India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనుముల ఇంటెలిజెన్స్ వాడి కులగణనను తప్పుదోవ పట్టించి బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వెబ్సైట్లో పెట్టామని, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఆ ధైర్యం లేదన్నారు. 2011లో యూపీఏ హయాంలో దేశంలో కులగణన చేసినప్పటికీ వివరాలు వెల్లడించలేదన్నారు.
జిల్లా వ్యాప్తంగా సర్వేయర్ల కొరత ఉండడంతో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి. సర్వేకు దరఖాస్తు చేసుకున్న బాధితులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. భూ తగాదాలు తీరాలన్న.. గట్టు పంచాయతీలు వచ్చిన భూ సర్వే చేసి పరిష్కరిస్తారు. కాగా జిల్లాలో సర్వేయర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో సకాలంలో సేవలు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనుముల ఇంటెలిజెన్స్తో రాష్ట్రానికి ప్రమాదం ఉందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చాలా ప్రమాదముందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. అనుముల ఇంటెలిజెన్స్ అని ఎద్దేవా చేశారు. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్పా రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
అసెంబ్లీ ఆవరణలో ఫులే విగ్రహ ఏర్పాటుపై ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని.. అనుముల ఇంటలిజెన్స్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో రాష్ట్రానికి ప్రమాదం లేదని, అనుముల ఇంటలిజెన్స్తో ప్రమాదం ఉందన్నారు. అది రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుందని, దాన్ని పక్కకు జరిపితే తప్ప రాష్ట్రం బాగుపడదన్నారు.
ఖమ్మం జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం వరకు ఎండలు దంచి కొడుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాయంత్రం ఉన్నట్టుండి వాతావరణం చల్లబడి ఈదురుగాలలో కూడిన వర్షం కురుస్తోంది. సోమవారం జిల్లాలో వడగండ్ల వర్షం కురవడంతో మామిడి కాయలు నేలరాలాయి. మొక్కజొన్న పంట నేలకొరిగింది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తమయ్యారు.
దక్షిణ కాశీగా పిలవబడే అడ్డాకుల మండలం కందూరు గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. దేవాలయ శాఖ ఇన్స్పెక్టర్ వీణాద్రి ఆధ్వర్యంలో ఆలయ హుండీ లెక్కింపు చేపట్టారు. లెక్కింపులో భాగంగా రూ.5,13,368 సమకూరినట్టు ఆలయ ఈవో రాజేశ్వర శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు నాగిరెడ్డి, రవీందర్ శర్మ, దామోదర్ రెడ్డి, శ్రీహరి, నరేందర్ చారి, కొత్త కృష్ణయ్య పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సోమవారం 40.01 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ కూడా బోసిపోయి కనిపిస్తున్నాయి. నల్గొండ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఖమ్మం జిల్లాలో గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షపాత నమోదు వివరాలను వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. వేంసూరులో అత్యధికంగా 16.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సత్తుపల్లిలో 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం, మధిరలో 4, ఎర్రుపాలెంలో 6.4, తల్లాడ 1.6, చింతకాని 0.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయినట్లు తెలిపారు. మిగతా మండలాలలో వర్షం పడలేదు. జిల్లా వ్యాప్తంగా 39.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
మెదక్ జిల్లా శివంపేట మండలం బిజిలి పూర్లోని హనుమాన్ దేవాలయంలో నాగుపాము దర్శనమిచ్చింది. ఆలయంలోని శివలింగం వద్ద సుమారు గంట పాటు పడగ విప్పి నాగుపాము దర్శనం ఇవ్వడంతో గ్రామస్థులు సాక్షాత్తు శివుడు దర్శనమిచ్చాడని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంటపాటు శివుడి వద్ద పడగవిప్పి ఉండడంతో యువకులు నాగుపాము ఫోటోలు సెల్ ఫోన్లో చిత్రీకరించారు.
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యం లో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్కు జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, యూపీహెచ్సీల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించేందుకు ట్యాక్స్ ప్లేట్ కలిగిన అద్దె వాహనాలకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వివరాలకు https://nalgonda.telangana. gov.in వెబ్సైట్స్ ను పరిశీలించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.