India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేటు బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతోంది.
లోక్సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో మహబూబ్నగర్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, BJP నుంచి డీకే అరుణ పోటీలో ఉన్నారు. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కొన్ని బీజేపీకి అనుకూలంగా రాగా.. మరికొన్ని కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి. PUలో రేపు కౌంటింగ్ జరగనుంది. సీఎం ఇలాకా కావడంతో ఈ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
నల్లగొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో అత్యధికంగా 324 పోలింగ్ బూత్లు ఉన్న దేవరకొండ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు 24 రౌండ్లలో పూర్తి కానుండగా మిర్యాలగూడ నియోజకవర్గంలో 264 బూత్లు ఉండగా 19 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 306 పోలింగ్ కేంద్రాలుండగా.. 22 రౌండ్లు పోలింగ్ ప్రక్రియ పూర్తి కానుంది.
ఉమ్మడి జిల్లాలో నేడు పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. MBNR, NGKL, వనపర్తి, నారాయణపేట, జిల్లాలలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఆదివారం అర్ధరాత్రి తగిన తర్వాత పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఎంపీ ఎన్నికల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండగా, గంటలోనే మొదటి రౌండ్ ఫలితాన్ని వెల్లడించనున్నారు. ఒక్కో రౌండ్లో 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 24 రౌండ్లలో పూర్తి లెక్కింపు కానుంది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో పూర్తి ఫలితం వెలువడనుంది. అయితే ప్రతి టేబుల్కు ఆయా పార్టీలకు సంబంధించిన ఒక ఏజెంట్ను నియమించుకునేందుకు అనుమతిస్తారు.
లోక్సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో నిజామాబాద్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డి, BJP నుంచి ధర్మపురి అర్వింద్ పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా.. BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోక్ సభ స్థానాల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. ఫలితాల కోసం జిల్లా ప్రజానీకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఫలితాల సమాచారం ప్రజలకు నేరుగా చేరేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఖమ్మంలోని కొత్త, పాత బస్టాండ్, రైల్వే స్టేషన్, వైరా, సత్తుపల్లి, మధిర బస్టాండ్ల వద్ద ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి ఫలితాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తామన్నారు.
లోక్సభ ఎన్నికలు ఫలితాలు రేపే వెలువడనుండడంతో మల్కాజిగిరి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్రెడ్డి, BJP నుంచి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. కాగా BRS, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు కావడంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
లోక్సభ ఎన్నికలు ఫలితాలు రేపే వెలువడనుండడంతో మల్కాజిగిరి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్రెడ్డి, BJP నుంచి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. కాగా BRS, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు కావడంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
పెద్దపల్లి లోక్సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 రోజుల ఉత్కంఠకు రేపటితో తెర పడనుంది. సెంటీనరీ కాలనీలోని JNTUH ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ప్రతి శాసన సభ నియోజకవర్గానికి 14 టేబుళ్ల చోప్పున ఏర్పాటు చేస్తున్నారు. పెద్దపల్లి లోక్సభ పరిధిలో మొత్తం 15,96,430 మంది ఓటర్లు ఉండగా, 10,83,453 ఓట్లు పోలయ్యాయి.
Sorry, no posts matched your criteria.