Telangana

News August 28, 2025

ఓయూ: ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ తదితర కోర్సుల రెండో సెమిస్టర్, రెగ్యులర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
SHARE IT

News August 28, 2025

ధర్పల్లి: ముంపు గ్రామాలను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్, సీపీ

image

ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన గ్రామాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించారు. వరద నీటి ఉద్ధృతి వల్ల ముత్యాల చెరువు తెగిపోవడంతో ధర్పల్లి మండలంలో వాడి, నడిమి తండా, బీరప్ప తండాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

News August 28, 2025

రేపు కరీంనగర్ డ్యాం గేట్లు తెరిచే అవకాశం

image

కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో వరద ప్రవాహం పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మిడ్ మానేరు నుంచి వరద లోయర్ మానేరు డ్యాంలోకి వస్తుందని, రేపు 10 గంటల వరకు స్పిల్వే వరద గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలే అవకాశం ఉందని తెలిపారు. నది దిగువన గుండా పరిసర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మానేరు నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని కోరారు.

News August 28, 2025

ఖమ్మం పోలీస్ కమిషనర్ హెచ్చరిక

image

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. నీటిమునిగిన రోడ్లు, వంతెనలు దాటరాదని, వాగులు, చెరువుల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100, 1077 లేదా పోలీస్ కంట్రోల్ నెంబర్ 87126 59111, 90632 11298లకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

News August 28, 2025

HYD: సోషల్ మీడియా పోస్టులు.. CP హెచ్చరిక

image

HYDలో వైభవంగా గణపతి నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 6వ తేదీ వరకు వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ఉండరాదని, అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News August 28, 2025

‘TRS’కు పురుడుపోసిన బషీర్‌బాగ్ దమనకాండ

image

నాడు TDP హయాంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా 2000 మే నెలలో రాష్ట్రమంతా ఉద్యమించింది. ఈ పరిణామాలతో నాటి Dy. స్పీకర్‌ KCR లేఖ ద్వారా ప్రభుత్వానికి అసంతృత్తి తెలుపుతూ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. పరోక్షంగా బషీర్‌బాగ్ దమనకాండ TRS పార్టీ పురుడుపోసుకోవడానికి ఓ కారణమైంది. నాడు పెరిగిన విద్యుత్ ఛార్జీల వల్ల ఈ ప్రాంతానికి కలిగే నష్టాన్ని ఆయన అసెంబ్లీలో ప్రసంగించి ప్రజల మన్నెనలు పొందారు.

News August 28, 2025

మెదక్: ఏరియల్ సర్వేకు రానున్న సీఎం రేవంత్

image

మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేకు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత బేగంపేట్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్నారు. ముందుగా పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్ట్, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్, పోచారం ప్రాజెక్ట్ పరిశీలించి కామారెడ్డిలో అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలిస్తారు.

News August 28, 2025

HYD: గౌరీపుత్రుడు గంగను చేరేందుకు 78 స్పాట్లు

image

నగర వ్యాప్తంగా వేల సంఖ్యలో గణనాథులను ప్రతిష్టించారు. ఇక లక్షల సంఖ్యలో ఇళ్లల్లో వినాయకులు కొలువు దీరారు. ఇన్ని విగ్రహాలు చెరువుల్లో నిమజ్జనం చేయాలంటే కష్టం. అందుకే GHMC అధికారులు 78 చోట్ల కృత్రిమ, తాత్కాలిక చెరువులు ఏర్పాటు చేసింది. 29 చోట్ల బేబీ పాండ్స్, 28 చోట్ల పోర్టబుల్ పాండ్స్ సిద్ధం చేసింది. ఇక 21 ప్రాంతాల్లో తాత్కాలిక చెరువులను ఏర్పాటు చేశారు.

News August 28, 2025

జానంపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలం జానంపేటలో 29.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. భూత్పూర్ మండలం కొత్త మొల్గర 24.5, అడ్డాకుల 23.5, కౌకుంట్ల 8.8, మహబూబ్‌నగర్ అర్బన్ 6.8, గండీడ్ మండలం సల్కర్ పేట 5.5, కోయిలకొండ 5.0, మిడ్జిల్ మండలం కొత్తపల్లి 4.5, బాలానగర్ 3.8 మిల్లీమీటర్ల వర్షం నమోదయింది.

News August 28, 2025

సీఐ ని పరామర్శించిన ఎమ్మెల్యే శంకర్

image

జైనథ్ సీఐ సాయినాథ్‌ను ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరామర్శించారు. డొలారా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సీఐ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారం ఆస్పత్రికి వెళ్లి సీఐ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దగ్గరుండి పలు వైద్య పరీక్షలను చేయించారు. సీఐతో పాటు గాయపడ్డ డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.