Telangana

News May 7, 2025

నర్సంపేట: ఒకరిపై పోక్సో కేసు నమోదు

image

వరంగల్ జిల్లా నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై పోక్సో కేసు నమోదైంది. నర్సంపేట మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికను ఇటీవల అదే గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ బాలికను కిడ్నాప్ చేసి, లైంగికదాడికి పాల్పడినందుకు ఆ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

News May 7, 2025

NLG: పేకాట శిబిరంపై దాడి.. ముగ్గురి అరెస్ట్

image

త్రిపురారం గ్రామ శివారులోని పంట పొలాల్లో గుట్టుచప్పుడు కాకుండా జూదం ఆడుతున్న వారిపై శుక్రవారం త్రిపురారం పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారయ్యారని ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. గ్రామ శివారులోని పొలాల్లో జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఆకస్మికంగా దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరో ఐదుగురు పారిపోయినట్లు పేర్కొన్నారు.

News May 7, 2025

నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు

image

నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి.. శుక్రవారం మెండోరాలో 45.3℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు వేల్పూర్ 45℃, నిజామాబాద్ 44.9, ముప్కాల్ 44.9, ఆర్మూర్ 44.7, నందిపేట, ఏర్గట్ల 44.5, మాగ్గిడి, ఎడపల్లి, బాల్కొండ 44.4, మక్లూర్, కమ్మర్పల్లి, మోస్రా 44.3, లక్మాపూర్, ఇస్సాపల్లి 44.2, జక్రాన్‌పల్లి 44.1, తొండకూర్ 44, పాల్దా, చిన్నమావంది, గోపన్నపల్లి, నవీపేట్ 44, రెంజల్లో 43.8℃గా నమోదైంది.

News May 7, 2025

నల్గొండ: విషాదం.. రోడ్డు ప్రమాదంలో స్నేహితులు మృతి

image

నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండిలో <<16216733>>తీవ్రవిషాదం<<>> చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బింగి మత్స్యగిరి (20), మర్రి శివకుమార్(21) ఇద్దరు స్నేహితులు బైక్‌పై వెళ్తూ స్తంభానికి డీకొట్టారు. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామంలో స్నేహితుని వివాహం సందర్భంగా వచ్చి మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలాన్ని మునుగోడు ఎస్ఐ రవి సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు.

News May 7, 2025

నిర్మల్: కాలకృత్యాలకు వెళ్లిన వివాహితపై లైంగిక దాడి

image

నిర్మల్ జిల్లా తానూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మోగ్లిలో కాలకృత్యాలకు వెళ్లిన వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు గాయాలతో ఇంటికి చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. భర్తతో కలిసి గ్రామానికి చెందిన సునీల్‌పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 7, 2025

నిర్మల్: కాలకృత్యాలకు వెళ్లిన వివాహితపై లైంగిక దాడి

image

నిర్మల్ జిల్లా తానూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మోగ్లిలో కాలకృత్యాలకు వెళ్లిన వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు గాయాలతో ఇంటికి చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. భర్తతో కలిసి గ్రామానికి చెందిన సునీల్‌పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 7, 2025

నేడు ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డే

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం 108వ స్థాపనా దినోత్సవాన్ని వేడుకలు ఇవాళ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో MLC ప్రొ.కోదండరాం, మాజీ ఎంపీ K.కేశవరావు, సీపీ CV ఆనంద్, గాయకుడు అందెశ్రీ, వీసీ ప్రొ.కుమార్ మోలుగారం పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.

News May 7, 2025

సూర్యాపేట: రోడ్డు ప్రమాదం.. యువతి స్పాట్ డెడ్

image

మునగాల మండలం ఆకుపాముల వద్ద శుక్రవారం రాత్రి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యువతి మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాదు నుంచి విజయవాడకు బైకుపై అన్నా చెల్లెలు వెళ్తున్నారు. ఈ క్రమంలో వారి బైక్ అకుపాముల వద్ద
గేదె అడ్డురావటంతో డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో బైకు వెనకాల కూర్చున్న ఆమె రోడ్డుపై పడిపోయింది. వెనుక నుంచి లారీ ఆమె పై నుంచి వెళ్లడంతో మృతి చెందింది.

News May 7, 2025

MBNR: ఇళ్ల ముందు నిలిపిన బైక్‌లే వారి టార్గెట్..!

image

MBNR, GDWL, NGKL, WNP, NRPT జిల్లాల్లో ఇళ్ల ముందు నిలిపిన పలు బైక్‌లను రాత్రిళ్లు చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గద్వాల ఎస్ఐ కళ్యాణ్ తెలిపిన వివరాలు.. గద్వాల వాసి వంశీ, మరో ఏడుగురు కలిసి బైక్‌లను చోరీ చేసేవారు. గతంలో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 35బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు వంశీని శుక్రవారం ధరూర్‌మెట్‌లో అరెస్ట్ చేసి మరో 5 బైక్‌లను సీజ్ చేశారు.

News May 7, 2025

వరంగల్: రేపే BRS రజతోత్సవ సభ

image

WGL ఎల్కతుర్తిలో నిర్వహించనున్న BRS రజతోత్సవ సభకు మరో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. 10 నుంచి 15 లక్షల మందితో 1,250 ఎకరాల్లో రేపు ఈసభ జరగనుంది. 500మందికి సరిపడే విధంగా బాహుబలి వేదికను నిర్మించారు. 10లక్షల మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిల్లు, రెండున్నరవేల మందికి పైనే వాలంటర్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. వెయ్యి ఎకరాలను 5 జోన్లుగా విభజించి పార్కింట్ ఏర్పాటు చేశారు. సభకు మీరు వెళ్తున్నారా? కామెంట్