India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాల్లోని 10 శాసనసభ నియోజకవర్గాలకు రూ.10కోట్ల చొప్పున మంజూరయ్యాయి. వీటిలో రూ.2కోట్లను ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, రూ.కోటిని తాగునీటి అవసరాలకు వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. ఈ నిధులకు సంబంధించి పనులు అంచనాల దశలోనే ఉన్నాయి. ఎన్నికల సంఘం అనుమతితో తాగునీరు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన వంటి పనులు మాత్రమే కొనసాగుతున్నాయి.
కరీంనగర్లో ఎవరు గెలుస్తారు…? పెద్దపల్లిలో ఎవరు గెలుస్తారు..? రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటూ పార్లమెంట్ ఫలితాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మరికొద్ది గంటల్లోనే ఫలితాలు తేలిపోనుండటంతో అందరిలో పార్లమెంట్ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఎక్కడ నలుగురు కలిసినా ఓట్ల లెక్కింపు, ఫలితాలపైనే చర్చించుకుంటున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు తుది ఫలితాలు వెలువడే అవకాశాలుంటాయి.
WGL, MHBD ఎంపీ స్థానాల ఓట్ల లక్కింపునకు సర్వం సిద్ధమైంది. WGL ఎంపీ స్థానంలో WGL తూర్పు లెక్కింపు తొలుత పూర్తవనుండగా.. ఆ తర్వాత PLKY, వర్ధన్నపేట, WGL పశ్చిమ, PRKL, BHPL, ఘనపూర్ ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 125 టేబుళ్లకు గాను 18 రౌండ్లలో కౌంటింగ్ చేయనున్నారు. MHBD ఎంపీ స్థానంలో MHBD, NSPT, పినపాక, భద్రాచలం, ఇల్లందు, డోర్నకల్, ములుగు సెగ్మెంట్లలో 112 టేబుళ్లకు గాను 22 రౌండ్లలో లెక్కించనున్నారు.
✓ ఎంపీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం, కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలకరించిన తొలకరి వర్షాలు, చల్లబడిన వాతావరణం, వ్యవసాయ సాగులో రైతన్నలు
✓ పాలిసెట్ ఫలితాల్లో మెరిసిన పాలమూరు విద్యార్థులు.
✓ ఈనెల 6వ తేదీ నుంచి గృహ జ్యోతి అమలు.. అధికారుల వెల్లడి.
✓ ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమానికి అధికారుల సిద్ధం.
మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్ట్ లాంగ్వేజ్ కు సంబంధించిన పరీక్షలు జరిగాయి. అధికారులు మొత్తం 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 390 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా.. 325 మంది హాజరవగా.. మరో 65 మంది గైర్హాజరయ్యారు. ఈ మేరకు డీఈఓ రవీందర్ జిల్లాకేంద్రంలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
MBNR పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్శాఖ భారీ బందోబస్తును ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా ఉండేందుకు మొత్తం485 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుందని తెలిపారు.
MBNR, NGKL పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుండటంతో అన్ని రాజకీయ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. రెండు.. పార్లమెంటు నియోజకవర్గాలలో విజయం ఎవరిని వరిస్తుందో.. ఎవరు ఓటమిపాలు కాబోతున్నారనే అంశాలు ఉత్కంఠను రేపుతున్నాయి. గెలుపు మీదా.. మాదా అన్నట్లుగా ప్రచారాలు నిర్వహించారు. పోలింగ్ జరిగిన 20రోజులపాటు రాజకీయం చర్చలు జరిగాయి. నేడు కౌంటింగ్ అనంతరం మన కొత్త ఎంపీలు ఎవరో తేలనుంది.
ఖమ్మం MP ఓట్ల లెక్కింపునకు పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో సర్వం సిద్ధమైంది. ఖమ్మం, పాలేరు, మధిర, సత్తుపల్లి, వైరా, అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 115 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా ఒక్కో రౌండ్ కు కనీసం 30 నిమిషాల వ్యవధి పడుతుంది. ఈ లెక్క ప్రకారం 8.50 వరకు ఫలితం వెల్లడవుతుందని అధికారులు భావిస్తున్నారు.
MBNR, NGKLలోక్సభ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. MBNR బరిలో ఉన్న 31 మంది, NGKL బరిలో నిలిచిన 19 మంది భవితయ్వం నేడు తేలనుంది. మహబూబ్నగర్లో మొత్తం 12,18,597 మంది ఓటు వేయగా, నాగర్కర్నూల్లో మొత్తం 12,07,471 మంది ఓటేశారు. నాగర్కర్నూల్లో అచ్చంపేటలో అత్యధికంగా 22 రౌండ్లు, తక్కువగా నాగర్కర్నూల్లో 17 రౌండ్లను ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్లో షాద్నగర్లో తక్కువగా 19 రౌండ్లు ఉన్నాయి.
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ నేడు వీడనుంది. ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీల నేతలు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. మెదక్ జిల్లా నర్సాపూర్లోని రెండు కళాశాలల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్నది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 103 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 147 రౌండ్లలో ఫలితం తేలనుంది. కాగా మెదక్ పార్లమెంట్ బరిలో 44 మంది అభ్యర్థులు నిలిచిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.