరోజే పిడుగు పాటుకు 4 గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతి చెందిన వారి కుటుంబాలు పెద్దదిక్కు కోల్పోయాయి. దిలావర్పూర్ మండలానికి చెందిన ప్రవీణ్(26), ఇంద్రవెల్లి మండలానికి చెందిన దంపతులు సంతోష్(26), స్వప్న(23), తానూర్ మండలానికి చెందిన మాగిర్వడ్ (13) పిడుగు పాటుతో మృతి చెందారు. పిడుగులు పడే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

News June 7, 2024

HYD: కాంగ్రెస్‌లోకి 10 మంది BRS ఎమ్మెల్యేలు?

image

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో MLAల ఫిరాయింపుల పర్వం మొదలుకానుందని తెలుస్తోంది. BRS MLAలు కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు మంతనాలు చేస్తున్నారని, ఇందులో HYD వారు ఉన్నారని సమాచారం. వచ్చే నాలుగున్నరేళ్లు సౌకర్యంగా ఉండడం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కొందరు పార్టీ మారనున్నారనే చర్చ నడుస్తోంది. కాగా ఇటీవల 10మంది MLAలు కాంగ్రెస్‌లోకి వస్తారని మైనంపల్లి పేర్కొనగా ఆయన మాటలు నిజం అవుతాయో లేదో చూడాలి.

News June 7, 2024

HYD: కాంగ్రెస్‌లోకి 10 మంది BRS ఎమ్మెల్యేలు?

image

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో MLAల ఫిరాయింపుల పర్వం మొదలుకానుందని తెలుస్తోంది. BRS MLAలు కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు మంతనాలు చేస్తున్నారని, ఇందులో HYD వారు ఉన్నారని సమాచారం. వచ్చే నాలుగున్నరేళ్లు సౌకర్యంగా ఉండడం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కొందరు పార్టీ మారనున్నారనే చర్చ నడుస్తోంది. కాగా ఇటీవల 10మంది MLAలు కాంగ్రెస్‌లోకి వస్తారని మైనంపల్లి పేర్కొనగా ఆయన మాటలు నిజం అవుతాయో లేదో చూడాలి.