India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ రైతు మార్కెట్లో సోమవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. KG టమాటా రూ.38, వంకాయ 26, బెండకాయ 40, పచ్చిమిర్చి 38, కాకర 46, కంచకాకర 50, బోడకాకర 140, బీరకాయ 50, సొరకాయ 26, దొండకాయ 46, క్యాబేజీ 24, ఆలుగడ్డ 24, చామగడ్డ 28, క్యారెట్ 40, బీట్ రూట్ 24, కీరదోస 26, బీన్స్ 56, క్యాప్సికం 60, ఉల్లిగడ్డలు 45, కోడిగుడ్లు(12) రూ.80 గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత పేర్కొన్నారు.

కరీంనగర్ నగరపాలక సంస్థ ఓటర్ల జాబితా తప్పుల తడకగా తయారైంది. వార్డుల వారీగా కాకుండా పాత బూత్ల ప్రకారమే జాబితాను రూపొందించారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఒక డివిజన్ ఓటర్లు మరోచోట చేరారు. వెదురుగట్ట గ్రామ ఓటర్లు తీగలగుట్టపల్లి జాబితాలో ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ తప్పిదాలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తోంది. అధికారులు ఎప్పుడు సరిచేస్తారో వేచి చూడాలి.

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ ఏర్పాటు వ్యవహారం పార్టీలో సెగలు పుట్టిస్తోంది. అధ్యక్షుడిగా పున్నా కైలాస్ నియామకం తర్వాత కమిటీ కూర్పుపై కసరత్తు మొదలవ్వగా.. పదవుల కోసం ఆశావాహులు భారీగా క్యూ కడుతున్నారు. ప్రధానంగా రెడ్డి, బీసీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ‘హస్తం’ రాజకీయాలను వేడెక్కిస్తోంది. సామాజిక సమీకరణల మధ్య సమతూకం పాటించడం అధిష్ఠానానికి కత్తిమీద సాములా మారింది.

ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంత్ అన్నా కా సహారా మిస్కీనో కే.లియే’ పథకాల కింద ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి విజయేందర్ రెడ్డి తెలిపారు. అర్హులైన వారు tgobm-m-r.c-f-f.gov.in వెబ్ పోర్టల్ ద్వారా ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

నగరం, శివారులో కొన్ని రోజులుగా మంచు తీవ్రంగా కురుస్తున్నా చలి నుంచి కాస్త ఉపశమనం లభించింది. అయితే రేపటి నుంచి మళ్లీ చలి పంజా విసరనుందని అధికారులు చెబుతున్నారు. JAN 5- 12 వరకు 2వ Coldwave 2.0 ఉంటుందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ సీజన్ డిసెంబర్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలే మళ్లీ నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలపారు. పగటిపూటే 25-26°Cకి పడిపోతాయని అంచానా వేశారు. ఈ వారం రోజులు నగరవాసులు జాగ్రత మరి.

నీటి సరఫరా సమస్యలపై స్పందించిన HMWSSB అధికారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. 24×7 కస్టమర్ కేర్ నంబర్లు 155313, 040-23300114కు కాల్ చేయొచ్చని తెలిపారు. అలాగే నీటి సరఫరా, తాగునీరు, డ్రైనేజీ సమస్యల కోసం 99499 30003కు వాట్సాప్ మెసేజ్ పంపితే సంబంధిత సిబ్బంది త్వరితగతిన స్పందించి సమస్యను పరిష్కరిస్తారన్నారు.

నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గృహజ్యోతి’ పథకం వారికి ఒక వరమని మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పెద్ద విజయ్ కుమార్ ముదిరాజ్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని, ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ.3,593 కోట్ల మేర విద్యుత్ బకాయిలను చెల్లించిందని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట బందోబస్తుతో పాటు రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేసినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే ‘డయల్ 100/112’ లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నంబరు 87126 59360కు సమాచారం అందించాలని ఆమె కోరారు.

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు సమీప కాలనీల్లో సోమవారం సాయంత్రం స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా కిటికీలు, సామాన్లు కదలడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే సమీపంలో భారీ పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇది భూకంపమా లేక బ్లాస్టింగ్ వల్ల జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది.

ఖమ్మం జిల్లాలో ఈ నెల 10 నుంచి 13 వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (TCC) పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ చైతన్య జైని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Sorry, no posts matched your criteria.