Telangana

News June 1, 2024

కొండగట్టు: పెద్ద హనుమాన్ జయంతికి ఘనంగా ఏర్పాట్లు

image

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం స్వామివారి పెద్ద జయంతి నేపథ్యంలో దేవాదాయశాఖ అధికారులు ఆలయ ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులు, మాలాధారులు వేలాదిగా ఆలయానికి తరలిరానుండటంతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. కలెక్టర్ యాస్మిన్‌బాష ఏర్పాట్లను పర్యవేక్షించారు.

News June 1, 2024

NLG: గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు ఏర్పాట్లు

image

జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని NLG జిల్లా స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర ఆదేశించారు. గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ విషయమై నల్లగొండలో శుక్రవారం ఆయన నిర్వహించిన కో- ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని.. 16,899 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

News June 1, 2024

హైదరాబాద్‌‌లో ACB తగ్గేదేలే!

image

HYDలో ACB మెరుపుదాడులు కొనసాగిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే‌ 8 మందికి చెక్ పెట్టింది. లంచం తీసుకొంటున్న ఇరిగేషన్‌ శాఖ AE భన్సీలాల్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్స్‌ కార్తీక్‌, నిఖేష్‌కుమార్‌తో పాటు సర్వేయర్‌ గణేశ్‌ను పట్టుకొంది. కుషాయిగూడ PSలో రూ. 3 లక్షలు డిమాండ్ చేసిన CI వీరాస్వామి, SI షఫీ ఆట కట్టించింది. గొర్రెల పంపిణీ స్కాం విచారణలో భాగంగా మాజీ మంత్రి OSDతో పాటు మరో అధికారిని ACB అరెస్ట్ చేయడం విశేషం.

News May 31, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> పాప కిడ్నాప్ కేసును ఛేదించిన RGIA పోలీసులు
> శంషాబాద్‌‌లో క్యాబ్‌‌ డ్రైవర్ హల్‌చల్
> లాలాపేటలో‌ డ్రగ్స్ అమ్మకం.. అరెస్ట్
> ఉప్పల్‌లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం
> జూపార్కులో ఖడ్గ మృగాల కోసం నైట్ ఎన్‌క్లోజర్
> ఓయూలో అమరవీరుల సంస్మరణ సభ పోస్టర్ ఆవిష్కరణ
> కుషాయిగూడ పీఎస్ లో లంచం తీసుకుంటూ దొరికిన సీఐ, ఎస్సై

News May 31, 2024

గచ్చిబౌలి‌ విప్రో సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం

image

గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. గౌలిదొడ్డి నుంచి గచ్చిబౌలి వైపు వస్తోండగా బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్టూడెంట్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతులు నవీన్ రెడ్డి(22), హరీశ్ చౌదరి(22)గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 31, 2024

గచ్చిబౌలి‌ విప్రో సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం

image

గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. గౌలిదొడ్డి నుంచి గచ్చిబౌలి వైపు వస్తోండగా బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్టూడెంట్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతులు నవీన్ రెడ్డి(22), హరీశ్ చౌదరి(22)గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 31, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కొండగట్టులో వైభవంగా కొనసాగుతున్న పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు. @ జగిత్యాల జిల్లాలో అత్యాచారానికి పాల్పడిన ఇరువురికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. @ వేములవాడలో ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ కోనరావుపేట మండలంలో గుండె పోటుతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి. @ కొండగట్టులో పర్యటించిన జగిత్యాల కలెక్టర్. @ జగిత్యాలలో ఎండవేడికి మంటలు చెలరేగి 20 బైకులు దగ్ధం.

News May 31, 2024

కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న డీకే అరుణ

image

వారణాసిలో కొలువుదీరిన కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శుక్రవారం దర్శించుకున్నారు. ప్రధాని మోదీకి మద్దతుగా వారణాసిలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన డీకే అరుణ ప్రచారాన్ని ముగించుకొని తిరుగు ప్రయాణంలో కాశీ విశ్వనాథని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

News May 31, 2024

పాలమూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..

image

✓ కొత్తకోట: లారీ ఢీకొని డీసీఎం క్లీనర్ మృతి.
✓NRPT:ఎరువులు విత్తనాలు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్.
✓MBNR: రాష్ట్ర చిహ్నాల మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: మాజీ మంత్రి.
✓GHPU యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ గా కల్వకుర్తి వాసి నియామకం.
✓WNP:లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విద్యుత్ శాఖ అధికారులు.
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భానుడి ఉగ్రరూపం.

News May 31, 2024

నస్పూర్: చోరీ కేసులో మనవరాలే సూత్రధారి

image

నస్పూర్ నాగార్జున కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. హైదరాబాద్ లో చదువుకునే యువతి వేసవి సెలవుల్లో భాగంగా తన తాత ఇంటికి వచ్చింది. తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఎవరూ లేని సమయంలో యువకుడితో కలిసి ఇంట్లో బీరువా పగులగొట్టి రూ.4.5 లక్షల నగదు, సుమారు 15 తులాల బంగారం, 30 తులాల వెండి దొంగలించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు.