Telangana

News May 27, 2024

ఖమ్మం: పార్లమెంట్ ఎన్నిక కౌంటింగ్‌పై టెలికాన్ఫరెన్స్

image

లోకసభ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధంగా ఉండాలని భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్, అధికారులు ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ, సన్నద్ధతపై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఖమ్మం జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏర్పాట్లపై కలెక్టర్ గౌతమ్ వారికి వివరించారు.

News May 27, 2024

MBNR: నిరుపేద బాలికల భవితకు భరోసా..

image

నిరుపేద, అనాథ బాలికల కోసం ప్రభుత్వం ప్రతి మండలంలో కస్తూర్బా బాలికల విద్యాలయం (KGBV) ఏర్పాటుచేసింది. ఇంటర్‌కు విద్య అందిస్తున్న KGBVల్లో MPC, BIPC, MEC, MHIW కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్య అందించటం, పదో తరగతిలో మెరుగైన ఫలితాలు వస్తుండటంతో KGBVలకు ఆదరణ పెరుగుతోంది. MBNR, NGKL, WNP, GDL, NRPT జిల్లాల్లో ఉన్న నిరుపేద, అనాథ బాలికల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

News May 27, 2024

NLG: అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్టు.. 67 బైకులు స్వాధీనం

image

విలువైన మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకొని 67 మోటార్ సైకిల్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ చందనా దీప్తి వివరాలను వెల్లడించారు. ఐదుగురు సభ్యులు గల ఈ ముఠా TG, APల్లో బైకుల దొంగతనం చేస్తున్నారని తెలిపారు. దొంగతనం చేసిన బైకులను నంబర్ ప్లేట్లు మార్చి అమ్ముతున్నారని తెలిపారు.

News May 27, 2024

ఖమ్మం జిల్లాలో 65.54 శాతంగా పోలింగ్ నమోదు

image

ఖమ్మంలో పట్టభద్రుల ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 65.54 శాతంగా పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. నాలుగు గంటల సమయంలో కేంద్రానికి వచ్చిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు. గతంతో పోల్చుకుంటే పట్టభద్రులు భారీసంఖ్యలో ఎన్నికలో పాల్గొన్నారు.

News May 27, 2024

భూపాలపల్లి: కరెంట్ షాక్.. అమ్మమ్మ, మనవడు మృతి

image

భూపాలపల్లి జిల్లాలో విషాదం జరిగింది. మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామంలో దుంప సాయిచరణ్(14), అతడి అమ్మమ్మ రామలక్ష్మి (55) కరెంట్ షాకుతో మరణించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 27, 2024

వరంగల్ జిల్లా వ్యాప్తంగా 70.83 శాతం పోలింగ్ నమోదు

image

వరంగల్ – నల్గొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ జిల్లా వ్యాప్తంగా సా.4 గంటల వరకు 70.83% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు అన్నారు. వరంగల్ జిల్లాలో ఈరోజు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం పోలింగ్ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది తమ సామగ్రితో జిల్లా కేంద్రానికి బస్సులలో తరలివెళ్ళనున్నారు.

News May 27, 2024

‘విద్యుత్ సమస్య ఉంటే ఈనంబర్‌కు సంప్రదించండి’

image

ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి విద్యుత్ సమస్య ఉన్న వాటిని విద్యుత్ సిబ్బందికి తెలియజేసేందుకు విద్యుత్ శాఖ ఒక సెల్ నంబర్‌ను అందుబాటు లోకి తెచ్చిందని ఆ శాఖ SE జె.ఆర్ చౌహాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఎలాంటి విద్యుత్ సమస్య ఉన్న జిల్లా వ్యాప్తంగా ఒక స్పెషల్ కంట్రోల్ రూమ్ ను సర్కిల్ ఆఫీస్ లో ఏర్పాటు చేశారు. అందులో 9440811700 అనే నంబర్ కు కాల్ చేస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

News May 27, 2024

నల్గొండ: ఎమ్మెల్సీ ఎన్నికలలో 49.53% పోలింగ్ నమోదు

image

నల్గొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53% పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 606 పోలింగ్ కేంద్రాలలో 4,63,839 ఓట్లు ఉండగా ఇప్పటివరకు 2,29,762 ఓట్లు పోలయ్యాయి. నల్లగొండ, సూర్యపేట జిల్లాలలో పోలింగ్ కేంద్రాల వద్ద గ్రాడ్యుయేట్ ఓటర్లు పెద్దసంఖ్యలో బారులు తీరారు.

News May 27, 2024

BREAKING: MDK: యువకుడి ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కౌడిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన సురేశ్ ఆదివారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఈరోజు ఎవరూ లేని సమయం చూసి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు చూసి అతడిని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మృతిచెందాడని తెలిపారు.

News May 27, 2024

ఉస్మానియా యూనివర్సిటీ ఎంపీఈడీ పరీక్ష తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఈడీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను వచ్చే నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.