India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాతీయ రహదారి విస్తరణలో హవేలీ ఘనపూర్ దాటినా తరువాత నాగపూర్ గేట్ వద్ద ప్రమాదకర మలుపును స్ట్రైట్ గా తీర్చిదిద్దారు. నక్క వాగు సమీపంలో బ్రిడ్జి నిర్మాణం కోసం ఇంజినీర్ ప్లాన్ వేశారు. రోడ్డు వేసిన రెండు, మూడు నేలల్లోనే కొత్త రోడ్డు నీట మునిగి రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రవాహంలో కారు కొట్టుకుపోగా ఓ యువకుడిని 4 గంటల తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు.
భారీ వర్షాల కారణంగా ఉస్మాన్సాగర్ జలాశయం నిండిపోవడంతో నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు మంచిరేవుల వంతెన, నార్సింగి సర్వీస్ రోడ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. వాహనదారులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పటికీ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
వర్షాల వల్ల జిల్లాలో నెలకొని ఉన్న పరిస్థితులను నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి బుధవారం సాయంత్రం కంట్రోల్ రూమ్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్లో ఉన్న కంట్రోల్ రూమ్ను కలెక్టర్ సందర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఏమైనా ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచరం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని కంట్రోల్ రూమ్ సిబ్బందికి సూచించారు. జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు.
వినాయక చవితి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లు, వినాయక ప్రతిమలు తయారు చేసే ప్రదేశాలు, సమస్యాత్మక ప్రాంతాలను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్, ట్రాఫిక్ సీఐ ప్రణయ్ కుమార్ పాల్గొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. కాచిగూడ- కరీంనగర్ రైలు బిక్నూరు- కరీంనగర్ మధ్య, నాందేడ్-మేడ్చల్ వెళ్లే రైలు కామారెడ్డి- మేడ్చల్ మధ్య, విశాఖ- నాందేడ్ రైలు ఆకంపేట- నాందేడ్ మధ్యలో క్యాన్సిల్ చేయగా, కాచిగూడ నుంచి మన్మాడ్ వెళ్లే రైళ్లు పలు ప్రాంతాలకు డైవర్షన్ చేసినట్లు షెడ్యూల్ విడుదల చేశారు. కాచిగూడ- మెదక్, నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ రద్దు చేశారు.
నల్గొండ ఎస్ఎల్బీసీ డాన్ బోస్కో అకాడమీలో ఈనెల 29న ప్రఖ్యాత కంపెనీల ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ బాలశౌరిరెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని టెన్త్ నుంచి పీజీ, టెక్నికల్ కోర్సులు ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత మేళాను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జెన్ ప్యాక్ట్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, హెటిరోడ్రగ్స్, మెడిప్లస్, డీమార్ట్, వరుణ్ మోటార్స్ తదితర కంపెనీలు పాల్గొంటాయని వివరించారు.
భారీ వర్షాలు కురుస్తున్నందున శ్రీరాంసాగర్ పరీవాహక ప్రాంతం, నదులు, వాగులు, జలాశయాల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. భారీ వర్షాలతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తి, ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, అవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దన్నారు. చేపలవేట, ఈత సరదా కోసం చెరువులు, కాలువలు, కుంటలు, ఇతర జలాశయాల వద్దకు వెళ్లవద్దన్నారు.
సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు మరిన్ని రైళ్లను రద్దు చేస్తూ అలెర్ట్ ప్రకటించారు. కాచిగూడ నుంచి మెదక్ వెళ్లే రైలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే గౌతమి ఎక్స్ప్రెస్ 20:30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా 23:30 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు. కాచిగూడ నుంచి వెళ్లే భగత్కి వెళ్లే రైలు 28న ఉదయం 6గంటలకు వెళ్తుందని పేర్కొన్నారు.
HYDలో వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సుమారు 15వేలకు పైగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు తమకు అందలేదని పలువురు లబ్ధిదారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందన్నారు.
నల్గొండ ప్రజలకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి ఆమె జిల్లా కేంద్రంలోని రామాలయంలోని మొదటి గణేశ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని, తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.