India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రబీ 2025-26 సంవత్సరానికి గాను జిల్లాలో 500 ఎకరాలకు పైబడి ఆయకట్టు ఉన్న 9 చెరువుల నుంచి పంటలకు నీరు విడుదలకై చర్చించి నిర్ణయించినట్లు కలెక్టర్ రాహుల్ తెలిపారు. పెద్ద చెరువు కొంటూరు, హైదర్ చెరువు నార్లాపూర్, రాయరావు చెరువు నర్సాపూర్, దేవతల చెరువు వెల్దుర్తి, హల్దీ వాగు ప్రాజెక్టు హకీంపేట్, పెద్ద చెరువు అంబాజీపేట ఉన్నాయి.

దివ్యాoగులను సకలాoగులు & దివ్యాంగులు, దివ్యాంగులను వివాహం చేసుకొనిన ప్రభుత్వం రూ.1,00,000/- ల వివాహ ప్రోత్సాహక బహుమతిని అందిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారని వయోవృద్దుల సంక్షేమ శాఖసంక్షేమ అధికారిని యస్.జరీనా బేగం తెలిపారు. 19/05/2025 తరువాత వివాహం చేసుకున్న దంపతులు www.epass.telangana.gov.in వెబ్ సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని, ఫారంను సమగ్ర శిశు అభివృద్ధి ఆధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు.

సాయుధ పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో పాటు నిజాయితీని కలిగి ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన జిల్లా పోలీసు సాయుధ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించి, వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కిట్లను, కార్యాలయ రికార్డులను పరిశీలించి, వాటిని ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.

న్యూ ఇయర్ సందర్భంగా సీపీ సజ్జనార్ ప్రజలకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలుపుతూనే మద్యం బాబులకు హితవు పలికారు. పరీక్షల్లో 35 మార్కులు వస్తే గట్టెక్కినట్టే.. కానీ డ్రంకన్ డ్రైవ్ మీటర్లో 35 దాటితే బుక్కయినట్టే. పరీక్షల్లో ఫెయిలైతే ఒక ఏడాదే వృథా అవుతుంది కానీ డ్రైవింగ్లో తేడా కొడితే జీవితమే ఆగం అవుతుందంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకలు ఉత్సాహంగా, జాగ్రత్తగా చేసుకోవాలన్నారు.

డిసెంబర్ 29న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పోలీసు ఉద్యోగులకు సరెండర్ లీవ్స్, టీఏ, డీఏలు, స్టేషన్ అలవెన్సులు చెల్లించడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అసెంబ్లీలో ఆయన గొంతెత్తిన 24 గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం సరెండర్ లీవ్స్తో పాటు పెండింగ్ బిల్లులను విడుదల చేసింది. తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన హరీశ్ రావుకు పోలీసు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వంతో పాటు సమాజం కలిస్తేనే అడవుల సంరక్షణ బలపడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. పులిగుండాల ఎకో టూరిజం వద్ద ఏర్పాటు చేసిన సఫారీ వాహనాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యేతో కలిసి వాహనాలను ప్రారంభించారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూనే పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల దరఖాస్తు గడువును 3.3.2026 తేదీ వరకు పొడిగించినట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎస్సీడీ. డి. సునీత ఒక ప్రకటన తెలిపారు. వివిధ కోర్సులలో విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉపకార వేతనాలు పొందేందుకు https://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 17,610 మంది రైతులు నేటి వరకు 52,545 యూరియా బ్యాగ్స్ను ఆన్లైన్లో బుక్ చేసుకోవడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి బి.వెంకటేష్ తెలిపారు. అందులో 46,193 బ్యాగ్స్ రైతులు కొనుగోలు చెయ్యగా.. ఇంక 26,220 యూరియా బస్తాలు యాప్లో కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెంద కుండా యూరియా బుకింగ్ యాప్ ద్వారా కొనుగోలు చేయాలని వెల్లడించారు.

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. 2026కు స్వాగతం పలికేందుకు జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. దీంతో బుధవారం నిజామాబాద్ జిల్లాలోని చికెన్, ఫిష్ మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. డిమాండ్కు అనుగుణంగా చేపల ధరలు సాధారణం కంటే అధికంగా పలికాయి. అయినప్పటికీ పండుగ జోష్లో ప్రజలు కొనుగోలుకు వెనుకాడలేదు. మీ ప్రాంతంలో కొత్త ఏడాది వేడుకల సందడి ఎలా ఉందో కామెంట్ చేయండి.

HYD ఒక మహా నగరం. పాలనలో వేగం కోసం ఇప్పుడు ‘గ్రేటర్’ విడిపోక తప్పేలా లేదు. FEB 9 వరకు ప్రస్తుత GHMC టీమ్ కొనసాగుతుందని ఆఫీసర్లు తేల్చి చెప్పేశారు. ఆ గడువు ముగియగానే నగరాన్ని కనీసం 3 లేదా 4 మున్సిపల్ కార్పొరేషన్లుగా విడగొట్టేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధమైంది. ఇప్పటికే 106 ప్రాంతాల సరిహద్దులను మార్చేసి, మరో 30 ఏరియాలకు కొత్త పేర్లు కూడా ఫిక్స్ చేసేశారు. మన హైదరాబాద్ మ్యాప్ మారుతోంది.. రెడీగా ఉండండి!
Sorry, no posts matched your criteria.