Telangana

News May 28, 2024

మెదక్: అవతరణ వేడుకలకు జెండా ఎగురవేయనున్న కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్బంగా ఈసారి కలెక్టర్ రాహుల్ రాజ్ జాతీయ జెండా ఎగురవేయనున్నారు. వేడుకల్లో భాగంగా ఉదయం 9 గంటలకు కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
ఇదివరకు మంత్రులు లేదా ఇతర ప్రజాప్రతినిధులు జెండా ఎగురవేసేది. కానీ ఈసారి ఎలక్షన్ కోడ్ ఉన్నందున అధికారులు జెండా ఎగురవేయాలని ప్రభుత్వం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

News May 28, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. గద్వాల జిల్లా గట్టులో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేటలో 38.6, నారాయణపేట జిల్లా ఉట్కూర్‌లో 38.1, వనపర్తి జిల్లా దగడలో 37.7, నాగర్ కర్నూల్ జిల్లా జెట్‌ప్రోల్‌లో లో36.8, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 28, 2024

MBNR: బడి బస్సులు నడిపేవారు ఈ నిబంధనలు పాటించాలి!!

image

✓ పాఠశాల, కళాశాల బస్సు నడిపే డ్రైవరు వయసు 60 ఏళ్ల లోపుండాలి.
✓ అయిదేళ్ల హెవీ వాహనం నడిపిన అనుభవం ఉండాలి.
✓ ప్రతి పాఠశాల బస్సుకు డ్రైవరుతో పాటు సహాయకుడిని (అటెండెంటు) నియమించుకోవాలి.
✓ బస్సుల్లోని కిటికీలకు ఇరువైపులా నాలుగు వరుసల పైపులను విద్యార్థులు తల బయటపెట్టి తొంగి చూడకుండా ఉండేలా అమర్చాలి.
✓ బస్సు కండీషన్లో ఉండటమే కాకుండా బ్రేకు వేసిన సమయంలో నాలుగు వైపులా పార్కింగ్ లైట్లు వెలగాలి.

News May 28, 2024

BREAKING.. ఖమ్మం: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

image

ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వైరా మండలం నారపునేనిపల్లిరీ చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని వర్ష(22) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కాగా, అమెరికాలో సాఫ్ట్ ఉద్యోగం చేస్తున్న యువకుడితో వర్షకు 6 నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే అనారోగ్యంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వర్ష మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 28, 2024

WGL: అమ్మమ్మను కాపాడబోయి మనవడు మృతి

image

భూపాలపల్లి జిల్లా <<13326459>>మొగుళ్లపల్లి మండలంలో విషాదం<<>> నెలకొంది. గ్రామస్థుల ప్రకారం.. చిట్యాల మండలం వెంకట్రావుపల్లి(సీ) గ్రామానికి చెందిన రామలక్ష్మి(60) పిడిసిల్లలోని పెద్ద కూతురు ఇంటికి వెళ్లింది. రోజూలానే ఆరేసిన బట్టలను తీయడానికి వెళ్లి దండేన్ని తాకగానే కరెంట్‌ షాక్‌కు గురయింది. గమనించిన మనవడు సాయిచరణ్(15) ఆమెను కాపాడేందుకు వెళ్లగా కరెంట్ షాక్‌కు గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

News May 28, 2024

HYD: Way2News కథనానికి స్పందన!

image

HYD జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప కాలనీ 22వ బ్లాక్, ప్లాట్ నంబర్-4 బాదం చెట్టు పక్కన ఉన్న ఇల్లులో అద్దెకు ఉంటున్న రాధిక(34) అంతుచిక్కని వ్యాధితో నడవలేక నరకయాతన అనుభవిస్తుందని Way2News నిన్న ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందిస్తున్న సామాజిక ప్రజలు వారికి తోచిన సాయం అందజేస్తున్నారు. ఆర్థిక సహాయం చేసిన సుంకరి రాజు మాట్లాడుతూ.. కఠిన పరిస్థితుల్లో ఉన్నారని, సహాయం చేయడానికి అందరూ కదలిరావాలన్నారు.

News May 28, 2024

HYD: Way2News కథనానికి స్పందన!

image

HYD జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప కాలనీ 22వ బ్లాక్, ప్లాట్ నంబర్-4 బాదం చెట్టు పక్కన ఉన్న ఇల్లులో అద్దెకు ఉంటున్న రాధిక(34) అంతుచిక్కని వ్యాధితో నడవలేక నరకయాతన అనుభవిస్తుందని Way2News నిన్న ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందిస్తున్న సామాజిక ప్రజలు వారికి తోచిన సాయం అందజేస్తున్నారు. ఆర్థిక సహాయం చేసిన సుంకరి రాజు మాట్లాడుతూ.. కఠిన పరిస్థితుల్లో ఉన్నారని, సహాయం చేయడానికి అందరూ కదలిరావాలన్నారు.

News May 28, 2024

HYD: పిల్లలను ఎత్తుకెళ్లి.. రూ.లక్షలకు అమ్ముతున్నారు..!

image

HYD ఘట్‌కేసర్ పరిధి మేడిపల్లి పోలీసులు ఈరోజు <<13329773>>పిల్లలను ఎత్తుకెళుతున్న ముఠాను<<>> అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మేడిపల్లి పరిధిలో ఓ చిన్నారిని అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడంతో ఈ ముఠా బాగోతం బయటపడింది. 16మందిని పోలీసులు కాపాడారు. కాగా పీర్జాదిగూడలో రూ.4.5లక్షలకు చిన్నారిని RMP శోభారాణి విక్రయించినట్లు పోలీసులు, CWCఅధికారులు తెలిపారు. ఆమెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. జర జాగ్రత్త. SHARE IT

News May 28, 2024

HYD: పిల్లలను ఎత్తుకెళ్లి.. రూ.లక్షలకు అమ్ముతున్నారు..!

image

HYD ఘట్‌కేసర్ పరిధి మేడిపల్లి పోలీసులు ఈరోజు <<13329773>>పిల్లలను ఎత్తుకెళుతున్న ముఠాను<<>> అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మేడిపల్లి పరిధిలో ఓ చిన్నారిని అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడంతో ఈ ముఠా బాగోతం బయటపడింది. 16మందిని పోలీసులు కాపాడారు. కాగా పీర్జాదిగూడలో రూ.4.5లక్షలకు చిన్నారిని RMP శోభారాణి విక్రయించినట్లు పోలీసులు, CWC అధికారులు తెలిపారు. ఆమెతోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. జర జాగ్రత్త. SHARE IT

News May 28, 2024

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇక నుండి ‘అభా’ సేవలు

image

ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చే వారు ఇక వేచి ఉండాల్సిన పని లేదు. ఓపీ చీటీ కోసం గంటలకొద్ది క్యూలో నిలబడాల్సిన బాధ తప్పినట్లే. ప్రభుత్వాస్పత్రుల్లో సత్వర సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం అభా(ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) యాప్ పేరుతో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం జిల్లాలోని ఖమ్మం జనరల్ ఆస్పత్రితో పాటు సత్తుపల్లి, పెనుబల్లి ఆస్పత్రుల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు.