India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంగళవారం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి, ఎల్బీనగర్ జోన్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేస్తారని సీపీ తరుణ్ జోషి తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
HYD, ఉమ్మడి RRలో అర్హులైన విద్యుత్ వినియోగదారులకు ఈనెల 6 నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియగానే బిల్లులు జారీ చేయాలని డిస్కం నిర్ణయించింది. 200 యూనిట్లలోపు వినియోగదారులకు సున్నా బిల్లు జారీ చేయనున్నారు. మిగతా వారికి ఈనెల 1 నుంచే బిల్లింగ్ ప్రక్రియ మొదలుకాగా, పథకానికి దరఖాస్తు చేసుకున్నవారికి కోడ్ ముగియగానే సున్నా బిల్లు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
HYD, ఉమ్మడి RRలో అర్హులైన విద్యుత్ వినియోగదారులకు ఈనెల 6 నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియగానే బిల్లులు జారీ చేయాలని డిస్కం నిర్ణయించింది. 200 యూనిట్లలోపు వినియోగదారులకు సున్నా బిల్లు జారీ చేయనున్నారు. మిగతా వారికి ఈనెల 1 నుంచే బిల్లింగ్ ప్రక్రియ మొదలుకాగా, పథకానికి దరఖాస్తు చేసుకున్నవారికి కోడ్ ముగియగానే సున్నా బిల్లు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1.11 కోట్ల మొక్కలు నాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం విధించింది. పర్యావరణ, అటవీ, పంచాయతీ రాజ్, రహదారులు, నీటి పారుదల, వ్యవసాయ, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్య, పశు సంవర్ధక, వైద్యారోగ్య, సాంఘిక సంక్షేమ తదితర శాఖలకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించి ఒక్కో శాఖకు ఒక్కో లక్ష్యాన్ని నిర్దేశించింది. నర్సరీల్లో సుమారు 76.24 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచారు.
పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం మే 24న పాలిసెట్ పరీక్ష నిర్వహించారు. కాగా ఆ పరీక్షకు సంబంధించిన ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,059 విద్యార్థులు ఉండగా బాలురు 531, బాలికలు 408, మొత్తం 939 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, ర్యాంకు ఆధారంగా వివిధ పాలిటెక్నిక్ కళాశాలలు, కోర్సులలో అడ్మిషన్స్ జరుగుతాయి.
భర్తపై బెంగతో భార్య చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మోతె మండల పరిధిలోని పేదరాజుతండాలో ఆదివారం జరిగింది. ఏఎస్ఐ సత్యనారాయణ వివరాల ప్రకారం.. బానోతు రంగమ్మ(80) భర్త గత నెల 5వ తేదీన మృతి చెందారు. భర్తపై బెంగతో గ్రామ పరిధిలోని చెరువులో దూకి రంగమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుమారుడు హంస్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నగరంలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. హైమద్ పుర కాలనీలకి చెందిన సోహెల్, అతని భార్య మధ్య విభేదాలు రావడంతో ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకునేందుకు రాగ అక్కడ మాట మాట పెరిగింది. దీంతో భార్య తరపు బంధువులు, సోహెల్ అతని సోదరుడిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. సోహెల్ ఎదురుదాడి చేయడంతో రెండు వర్గాల వారికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి. వన్ టౌన్ SHO ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు.
లోక్సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో కరీంనగర్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BJP నుంచి బండి సంజయ్, BRS నుంచి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
లోక్సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో వరంగల్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి సుధీర్ కుమార్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, BJP నుంచి ఆరూరి రమేశ్ పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా.. BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
జహీరాబాద్ ఎంపీ ఓట్ల లెక్కింపునకు గీతం వర్సిటీలో మొత్తం 98 టేబుళ్లు- 145 రౌండ్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య తక్కువగా ఉన్న జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి సెగ్మెంట్లల్లో లెక్కింపు ప్రక్రియ తొలుత పూర్తి కానుంది. చివరిలో అందోల్, జహీరాబాద్ ఫలితాలు తేలనున్నాయి. అందోల్, జహీరాబాద్లో 23 రౌండ్లలో లెక్కింపు కారణంగా 5:30గ.కు పైగా సమయం పట్టనుంది. విజేత ఎవరో మధ్యాహ్నం తెలిసే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.