Telangana

News September 16, 2024

KNR: ట్రాక్టర్ నడిపిన బండి సంజయ్

image

ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం జరుపుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన కరీంనగర్ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వినాయక శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శోభయాత్ర ర్యాలీలో ట్రాక్టర్‌ను నడిపి సరదాగా గడిపారు. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

News September 16, 2024

HYD: కెనడాలో మీర్‌‌పేట్ యువకుడి మృతి

image

కెనడాలో మీర్‌‌పేట్ యువకుడు మృతిచెందాడు. మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ ఓల్డ్ బాలాజీ నగర్‌కు చెందిన ప్రణీత్ కెనడాలో నివసిస్తున్నాడు. ప్రణీత్ పుట్టినరోజు కావడంతో అన్న ప్రణయ్, స్నేహితులతో కలిసి బోట్‌లో చెరువులోకి వెళ్లారు. చెరువులో బోటింగ్ చేసి తిరిగి వస్తుండగా.. ప్రణీత్ బోట్‌లో రాకుండా ఈదుకుంటూ వచ్చాడు. దీంతో మార్గమధ్యలో నీటమునిగి మృతిచెందాడు. ప్రణీత్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News September 16, 2024

ఫిలిప్పీన్స్‌లో వేల్పూర్ యువకుడి మృతి

image

ఫిలిప్పీన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేల్పూర్ మండలానికి చెందిన అక్షయ్ మృతి చెందాడు. అక్షయ్ ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. మరో ఐదు నెలలో ఎంబీబీఎస్ కావస్తున్న సమయంలో అక్షయ్ ఆకస్మిక మృతి అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 16, 2024

HYD: గణపతి నిమజ్జనం.. జలమండలి సిద్ధం!

image

HYD నగరంలో గణపతి నిమజ్జనం, శోభాయాత్రలకు నీరు సరఫరా చేసేందుకు జలమండలి సిద్ధమైందని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 122 వాటర్ క్యాంపులు, 35 లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేసామన్నారు. రానున్న 72 గంటలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లుగా ఆదేశించారు. అవసరమైన చోటా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జనరల్ మేనేజర్లకు సూచించారు.

News September 16, 2024

వట్టెం నవోదయలో ప్రవేశాలకు గడువు పెంపు

image

బిజీనేపల్లి మండలం వట్టెంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ శ్రీ పి.భాస్కర్ కుమార్ తెలిపారు. ఐదో తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు నవోదయ వెబ్‌సైట్‌లో చూడాలని చెప్పారు.

News September 16, 2024

తిమ్మాపూర్: వలకు చిక్కిన 28 కిలోల చేప

image

తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ సంగంపల్లి గ్రామానికి చెందిన కూడా తిరుపతికి కొత్తపల్లి గ్రామం మోయ తుమ్మెద వాగులో (ఎల్ఎండి మానేరు డ్యామ్)లో 28 కిలోల బొచ్చె చేప వలకు చిక్కింది. చేపల వేటలో భాగంగా సోమవారం మత్స్యకారులు వాగులో చేపలు పడుతున్న సందర్భంలో తిరుపతి అనే మత్స్యకారుడి వలలో భారీ చేప చిక్కింది. గణపతి నిమజ్జనం రోజున ఈ వాగులో ఇంత పెద్ద చేప తన వలకు చిక్కడం ఎంతో శుభసూచకమని అతను ఆనందం వ్యక్తం చేశాడు.

News September 16, 2024

HYD: ఖైరతాబాద్ గణేష్ మండపం తొలగింపు షురూ!

image

HYD నగరంలో ఖైరతాబాద్ వినాయకుడు వద్ద నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఇప్పటికే భక్తులకు దర్శనాలు నిలిపివేసి,మండప తొలగింపు పనులు చేపట్టారు.సమయానికి పనులు అయ్యేలా చూడాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు.ఖైరతాబాద్ సప్తముఖ గణనాథుడు ఈ రోజు సాయంత్రం టస్కర్ మీదకు వెల్డింగ్ పనులు చేయనుండడంతో సమయానికి పూర్తి చేసేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News September 16, 2024

HYD: ఖైరతాబాద్ గణేష్ మండపం తొలగింపు షురూ!

image

HYD నగరంలో ఖైరతాబాద్ వినాయకుడు వద్ద నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఇప్పటికే భక్తులకు దర్శనాలు నిలిపివేసి,మండప తొలగింపు పనులు చేపట్టారు.సమయానికి పనులు అయ్యేలా చూడాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు.ఖైరతాబాద్ సప్తముఖ గణనాథుడు ఈ రోజు సాయంత్రం టస్కర్ మీదకు వెల్డింగ్ పనులు చేయనుండడంతో సమయానికి పూర్తి చేసేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News September 16, 2024

గుండెపోటుతో టీచర్ మృతి.. నేత్రదానం

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మోడల్ స్కూల్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు ధ్యాప వెంకటస్వామి(49) ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు. మృతుడి స్వస్థలం జగదేవ్పూర్ మండలం అలిరాజపేట గ్రామం. అతడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, వయస్సు మీద పడిన తల్లిదండ్రులు ఉన్నారు. వెంకట్ అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పుట్టెడు దు:ఖంలోనూ నేత్రదానానికి ఆ కుటుంబీకులు ముందుకొచ్చి మరో ఇద్దరికి చూపు ఇచ్చారని మిత్రబృందం తెలిపింది.

News September 16, 2024

రేపే నిమజ్జనం.. ఖైరతాబాద్ గణేశ్ ఎంత బరువంటే?

image

70 టన్నుల ఖైరతాబాద్ గణేశ్ రేపు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. కాగా విగ్రహ తయారీ అప్పుడు 30 టన్నుల స్టీలు, గుజరాత్ గాంధీనగర్ నుంచి 35 కిలోల బరువున్న ప్రత్యేక మట్టి 1000 బ్యాగులు, 50 కిలోల బరువున్న 100 బండిళ్ల వరి గడ్డి, 10 కిలోల బరువున్న వరి పొట్టు 60 బస్తాలు, 10 ట్రాలీల సన్న ఇసుక, 2 వేల మీటర్ల గోనె బట్ట, 80 కిలోల సుతిలీ తాడు, 5 వేల మీటర్ల మెష్, 2500 మీటర్ల కోరా బట్ట, టన్ను సుతిలీ పౌడర్ వినియోగించారు.