India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన భైంసాలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. దెగాంకు చెందిన ఎర్రన్న(40) మద్యానికి బానిసై భార్య హంసతో గొడవకు దిగాడు. ఆమె మనస్తాపంతో పురుగు మందు తాగింది. కుటుంబీకులు భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. కాగా చికిత్సపొందుతున్న భార్యతో మరోసారి గొడవపడి ఇంటికి వెళ్లి
ఎర్రన్న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
ఆదర్శ పాఠశాలల్లో ఎట్టకేలకు 11ఏళ్ల తర్వాత బదిలీలు చేపట్టడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2013లో ఈ పాఠశాలలు ప్రారంభించగా.. అప్పటి నుంచి బదిలీలు చేపట్టలేదు. తాజాగా విద్యాశాఖ PGT, TGTలను పాత జోన్ల ప్రకారం బదిలీలు చేసింది. దీంతో ఆదర్శ పాఠశాలల్లో మొత్తం 160 ఖాళీలు ఉన్నాయి. సెలవు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల పలువురు ఆందోళనకు గురయ్యారు.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 2వేల మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు మల్టీ జోన్-1 IGP చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వినాయకుల ఊరేగింపులో ఆకతాయిలను, జేబు దొంగలను నియంత్రించడానికి క్రైమ్, స్పెషల్ బ్రాంచ్, షీ టీమ్లను మఫ్టీలో, పోలీసు భద్రత సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
HYD నగరంలో గణపతి నిమజ్జనం వేళ ఈ నెల 17న ఉ.6 నుంచి 18న ఉ.8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని రాచకొండ పోలీసులు తెలిపారు. ఇంట్రాసిటీ, ఇంటర్ సిటీ ప్రైవేటు బస్సులు, భారీ వాహనాలకు ORR నుంచి HYD సిటీ లోపలికి ఎంట్రీ, ఎగ్జిట్ లేదని పోలీసులు వెల్లడించారు. గణపతి నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఆర్టేరియల్ రోడ్లు, ORR, సర్వీస్ రోడ్లలోనే ఉండాలని సూచించారు. వాహనదారులు సహకరించాలని కోరారు.
HYD నగరంలో గణపతి నిమజ్జనం వేళ ఈ నెల 17న ఉ.6 నుంచి 18న ఉ.8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని రాచకొండ పోలీసులు తెలిపారు. ఇంట్రాసిటీ, ఇంటర్ సిటీ ప్రైవేటు బస్సులు, భారీ వాహనాలకు ORR నుంచి HYD సిటీ లోపలికి ఎంట్రీ, ఎగ్జిట్ లేదని పోలీసులు వెల్లడించారు. గణపతి నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఆర్టేరియల్ రోడ్లు, ORR, సర్వీస్ రోడ్లలోనే ఉండాలని సూచించారు. వాహనదారులు సహకరించాలని కోరారు.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో విధులు నిర్వహిస్తున్న ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని పీయూ అధ్యాపకులు ఎంపీ డీకే అరుణకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో పీయూలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమను ఆమె దర్శించుకున్నారు. విద్యార్థి సంఘ నాయకులు వారిచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. 12 యూనివర్సిటీల్లో 1445 మంది అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారని, తమను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.
జానీ మాస్టర్పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నార్సింగి PSకు బదిలీ చేశారు. HYD సహా పలు నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్ చేస్తున్నప్పుడు, నార్సింగిలోని నివాసంలోనూ జానీ మాస్టర్ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ డాన్సర్ (21) ఫిర్యాదు చేసింది. దీంతో రాయదుర్గం పోలీసులు జీరో FIR నమోదు చేసి తదుపరి విచారణకు నార్సింగి పోలీసులకు అప్పగించారు.పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లు తెలిపారు.
జానీ మాస్టర్పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నార్సింగి PSకు బదిలీ చేశారు. HYD సహా పలు నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్ చేస్తున్నప్పుడు, నార్సింగిలోని నివాసంలోనూ జానీ మాస్టర్ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ డాన్సర్ (21) ఫిర్యాదు చేసింది. దీంతో రాయదుర్గం పోలీసులు జీరో FIR నమోదు చేసి తదుపరి విచారణకు నార్సింగి పోలీసులకు అప్పగించారు.పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లు తెలిపారు.
HYDలోని మౌలాలిలో శని, ఆదివారం నిర్వహించిన 34వ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా ఖోఖో పోటీల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ బాల, బాలికల జట్లు మూడోస్థానంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా భోఖో అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు ఒబేదుల్లా కొత్వాల్,జీఏ.విలియం పలువురు అభినందించారు.రానున్న టోర్నీల్లో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ టోర్నీలో కోచ్ లు,పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.
>>CONGRATULATIONS❤
> ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గణేశుని నిమర్జన వేడుకలు
>ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
>ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
>వైరాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
>భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి
>అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
>ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరణ
>సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
Sorry, no posts matched your criteria.