India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త బోధనలైన కరుణ, సహనం, సమైక్యత, సామరస్యం, విశ్వ మానవ సోదర భావం.. నిత్యం మనందరిలో స్ఫూర్తిని నింపుతూ ఉంటాయని, అందరి మేలు కోసం పని చేసేలా ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్ ఉన్ నబీ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రోజని పేర్కొన్నారు.
70 టన్నుల ఖైరతాబాద్ గణేశ్ రేపు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. కాగా విగ్రహ తయారీ అప్పుడు 30 టన్నుల స్టీలు, గుజరాత్ గాంధీనగర్ నుంచి 35 కిలోల బరువున్న ప్రత్యేక మట్టి 1000 బ్యాగులు, 50 కిలోల బరువున్న 100 బండిళ్ల వరి గడ్డి, 10 కిలోల బరువున్న వరి పొట్టు 60 బస్తాలు, 10 ట్రాలీల సన్న ఇసుక, 2 వేల మీటర్ల గోనె బట్ట, 80 కిలోల సుతిలీ తాడు, 5 వేల మీటర్ల మెష్, 2500 మీటర్ల కోరా బట్ట, టన్ను సుతిలీ పౌడర్ వినియోగించారు.
HYD నగరంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లిబరేషన్ డే కోసం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. రేపు నిర్వహించే వేడుకల్లో CAPF, డిఫెన్స్ పోలీసుల మార్చ్, 5 రకాల డ్రం డాన్సులు, డిజిటల్ ఎగ్జిబిషన్, 800+ఫోక్ అండ్ ట్రెడిషనల్ కళల నృత్య ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వెల్లడించింది.
నల్గొండ పాతబస్తీ హనుమాన్ నగర్ ఒకటో నంబర్ వినాయక లడ్డూ రూ.13.50 లక్షల వేలం పలికింది. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వినాయక లడ్డూను కైవసం చేసుకున్నారు. కాగా గతేడాది పాతబస్తీ ఒకటో నంబర్ వినాయక లడ్డూ వేలం రూ.36 లక్షలు పలికింది.
రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల్లో జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితాను విడుదల చేసింది. నిజామాబాద్లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, కామారెడ్డిలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశడ్డి, ఆదిలాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జెండాను ఎగురవేయనున్నారు.
జగిత్యాల పట్టణంలోని 28 వార్డుకు చెందిన కొత్తకొండ సాయికృష్ణ గౌడ్ (37) గుండెపోటుతో ఆకస్మాత్తుగా మరణించాడు. పదేళ్ల నుంచి గల్ఫ్లో ఉపాధి పొందుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నెల క్రితమే ఇంటికి వచ్చిన సాయి తిరిగి కువైట్ వెళ్లాడు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించినట్లు తన సహచర స్నేహితులు ఫోన్ ద్వారా తెలపడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
మోపాల్ మండలంలోని ముదక్పల్లి PHCలో ఆయూష్ వైద్యురాలికి, సిబ్బందికి DM&HO రాజశ్రీ మెమోలు జారీ చేశారు. ఇటీవల PHCని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేసిన సమయంలో వారు విధులకు గైర్హాజరు అయ్యారు. విధులకు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో వారికి కలెక్టర్ నోటీసులిచ్చారు. కాగా PHC ఇన్ఛార్జ్ డ్రాయింగ్ ఆఫీసర్గా డిప్యూటీ DM&HO అంజనకు బాధ్యతలు అప్పగించారు.
శ్రీశైలం జలాశయంలో ఆదివారం రాత్రి 9 గంటలకు 883.30 అడుగులు, నీటి నిల్వ 206,0906 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 41,287 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 68,194 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు.
గణేశ్ నిమజ్జనాలకు నగరపాలక అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో మొత్తం 21 చెరువుల్లో నిమజ్జనం చేయనున్నారు. 28 క్రేన్ల సాయంతో విగ్రహాలను నిమజ్జనం అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. రక్షణ చర్యల్లో భాగం అన్ని చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షల విధించారు.
గుండెపోటుతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన ముదిగొండ మండలంలో ఈ ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాణాపురం గ్రామానికి చెందిన వట్టికూటి రమేష్ బాబు ఉదయం వాకింగ్ చేస్తూ ఒకసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. రమేష్ మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.