Telangana

News June 3, 2024

ఖమ్మం: వడదెబ్బకు గురై ఆరుగురు మృతి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండ దెబ్బతో ఆదివారం ఒక్కరోజే ఆరుగురు మృత్యువాతపడ్డాడు. ఖమ్మంలో ఇద్దరు, వైరాలో ఒకరు, నేలకొండపల్లిలో కరువు పనికెళ్తూ ఒకరు, బూర్గంపాడులో ఒకరు, కొత్తగూడెంలో మరొకరు వడదెబ్బతో చనిపోయారు. 

News June 3, 2024

HYD: విశేషంగా ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు

image

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం మాదాపూర్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ ప్రదర్శనలు కళా ప్రియులను అలరించాయి. నాట్య గురువుల విద్యారావు, స్మితా మాధవ్, అర్చన మిశ్రా, సౌందర్యకౌశిక్ శిష్య బృందాలు చక్కటి హావ భావాలతో లయాత్మకంగా నృత్యం చేసిన తీరు నయనానందకరంగా సాగింది.

News June 3, 2024

HYD: విశేషంగా ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు

image

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం మాదాపూర్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ ప్రదర్శనలు కళా ప్రియులను అలరించాయి. నాట్య గురువుల విద్యారావు, స్మితా మాధవ్, అర్చన మిశ్రా, సౌందర్యకౌశిక్ శిష్య బృందాలు చక్కటి హావ భావాలతో లయాత్మకంగా నృత్యం చేసిన తీరు నయనానందకరంగా సాగింది.

News June 3, 2024

ఆదిలాబాద్: రేపు మద్యం దుకాణాలు బంద్

image

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు ఆదిలాబాద్ ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసి ఉంచాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

News June 3, 2024

పెద్దపల్లి: కాంగ్రెస్ నాయకుడు హత్య

image

పెద్దపల్లి జిల్లాలో హత్య జరిగింది. స్థానికుల వివరాలు.. ధర్మారం మండలం కటికెనపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రేండ్ల నరేశ్‌ కొత్తగా ఇంటిని నిర్మించుకుంటున్నారు. అక్కడ సమీపంలోని ఓ షెడ్డులో ఉంటూ పనులు చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో చీకటి పడ్డాక ఇద్దరు వ్యక్తులు పదునైన ఆయుధంతో దాడి చేయగా.. తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 3, 2024

శేరిలింగంపల్లిలో అత్యధికంగా 23 రౌండ్ల లెక్కింపు

image

చేవెళ్ల లోక్‌సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటి పరిధిలో మొత్తం 29,38,370 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా చేవెళ్లలో 71.83% పోలింగ్ నమోదు కాగా… అతి తక్కువ శేరిలింగంపల్లిలో 43.91 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 23 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు ఉంటుందని కలెక్టర్ శశాంక తెలిపారు.

News June 3, 2024

శేరిలింగంపల్లిలో అత్యధికంగా 23 రౌండ్ల లెక్కింపు

image

చేవెళ్ల లోక్‌సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటి పరిధిలో మొత్తం 29,38,370 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా చేవెళ్లలో 71.83% పోలింగ్ నమోదు కాగా… అతి తక్కువ శేరిలింగంపల్లిలో 43.91 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 23 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు ఉంటుందని కలెక్టర్ శశాంక తెలిపారు.

News June 3, 2024

HYD: మండీ బిర్యానీ తిని 10 మందికి అస్వస్థత

image

మండీ బిర్యానీ తిని 10 మంది అస్వస్థతకు గురయ్యారు. ఘట్‌కేసర్ ఎస్ఐ రాము తెలిపిన వివరాలు.. భూపాలపల్లికి చెందిన ఉషారాణి(22), మహేశ్(25), అశోక్, చందు, మౌనిక, రేణుకతో పాటు నలుగురు చిన్నారులు ఇటీవల HYDకు కారులో వచ్చి ఘట్‌కేసర్‌‌లోని స్థానిక అరేబియా మండీలో బిర్యానీ తిన్నారు. అనంతరం వారంతా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉషారాణి తండ్రి నరసింహచారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 3, 2024

తాడ్వాయి: తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక అన్న హఠాన్మరణం

image

కృష్ణాజివాడికి చెందిన దాసరి నర్సింలు మస్కట్‌లోని ఓమన్‌లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. 15 రోజుల అనంతరం స్వదేశానికి నర్సింలు మృతదేహం వచ్చింది. ఆదివారం అంత్యక్రియలు చేసే సందర్భంలో పెద్ద నర్సింలు(50) బోరున విలపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు నర్సింలును కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

News June 3, 2024

HYD: మండీ బిర్యానీ తిని 10 మందికి అస్వస్థత 

image

మండీ బిర్యానీ తిని 10 మంది అస్వస్థతకు గురయ్యారు. ఘట్‌కేసర్ ఎస్ఐ రాము తెలిపిన వివరాలు.. భూపాలపల్లికి చెందిన ఉషారాణి(22), మహేశ్(25), అశోక్, చందు, మౌనిక, రేణుకతో పాటు నలుగురు చిన్నారులు ఇటీవల HYDకు కారులో వచ్చి ఘట్‌కేసర్‌‌లోని స్థానిక అరేబియా మండీలో బిర్యానీ తిన్నారు. అనంతరం వారంతా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉషారాణి తండ్రి నరసింహచారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.