India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TGలో INC అధికారంలోకి వచ్చిన తర్వాత BRSను వీడిన దానం నాగేందర్, రంజిత్ రెడ్డి, పట్నం సునీత MP ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. చేవెళ్లలో రంజిత్ రెడ్డి 1,72,897 తేడాతో ఓడిపోయారు. మల్కాజిగిరి సిట్టింగ్ స్థానంలో INC గట్టి పోటీ ఇవ్వలేకపోయినా.. డిపాజిట్ దక్కించుకుంది. ఇక సికింద్రాబాద్ MP స్థానంలో దానం మెరుగైన ఓట్లనే రాబట్టి 2వ స్థానంలో నిలిచారు. ఎన్నికల ముందు INCలో చేరిన నేతలను రాజధాని ప్రజలు ఆదరించలేదు.
మెదక్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఖాతా నుంచి BRS ఖాతాలోకి చేరిపోయింది. 2004 నుంచి 2019 వరకు రెండు దశాబ్దాలు మెదక్ బీఆర్ఎస్ MP అభ్యర్థులు దక్కించుకున్నారు. రాష్ట్రంలో మారిన అనూహ్య పరిణామాలతో బీఆర్ఎస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి తగ్గిపోయింది. కంచుకోటగా భావించిన సిద్దిపేటలోనూ బీఆర్ఎస్కు భారీ దెబ్బ తగిలింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ ఖాతా నుంచి బీజేపీలోకి వెళ్లింది.
కార్పొరేట్ కళాశాలల పథకం ద్వారా ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఒరిజినల్ ధృవపత్రాలను ఈ నెల 6న పరిశీలించనున్నట్లు ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకొని సీజీజీ-ఈపాస్ నుండి మెసేజ్ వచ్చిన విద్యార్థులు తమ ఒరిజినల్ ధృవపత్రాలతో ఈనెల 6న ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించారు.
వరుస సెలవులు అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఈనెల 7 నుంచి పున:ప్రారంభమవుతుందని బుధవారం మార్కెట్ అధికారులు తెలిపారు. కావున ఈ విషయాన్ని రైతులందరూ గమనించి మార్కెట్లో క్రయవిక్రయాలు సజావుగా జరిగేందుకు సహకరించాలన్నారు.
MP ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ను జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలు ఆదరించలేదు. ఎన్నికల ముందు ఇక్కడ BRSVsBJP అని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. కానీ నిన్నటి ఫలితాల్లో ఆయన డిపాజిట్ కోల్పోయారు. మెజార్టీ రౌండ్లలో BRS చివరి స్థానంలో నిలిచింది. ఫలితంగా 1,72,078(13.92%) ఓట్లకే పరిమితం కావడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి BRSలో చేరిన గాలి MPగా పోటీ చేసిన ఘోర పరాజయాన్ని మూటగట్టుకొన్నారు.
సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని ప్రజలు కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల కుట్రలను తిప్పి కొట్టారని కిషన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పరిధిలో ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో ఢిల్లీకి వెళ్తున్నానని, అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరిని కలుస్తానని అన్నారు. ఈ దఫా మహిళలతోపాటు యువ, దళిత పలు మోర్చాల కార్యకర్తలు విశేష కృషి చేశారన్నారు.
సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని ప్రజలు కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల కుట్రలను తిప్పి కొట్టారని కిషన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పరిధిలో ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో ఢిల్లీకి వెళ్తున్నానని, అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరిని కలుస్తానని అన్నారు. ఈ దఫా మహిళలతోపాటు యువ, దళిత పలు మోర్చాల కార్యకర్తలు విశేష కృషి చేశారన్నారు.
నల్గొండ, భువనగిరి రెండు లోక్సభ స్థానాల్లో గతంతో పోలిస్తే భాజపాకు గణనీయమైన ఓట్లు వచ్చాయి. నల్గొండ, భువనగిరి నుంచి పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు శానంపూడి సైదిరెడ్డి, బూర నర్సయ్యగౌడ్ రెండింటిలోనూ భారాస అభ్యర్థులను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలవడం విశేషం. నల్గొండలో శానంపూడికి 2,24,421 ఓట్లు రాగా, భువనగిరిలో గతేడాది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 3,32,467 ఓట్లు పెరగడం విశేషం.
ఆదిలాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆత్రంసక్కు డిపాజిట్ కోల్పోయారు. ఈయనకు ఈవీఎం ద్వారా 1,36,463 , పోస్టల్ బ్యాలెట్ 837, మెత్తంగా 1,37,300(11.11%) ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన ధరావత్ కోల్పోయారు. కాగా ఇక్కడి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటి చేసిన గోడం నగేశ్ కు 5,68,168 ఓట్లు (45.98%)వచ్చాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆత్రం సుగుణకు 4,77,516 (38.65%) ఓట్లు వచ్చాయి.
MP ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ను జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలు ఆదరించలేదు. ఎన్నికల ముందు ఇక్కడ BRSVsBJP అని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. కానీ నిన్నటి ఫలితాల్లో ఆయన డిపాజిట్ కోల్పోయారు. మెజార్టీ రౌండ్లలో BRS చివరి స్థానంలో నిలిచింది. ఫలితంగా 1,72,078(13.92%) ఓట్లకే పరిమితం కావడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి BRSలో చేరిన గాలి MPగా పోటీ చేసిన ఘోర పరాజయాన్ని మూటగట్టుకొన్నారు.
Sorry, no posts matched your criteria.