India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం జిల్లాలో నిన్న ఉ.8:30 ని.ల నుంచి ఇవాళ ఉ.8:30 వరకు 24 గంటల పాటు నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 326.8 మీ.మీల వర్షపాతం నమోదైందన్నారు. వేంసూరు మండలంలో అత్యధికంగా 50.6 మీ.మీ, అత్యల్పంగా నేలకొండపల్లిలో 0.2 మీ.మీల వర్షపాతం నమోదైందన్నారు. కాగా రాబోయే 2, 3 రోజులు జిల్లాలో పలుచోట్ల ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
MBNR పార్లమెంట్ స్థానానికి 2009 నుంచి 2024 వరకు 4సార్లు పోటీ చేసిన BRS హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. బీజేపీ ఒక్కసారీ గెలుపొందింది. 2009 ఎంపీ ఎన్నికల్లో KCR, 2014లో ఏపీ జితేందర్ రెడ్డి(BRS), 2019లో మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS) గెలుపొందగా, తాజాగా డీకే అరుణ(BJP) గెలిచి తొలి మహిళా ఎంపీగా రికార్డుకెక్కారు. 2 దశాబ్దాల్లో జరిగిన 4 ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి కాంగ్రెస్ను విజయం వరించలేదు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో BRSకు పోలైన ఓట్లు ఈ సారి BJP వైపు మొగ్గుచూపడంతో చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్లో ఓటమి పాలైనట్లు INC శ్రేణులు పేర్కొంటున్నాయి. సికింద్రాబాద్లో పద్మారావుకు ఓట్లు తగ్గడంతోనే BJP గట్టెక్కిందంటున్నారు. చేవెళ్ల లోక్సభ పరిధిలో ముగ్గురు BRS MLAలు కొండాకి ఓట్లు వేయిస్తే, మల్కాజిగిరిలోనూ నలుగురు MLAలు ఇదే పని చేశారని INC నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో BRSకు పోలైన ఓట్లు ఈ సారి BJP వైపు మొగ్గుచూపడంతో చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్లో ఓటమి పాలైనట్లు INC శ్రేణులు పేర్కొంటున్నాయి. సికింద్రాబాద్లో పద్మారావుకు ఓట్లు తగ్గడంతోనే BJP గట్టెక్కిందంటున్నారు. చేవెళ్ల లోక్సభ పరిధిలో ముగ్గురు BRS MLAలు కొండాకి ఓట్లు వేయిస్తే, మల్కాజిగిరిలోనూ నలుగురు MLAలు ఇదే పని చేశారని INC నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
మంచిర్యాల పట్టణంలోని దొరవారిపల్లెలో ఘోర అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని 80 ఏళ్ల వృద్ధుడు చనిపోయిన మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయాన్ని వారు పోలీసులకు తెలిపారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విత్తన విక్రయ షాపులు, తమ షాపులో ఉన్న విత్తనాలు, నిల్వ వివరాలు రైతులకు అర్థం అయ్యేలా తెలుగులో ప్రదర్శించాలని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ అన్నారు. నగరంలోని గాంధీ చౌక్, బర్మా షెల్ రోడ్ లోని విత్తన, ఎరువుల విక్రయ దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, షాపులలో స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్ బుక్, బిల్ బుక్ లను, విత్తన బస్తాలపై లాట్ నంబర్, ఎం.ఆర్.పీ. రేటు తెలుసుకున్నారు.
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో జూన్ 9న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఉ.6 గంటల నుంచి సా.6 వరకు అంక్షాలు అమలులో ఉంటాయని, పరీక్షా కేంద్రానికి 500 మీటర్ల దూరం వరకు నిబంధనలు వర్తిస్తాయని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన పాల్కి భూమబోయి మూడు రోజుల క్రితం కనిపించకపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల ఇండ్లలో వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఇవాళ ఉదయం ఇబ్రహీంపేట్ సబ్ స్టేషన్ ముందర నీటి కుంటలో భూమబోయి మృతదేహం స్థానికులకు కనిపించింది. వారు పోలీసులకు సమాచారం అందించారు.
కేంద్రంలో మరోసారి NDA ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో రాష్ట్రం నుంచి మంత్రి పదవుల ఆశావహుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు గెలుపొందడంతో రాష్ట్రానికి ప్రాధాన్యం పెరిగింది. కాగా దేశంలో మెుత్తం 47 ఎస్టీ లోక్ సభ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ ఒకటి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఎంపీ గోడెంనగేశ్కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందా అనే దానిపై చర్చ మెుదలైంది.
జూపార్క్కు ప్రవేశ టిక్కెట్లను ఎక్కువ ధరకు విక్రయించటం లేదని నెహ్రూ జూలాజికల్ పార్కు క్యూరేటర్ సునీల్ హీరామత్ తెలిపారు. జూపార్కు ప్రవేశ టిక్కెట్లు రూ.70కు బదులుగా రూ.100కు విక్రయిస్తున్నట్లు సోషల్ మీడియాలో వ్యాపించిన విషయం అవాస్తవమని ఆయన తెలియజేశారు. జూపార్కు ప్రవేశ టికెట్ పెద్దలకు రూ.70 , చిన్నారులకు రూ.45కు టికెట్లను అమ్ముతున్నామని క్యూరేటర్ చెప్పారు.
Sorry, no posts matched your criteria.