India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వినాయక నిమజ్జనాలు, భారీ జులూస్లతో హైదరాబాద్ దద్దరిల్లుతోంది. వేలాది విగ్రహాలు ట్యాంక్బండ్కు క్యూ కట్టాయి. మరికాసేపట్లో ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేశుడి భారీ శోభాయాత్ర ప్రారంభంకానుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కళాకారుల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, LED లైట్ల నడుమ యువత కేరింతలు కొడుతున్నారు. ‘జై బోలో గణేశ్ మహరాజ్కి జై’ నినాదంతో HYD హోరెత్తింది.
ఖమ్మం: గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది కేవలం 49 వేల రేషన్ కార్డులు మాత్రమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను మంజూరు చేస్తుందని చెప్పారు. దాదాపు 90 లక్షల కార్డులు ఇప్పుడు ఉన్నాయని, వాటిని బైఫరికేషన్ చేసి, స్మార్ట్ కార్డులు ఇస్తామని, ప్రతీ పేదవాడికి కార్డులు అందించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలో నేటి అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే గణేశ్ శోభాయాత్రకు 250 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. గణేశ్ మార్గ్లో సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి సమీక్ష చేస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని వచ్చే వాహనాలను ఇతర మార్గాల ద్వారా డైవర్ట్ చేశామని అన్నారు. ప్రధాన కూడళ్లలో పోలీస్ పీకేటింగ్ ఏర్పాటు చేశామన్నారు.
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో మంత్రి శ్రీధర్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు జరిగే ఈ వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద మంత్రి నివాళులు అర్పించి తర్వాత జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా మంగళవారం హాజరవుతున్నారు. నేడు ఉదయం 9:48 నిమిషాలకు అదాలత్ కూడలిలోని అమరవీరుల స్తూపానికి పూలతో అంజలి ఘటించి నివాళులు అర్పించనున్నారు. అనంతరం 10 గంటలకు హనుమకొండ కలెక్టరేట్కు చేరుకొని జాతీయ జెండా ఎగరవేస్తారు.
‘ఆపరేషన్ పోలో’లో భాగంగా 1948-09-17న హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైంది. ఇది జరిగి 76 ఏళ్లు పూర్తయినా ప్రతి ఏడాది కొత్త చర్చనే. విలీనమంటూ INC, సమైక్యత అని BRS-MIM, విమోచనమని BJP, సాయుధ పోరాటమని కమ్యూనిస్టులు, విద్రోహమని నిజాం పాలకుల మద్దతుదారులు వాదిస్తున్నారు. ఇటువంటి భిన్నాభిప్రాయాల మధ్య ‘SEP 17’ రాజకీయ బల ప్రదర్శనకు వేదికవుతోంది. ఈ వ్యవహారంలో మీ మద్దతు ఏ పార్టీకి ఇస్తారు..? కామెంట్ చేయండి.
‘ఆపరేషన్ పోలో’లో భాగంగా 1948-09-17న హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైంది. ఇది జరిగి 76 ఏళ్లు పూర్తయినా ప్రతి ఏడాది కొత్త చర్చనే. విలీనమంటూ INC, సమైక్యత అని BRS-MIM, విమోచనమని BJP, సాయుధ పోరాటమని కమ్యూనిస్టులు, విద్రోహమని నిజాం పాలకుల మద్దతుదారులు వాదిస్తున్నారు. ఇటువంటి భిన్నాభిప్రాయాల మధ్య ‘SEP 17’ రాజకీయ బల ప్రదర్శనకు వేదికవుతోంది. ఈ వ్యవహారంలో మీ మద్దతు ఏ పార్టీకి ఇస్తారు..? కామెంట్ చేయండి.
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారని, అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారని తెలిపారు.
2035 నాటికి తెలంగాణ రాష్ట్రం 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో ఆర్థిక, సామాజిక శ్రేయస్సుకు రిలయబుల్ ఎనర్జీ పునాది లాంటిదని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నారు.
వినాయక చవితి సందర్భంగా 11 రోజుల పాటు పూజలు అందుకున్న లంబోదరుడు రేపు గంగమ్మ ఒడిలోకి చేరనున్నాడు. అయితే వినాయకుడికి గంగమ్మ చెంతకు తీసుకెళ్లే క్రమంలో.. చిన్నపాటి నిర్లక్ష్యం భక్తుల ప్రాణాల మీదకు తెస్తోంది. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రతీ ఏటా ఉమ్మడి NZB జిల్లాలో నిమజ్జనం సమయంలో అపశృతులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏటా వినాయక నిమజ్జనం విషాదం కాకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ..గణేష్ నిమజ్జనం చేద్దాం.
Sorry, no posts matched your criteria.