Telangana

News June 2, 2024

KTDM: కుల బహిష్కరణ నెపంతో దాడి

image

కుల బహిష్కరణ నెపంతో తమపై గ్రామస్థులు దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ములకలపల్లి మండలం చాపరాలపల్లికి చెందిన గద్దల రాజు రెండు నెలల క్రితం బొడ్రాయి ప్రతిష్ఠకు చందా ఇవ్వలేదు. దీంతో కుల బహిష్కరణ చేశారు. శనివారం తన సమీప బంధువు చనిపోగా వెళ్లిన క్రమంలో గ్రామస్థులు చేశారని రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News June 2, 2024

చిరుత దాడిలో దూడ మృతి

image

ఓ బర్రె దూడను చిరుత తినేసిన ఘటన కోనరావుపేట మండలంలోని ధర్మారం గ్రామంలో జరిగింది. బాధిత రైతు లక్ష్మినర్సు తెలిపిన వివరాలు.. సత్యనారాయణ పల్లె వద్ద తన పొలంలో ఏర్పాటు చేసుకున్న షెడ్‌లో రైతు రోజు మాదిరిగానే దూడను కట్టేశాడు. శనివారం రాత్రి సమయంలో షెడ్‌లోకి ప్రవేశించిన ఓ చిరుత బర్రె దూడపై దాడి చేసి కళేబరాన్ని అక్కడే వదిలేసి వెళ్లింది. ఆదివారం షెడ్‌కు వెళ్లిన రైతు దూడపై చిరుత దాడి చేసినట్లు గుర్తించారు. 

News June 2, 2024

కామారెడ్డి. రేపటి నుంచి టెన్త్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు

image

పదో తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆయా కేంద్రాలకు అరగంట ముందుగా చేరుకోవాలని సూచించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.

News June 2, 2024

HYD: మీ సలహాలను మాతో పంచుకోండి!

image

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజల నుంచి ట్రాఫిక్ తగ్గించడం, జంక్షన్ డెవలప్మెంట్, కార్ పూలింగ్, రైడ్ షేరింగ్, ట్రాఫిక్ సంబంధిత సమస్యలపై సలహాలు, సూచనలను స్వీకరించనున్నట్లు తెలిపారు. మీ అమూల్యమైన ఐడియాలను 7569311356 వాట్సప్, Cyberabad Traffic police X అకౌంట్, @Cyberabadtrafficpolice ఫేస్ బుక్ అకౌంట్‌కు తెలపవచ్చని పేర్కొన్నారు.

News June 2, 2024

HYD: మీ సలహాలను మాతో పంచుకోండి!

image

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజల నుంచి ట్రాఫిక్ తగ్గించడం, జంక్షన్ డెవలప్మెంట్, కార్ పూలింగ్, రైడ్ షేరింగ్, ట్రాఫిక్ సంబంధిత సమస్యలపై సలహాలు, సూచనలను స్వీకరించనున్నట్లు తెలిపారు. మీ అమూల్యమైన ఐడియాలను 7569311356 వాట్సప్, Cyberabad Traffic police X అకౌంట్, @Cyberabadtrafficpolice ఫేస్ బుక్ అకౌంట్‌కు తెలపవచ్చని పేర్కొన్నారు.

News June 2, 2024

WGL: పలు రైళ్లు రద్దు

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనుల వల్ల కాజీపేట మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను నేటి నుంచి రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-గుంటూరు-సికింద్రాబాద్ మధ్య నడిచే గోల్కొండ, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్, సికింద్రాబాద్-విజయవాడ-సికింద్రాబాద్ మధ్య నడిచే శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈనెల 2,5,6,8,9 తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు.

News June 2, 2024

చేప పిల్లల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు: మత్య్సశాఖ

image

నీరు ఉన్న చెరువుల్లోనే ఉచిత చేప పిల్లలను వదిలామని, ఈ ప్రక్రియ మండల స్థాయి అధికారుల సమక్షంలో జరిగిందని మత్స్యశాఖ జిల్లా అధికారి వెంకయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పలు మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. నీరు లేని చెరువుల్లో చేప పిల్లలు వదల లేదని పేర్కొన్నారు. చేప పిల్లల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలిపారు. కలెక్టర్ ఆమోదంతో బిల్లుల చెల్లింపునకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు.

News June 2, 2024

వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండండి: డిప్యూటీ సీఎం భట్టి

image

కొద్దిరోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో యావత్ విద్యుత్తు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలోనూ ఎటువంటి అంతరాయం తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. లైన్స్ క్లియరెన్స్ (ఎల్సి) విషయంలోనూ జాగ్రత్త వహించాలని విద్యుత్ అధికారులను సూచించారు.

News June 2, 2024

గజ్వేల్: యువకుడి అనుమానాస్పద మృతి.. ఛేదించిన పోలీసులు

image

గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గురువారం రాత్రి అనుమానాస్పదంగా <<13346047>>యువకుడు మృతి<<>> చెందిన కేసును పోలీసులు ఛేదించారు. అహ్మదీపూర్ గ్రామానికి చెందిన జమాల్పూర్ సోనీబాయి(34)తో నరేశ్ చారి అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో సోని కూతురిపై నరేశ్ కన్నేశాడని గమనించి, పలుమార్లు మందలించింది. అయినా వినకపోవడంతో కొడుకు జమాల్పూర్ కిషోర్‌తో కలిసి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు గజ్వేల్ ACP పురుషోత్తంరెడ్డి తెలిపారు.

News June 2, 2024

ఖమ్మంలో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

image

ఖమ్మం శివారు ధంసలాపురం ఫ్లైఓవర్ సమీపంలో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఆర్పీ ఎస్సై భాస్కర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం గ్రామీణ మండలం గుదిమళ్ల నంద్యతండాకు చెందిన బాణోత్ ప్రసాద్(25)కు ఇటీవల ప్రేమ వివాహమైంది. పనిచేయకుండా తిరుగుతున్నావంటూ శనివారం భార్య మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ ఎస్సై భాస్కర్ రావు తెలిపారు.