India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహానగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బస్తీ, కాలనీ, గల్లీ తేడా లేకుండా నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాథుడు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నాడు. నగర వ్యాప్తంగా 1.40 లక్షల విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు అధికారుల అంచనా. నిమజ్జనం జరిగే వరకు ప్రత్యేక కార్యక్రమాలు, అన్నదానాలు ఏర్పాటు చేసి నవరాత్రులను ఘనంగా జరుపుకోనున్నారు. శుక్రవారం నుంచి నిమజ్జనాల హడావుడి షురూ అవుతుంది.
భారీ వర్షాలతో NH- 44 నాగ్పూర్ హైవే దెబ్బతింది. ప్రజల భద్రత కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డైవర్షన్ అమలు చేశారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న లారీలు మెడ్చల్ చెక్పోస్ట్ సిద్ధిపేట- కరీంనగర్ – కోరుట్ల – మెట్పల్లి- ఆర్మూర్- ఆదిలాబాద్ వెళ్లాలని సూచించారు. కార్లు తూప్రాన్- సిద్ధిపేట- జగిత్యాల- కోరుట్ల- మెట్పల్లి- ఆర్మూర్- ఆదిలాబాద్ వైపు వెళ్లాలన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని తెలిపారు.
కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి గురువారం ఉదయం 11 గంటలకు ఎగువ నుండి ఇన్ ఫ్లోగా 2 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా 2,76,567 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఇందులో 39 గేట్ల ద్వారా 2.50 లక్షల క్యూసెక్కులు,
ఇందిరమ్మ కాల్వకు 17300, మిషన్ భగీరథకు 231, సరస్వతీ కెనాల్ కు 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
రాజేంద్రనగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ శనివారం 30న మిగిలిపోయిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. NRI కోటాలో అగ్రి ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ(బీటెక్), బీఎస్సీ అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో సీట్లు మిగిలిపోవడంతో ఈ స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఉ.10 గంటలకు హాజరుకావాలని రిజిస్ట్రార్ విద్యాసాగర్ తెలిపారు. వివరాలకు pjtau.edu.in చూడాలన్నారు.
జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎప్పుడనేది ఇంకా స్పష్టత లేదు. రాజస్థాన్, పంజాబ్, యూపీ, మిజోరం రాష్ట్రాల్లోనూ కొన్ని ఎమ్మెల్యే స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు జూబ్లీహిల్స్లోనూ బై ఎలక్షన్స్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా అక్టోబరులో EC ఎన్నికల తేదీలు ప్రకటించి నవంబర్లో ఎలక్షన్స్ నిర్వహించవచ్చని తెలుస్తోంది.
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన పలు కార్యక్రమాలు వాయిదా పడనున్నట్లు సమాచారం. నకిరేకల్లో నేడు జరగాల్సిన జనహిత పాదయాత్రతో పాటు, 29న అచ్చంపేటలో, 30న జూబ్లీహిల్స్లో జరగాల్సిన సభలు కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. వర్షాల తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై చర్చించేందుకు నేడు కీలక సమావేశం జరుగనుంది. బంజారాహిల్స్లోని ఓ హోటల్ ఈ సమావేశానికి వేదిక కానుంది. తెలంగాణ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటైన తర్వాత ఇది మొదటి సమావేశం. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. సంజీవ్ గోయంకా, కావ్య మారన్, ఉపాసన, పుల్లెల గోపీచంద్, కపిల్ దేవ్, శశిధర్ తదితరులు రానున్నట్లు సమాచారం.
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం రాజ్ పేట వద్ద బుధవారం వరద ప్రవాహంలో చిక్కుకున్న 10 మందిని రెస్క్యూ టీమ్ కాపాడింది. రాజ్ పేట గ్రామానికి చెందిన మరో ఇద్దరు రాజాగౌడ్, సత్యనారాయణ గల్లంతయ్యారు. ఇందులో సత్యనారాయణ మృతదేహం లభ్యమైనట్లు గ్రామస్థులు తెలిపారు. మరో వ్యక్తి రాజాగౌడ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. రాజ్ పేటకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నింటిని దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు గందరగోళంలో పడిపోయారు. వర్షాలు ఇంకా కురిసే అవకాశముండటంతో మరికొన్ని రైళ్లు రద్దుచేసి దారి మళ్లించే అవకాశముంది. అందుకే ప్రయాణికుల సహాయార్థం రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ 040-27786170, కాచిగూడ- 9063318082
భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ పరిధిలో వేలాది గణపతి మండపాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వాటి పక్కన కరెంట్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు ఉంటే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, అగ్నిమాపకశాఖ, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు అధికారులు వర్షం పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. పురాతన ఇళ్లల్లోఉన్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించాలన్నారు.
Sorry, no posts matched your criteria.