Telangana

News June 4, 2024

18,498 ఓట్ల ఆధిక్యంలో కడియం కావ్య

image

వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా 2వ రౌండ్ పూర్తయ్యే సరికి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు 61,611 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌కు 43,113, బీఆర్ఎస్ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ 28,195 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 18,498 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

News June 4, 2024

BREAKING: HYD: కార్పొరేటర్ మృతి

image

HYD ఎర్రగడ్డ కార్పొరేటర్, MIM మహిళా నేత షాహిన్ బేగం ఈరోజు మృతిచెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా 2020లో జరిగిన GHMC ఎన్నికల్లో ఎర్రగడ్డ నుంచి MIM పార్టీ తరఫున ఆమె గెలిచారు. ఆమె మృతికి పలు పార్టీల నాయకులు సంతాపం తెలిపారు.

News June 4, 2024

BREAKING: HYD: కార్పొరేటర్ మృతి

image

HYD ఎర్రగడ్డ కార్పొరేటర్, MIM మహిళా నేత షాహిన్ బేగం ఈరోజు మృతిచెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా 2020లో జరిగిన GHMC ఎన్నికల్లో ఎర్రగడ్డ నుంచి MIM పార్టీ తరఫున ఆమె గెలిచారు. ఆమె మృతికి పలు పార్టీల నాయకులు సంతాపం తెలిపారు.

News June 4, 2024

గజ్వేల్ సెగ్మెంట్‌లో బీజేపీ ఆధిక్యం

image

గజ్వేల్ అసెంబ్లీ సిగ్మెంట్‌లో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. మొదటి రౌండ్‌లో బీజేపీకి 3728 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 2749 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్‌కు 2543 ఓట్లు పోలైనట్లు అధికారులు ప్రకటించారు. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి పై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 979 ఓట్ల ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ మూడవ స్థానానికి పడిపోయింది.

News June 4, 2024

8,806 ఓట్లతో గోడం నగేశ్ ముందంజ

image

ఆదిలాబాద్‌లో పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి 5,660 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి 19,623, బీజేపీ అభ్యర్థి 28,429 ఓట్లు సాధించారు. కాగా బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ 8,806 ఓట్లతో అధిక్యంలో ఉన్నారు.

News June 4, 2024

నిజామాబాద్: ధర్మపురి అర్వింద్ ముందంజ

image

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల లెక్కింపులో మెుదటి రౌండులో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ముందంజంలో ఉన్నారు. మెుదటి రౌండులో అర్వింద్ కు 6,506, రెండవ రౌండులో 6114 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మెుదటి రౌండులో 628 ఓట్లు, 519 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి 4,776, రెండవ రౌండులో4731 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రస్తుతం ధర్మపురి అర్వింద్‌కు 3113 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

News June 4, 2024

ఉమ్మడి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో 40.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా ధన్వాడలో 34.3, వనపర్తి జిల్లా దగడలో 33.1, గద్వాల జిల్లా అలంపూర్లో 32.4, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో 31.7 డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదయ్యాయి.

News June 4, 2024

కరీంనగర్: కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన సీపీ

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటుచేసిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్ కేంద్రాన్ని మంగళవారం ఉదయం పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి సందర్శించారు. కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరుగుతుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఆయన వెంట పలువురు పోలీస్ అధికారులు ఉన్నారు.

News June 4, 2024

కరీంనగర్: ప్రారంభమైన ఈవీఎంల కౌంటింగ్

image

కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. అనంతరం ఈవీఎంల కౌంటింగ్‌ను ఎన్నికల కౌంటింగ్ అధికారులు ప్రారంభించారు. ఈవీఏం మెషిన్లను ఓపెన్ చేసి వివిధ పార్టీల అభ్యర్థులకు పోలైన ఓట్లను నమోదు చేస్తూ కౌంటింగ్ ఏజెంట్లకు చూపుతున్నారు.

News June 4, 2024

నిజామాబాద్‌లో బీజేపీ లీడ్

image

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా మొదట పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు చేపట్టారు. నిజామాబాద్ లో మొత్తం 7414 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. పోస్టల్ ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీలో లీడ్‌లో ఉంది.