India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. దొంగతుర్తి గ్రామానికి చెందిన మ్యాన ఓంకార్ కుమారుడు వేదాన్ష్(4)కు ట్రాక్టర్ తలగడంతో మృతి చెందాడు. వేదాన్ష్ తాత ట్రాక్టర్ తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు వేదాన్ష్కు ట్రాక్టర్ తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రం రాజకీయ ప్రముఖులకు పుట్టినిల్లుగా నిలుస్తోంది. స్టేషన్ ఘనపూర్ MLA, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, BJP రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పుట్టింది పర్వతగిరి గ్రామమే. కడియం శ్రీహరి కూతురు కావ్య సైతం ఇక్కడే జన్మించారు. ఇప్పుడు వరంగల్ MPగా గెలుపొందడంతో పర్వతగిరి ఊరు పేరు మరోసారి మారుమోగుతోంది.
పిడుగు పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన NGKL జిల్లా వెల్దండ మండలంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దాపూర్ గ్రామానికి చెందిన బేగారి జంగమ్మ (47) విత్తనాలు నాటేందుకు పొలం వద్దకు వెళ్లింది. అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. ఈ క్రమంలో పిడుగు పడి జంగమ్మ మృతిచెందగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.
రేపు మధ్యాహ్నం మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించనున్నారు. సుందిళ్ల బ్యారేజీలో NDSA (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) సూచనల మేరకు జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ కుమార్, ఇతర నీటిపారుదల శాఖ అధికారలు బ్యారేజీల పరిస్థితి వివరించనున్నారు.
Blinkit వేర్హౌస్లో తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సరుకులు నిల్వ చేసే గోదాంలో నిబంధనలు పాటించనట్లు గుర్తించారు. ఇక్కడి స్టాఫ్ గ్లౌస్లు, యాప్రాన్ ధరించడం లేదన్నారు. భారీగా ఆహార, సౌందర్య ఉత్పత్తులు నిల్వ చేయబడ్డాయని @cfs_telangana ట్వీట్ చేసింది. ఎక్సైరీ అయిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయని, నోటీసులు జారీ చేసి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. SHARE IT
Blinkit వేర్హౌస్లో తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సరుకులు నిల్వ చేసే గోదాంలో నిబంధనలు పాటించనట్లు గుర్తించారు. ఇక్కడి స్టాఫ్ గ్లౌస్లు, యాప్రాన్ ధరించడం లేదన్నారు. భారీగా ఆహార, సౌందర్య ఉత్పత్తులు నిల్వ చేయబడ్డాయని @cfs_telangana ట్వీట్ చేసింది. ఎక్సైరీ అయిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయని, నోటీసులు జారీ చేసి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
SHARE IT
పిడుగుపాటుకు గురై ఓ యువ రైతు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వా గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. మూడపెల్లి ప్రవీణ్ (28) వానాకాలం సాగు కోసం పొలంలో పని చేస్తుండగా భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా పిడుగుపడటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతుడికి భార్య, సంవత్సరం కూతురు ఉన్నారు.
నల్గొండలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మూడు రౌండ్లు ముగిసేసరికి 2,64,216 మొదటి ప్రాధాన్యత చెల్లిన ఓట్లు నమోదయాయి. తీన్మార్ మల్లన్న 1,06,234, రాకేశ్ రెడ్డి 87,356, ప్రేమేందర్ రెడ్డి 34,516, ఆశోక్ పాలకూరి 27,493లకు ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,878 ఓట్ల లీడ్లో ఉన్నారు.
నల్గొండలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మూడు రౌండ్లు ముగిసేసరికి 2,64,216 మొదటి ప్రాధాన్యత చెల్లిన ఓట్లు నమోదయాయి. తీన్మార్ మల్లన్న 1,06,234, రాకేశ్ రెడ్డి 87,356, ప్రేమేందర్ రెడ్డి 34,516, ఆశోక్ పాలకూరి 27,493లకు ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,878 ఓట్ల లీడ్లో ఉన్నారు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని శ్రీనివాస్ నగర్ రైల్వే స్టేషన్లో రైల్ కింద పడి 35 ఏళ్ల వయసు గల యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై తావు నాయక్ తెలిపారు. వేగంగా వెళుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. గుర్తిస్తే సమాచారం తెలియచేయాలని రైల్వే ఎస్సై తావు నాయక్ వివరించారు.
Sorry, no posts matched your criteria.