India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 89 పోస్టులకు గానూ 48 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 41 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
HYD- తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే అధికారులు స్పెషల్ ట్రైన్ ప్రకటించారు. మే 23వ తేదీ వరకు వారానికి 2 సార్లు ఈ ట్రైన్ సేవలందిస్తుంది. చర్లపల్లి నుంచి (07017) శుక్ర, ఆదివారాల్లో, తిరుపతి నుంచి (07018) శని, సోమవారాల్లో నడుస్తుంది. మల్కాజిగిరి, కాచిగూడ, జడ్చర్ల, మహబూబ్నగర్, డోన్, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. చర్లపల్లి నుంచి రాత్రి 9.35కు, తిరుపతి నుంచి సాయంత్రం 4.40కు బయలుదేరుతుంది.
కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 258 పోస్టులకు గానూ 77 మంది మాత్రమే పని చేస్తున్నారు.ఇంకా 181 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన డిచ్పల్లి స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాలు.. సోమవారం రాత్రి డిచ్పల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయసు సుమారు 30-35 ఏళ్లు ఉండొచ్చని అంచనా వేశారు. వివరాలు తెలిసిన వారు 8712658591 నంబరును సంప్రదించాలన్నారు.
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ధనశ్రీ గ్రామంలో అబ్బాస్ (25)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. అబ్బాస్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి స్నేహితులతో విందుకు వెళ్లి గ్రామ శివారులో దాడికి గురయ్యాడు. దాడిలో అబ్బాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్ఐ రాజేందర్ రెడ్డి విచారణ చేపట్టారు.
మరోసారి వంటగ్యాస్ ధరలు పెరిగాయి. గృహ వినియోగ సిలిండర్పై రూ.50 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు నేటి నుంచి అమలులోకి వస్తాయి. దీంతో ప్రస్తుతం రూ.875గా ఉన్న సిలిండర్ ధర సవరించిన ధర రూ.50లతో కలిపి రూ.925కు చేరింది. ప్రస్తుతం రూ.503గా ఉన్న ఉజ్వల్ సిలిండర్కు కూడా పెంపు వర్తిస్తుందని తెలిపారు. దీంతో ఉజ్వల్ సిలిండర్ రూ.553కు చేరుకోనుంది. జిల్లా ప్రజలపై సుమారు 3 కోట్లకు పైగా భారం పడనుంది.
MMTS ప్రాజెక్టులో 82KM మేర 6 లైన్లను చేర్చినట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో ఘట్కేసర్- మౌలాలి క్వాడ్రిపులింగ్ (12 కి.మీ), తెల్లాపూర్- రామచంద్రాపురం కొత్త లైన్ (5 కి.మీ), మేడ్చల్- బొల్లారం డబ్లింగ్ (14 కి.మీ), ఫలక్నుమా- ఉమ్దనగర్ డబ్లింగ్ (1.4 కి.మీ), సనత్నగర్- మౌలాలి బైపాస్ డబ్లింగ్ (22 కి.మీ), సికింద్రాబాద్- బొల్లారం విద్యుద్ధీకరణ (15 కి.మీ) పనులు ఉన్నాయన్నారు.
శాతవాహన యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 39 మంజూరు పోస్టులకు గాను 16 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 21 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
శామీర్పేట్లోని జీనోమ్ వ్యాలీ PS పరిధిలో లాల్గడి మలక్పేట్ హైవేపై సఫారీ, కారు డీసీఎం ఢీ కొన్నాయి. సఫారీ వాహనం సిద్దిపేట నుంచి నగరానికి వస్తుండగా డివైడర్కు తగిలి ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులు సిద్దిపేట జిల్లా వర్గల్కు చెందిన రాజు, తుర్కపల్లి పరిధి మురహరిపల్లికి చెందిన శ్రవణ్గా పోలీసులు గుర్తించారు.
శామీర్పేట్లోని జీనోమ్ వ్యాలీ PS పరిధిలో లాల్గడి మలక్పేట్ హైవేపై సఫారీ కారు డీసీఎం ఢీ కొన్నాయి. సఫారీ వాహనం సిద్దిపేట నుంచి నగరానికి వస్తుండగా డివైడర్కు తగిలి ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులు సిద్దిపేట జిల్లా వర్గల్కు చెందిన రాజు, తుర్కపల్లి పరిధి మురహరిపల్లికి చెందిన శ్రవణ్లుగా పోలీసులు గుర్తించారు.
Sorry, no posts matched your criteria.