Telangana

News April 8, 2025

HYD: వామ్మో.. చెవులకు చిల్లులు పడుతున్నాయి

image

నగరంలో రోడ్లపై వెళితే చాలు హారన్ మోతలు చెవులకు చిల్లులు పడేలా చేస్తున్నాయి. PCB రూల్స్ మేరకు సిటీలో 65 డెసిబుల్స్ శబ్దం మించారాదు. జీడిమెట్ల, గడ్డిపోతారం, హుసేన్‌సాగర్, ఉప్పల్, జూబ్లిహిల్స్, అబిడ్స్, గచ్చిబౌలి, తార్నాక, జూపార్క్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో సాయంత్రం అయితే చాలు 100 డెసిబుల్స్ దాటిపోతోంది. ఉప్పల్- గచ్చిబౌలి రూట్లో అయితే ఏకంగా 110 నమోదవుతోంది.

News April 8, 2025

PDPL: కుమార్తె ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య

image

అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి(D) జూలపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ సనత్‌కుమార్ వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన అజ్గర్ పాషా(43) దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, చిన్న కుమార్తె స్థానిక యువకుడిని ఇటీవల ప్రేమవివాహం చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన తండ్రి గడ్డిమందు తాగి, సోమవారం మృతి చెందాడు.

News April 8, 2025

కామారెడ్డిలో కల్తీ కల్లు తాగి 58 మందికి అస్వస్థత

image

కల్తీ కల్లు తాగి 58 మంది అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ మండలం రామరంచ గ్రామాలకు చెందిన 58 మంది సోమవారం కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు తాగారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది వెంటనే 46 బాన్సువాడ ఆసుపత్రికి, 12 మందిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.

News April 8, 2025

బుద్ధవనాన్ని సందర్శించనున్న మిస్ వరల్డ్ పోటీదారులు

image

బుద్ధపూర్ణిమ సందర్భంగా మే 12న నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మిస్ వరల్డ్ పోటీ దారుల రాక ఏర్పాట్లపై సోమవారం తన ఛాంబర్‌లో పర్యాటక, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసియా దేశాలకు చెందిన 30 మంది ప్రపంచ సుందరి పోటీదారులు రానున్నారు.

News April 8, 2025

MBNR: ఎరుకల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి

image

ఎరుకల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయిని కలిసి ఎరుకల సంఘం సభ్యులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్సరి కృష్ణయ్య మాట్లాడుతూ.. పేద ఎరుకలకు విద్య, వైద్యం, సీసీ రోడ్లు, ఉపాధి, మౌలిక వసతులు కల్పించి వారి సంక్షేమానికి కృషి చేయాలని వారు కోరారు. పందుల పెంపకం దారులకు ప్రత్యామ్నాయ ఉపాధి, గిరిజన రుణాలు, రుణమాఫీ, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నారు.

News April 8, 2025

ఖమ్మం: వివాహేతర సంబంధం.. వ్యక్తి ప్రాణం తీసింది!

image

మహిళ క్షణికావేశంలో ఓ వ్యక్తిని నెట్టివేయడంతో గోడకు తగిలి మృతిచెందిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. ఖానాపురం పోలీసుల వివరాలిలా.. ఏలూరు జిల్లా చింతలపూడి మండలానికి చెందిన రవిప్రసాద్ గత కొద్దిరోజులుగా ఖమ్మం నగరంలో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. రవిప్రసాద్‌ను పక్కకు నెట్టివేయడంతో తలకు గాయాలై మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News April 8, 2025

KMM: ఊరంతా ఏకమై.. సమస్యలు పరిష్కరించుకొని

image

ఖమ్మం(D) ఏన్కూరు(M) మేడిపల్లి గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. ఓట్లప్పుడు మాత్రమే ప్రజల వైపు చూసే నాయకులకు ఊరంతా ఏకమై, తమ సమస్యలు పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామని గట్టిగా చెబుతున్నారు. గతంలో ఓట్లు బహిష్కరించి మరీ గ్రామంలో మౌలిక వసతులు సాధించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఊరంతా ఏకమై సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కదులుతున్నారు. ఇలా ప్రతీ చోట ఉంటే గ్రామ స్వరాజ్యం అందినట్లే. దీనిపై మీ కామెంట్..

News April 8, 2025

నారాయణపేట: హత్య కేసులో నేరస్థుడికి జైలు శిక్ష

image

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని నారాయణపేట ఎస్పీ యోగేశ్‌గౌతమ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. వింజమూరు వాసి జోగువెంకట్ రాములు కొత్తపల్లి(M) తిమ్మారెడ్డిపల్లి వాసి కృష్ణవేణిపై అత్యాచారానికి యత్నించి నిప్పంటించి చంపేశాడు. ఈకేసులో ముద్దాయికి సోమవారం జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ శిక్ష విధించారు. 2022 FEB 15న బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామన్నారు.

News April 8, 2025

ఆదిలాబాద్‌లో 12ఏళ్ల బాలికపై అత్యాచారం

image

12ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆదిలాబాద్‌లో వెలుగుచూసింది. DSP జీవన్ రెడ్డి తెలిపిన వివరాలు.. మావల పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలికను ఓ 35ఏళ్ల మహిళ ఆదివారం మధ్యాహ్నం అడవిలోకి తీసుకెళ్లింది. ఆమె బంధువుతో కలిసి అక్కడకు వచ్చిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకులతో పాటు మహిళ, ఆమె బంధువుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

News April 8, 2025

దిల్‌సుఖ్‌నగర్ బాంబ్ బ్లాస్ట్ .. నేడే తీర్పు

image

దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువరించబోతుంది. 2013 FEB 21న జరిగిన ఈ బాంబ్ దాడిలో 18 మంది మృతి చెందగా, 130 మందికి గాయాలవ్వడం అప్పట్లో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితులు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి NIA కోర్టు ఉరిశిక్ష వేయగా, దీనిపై హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పేలుళ్ల ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.

error: Content is protected !!