India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన “అరైవ్ అలైవ్ 2026” అవగాహన సదస్సును ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రారంభించారు. గతేడాది జిల్లాలో 950 ప్రమాదాలు జరగ్గా, 360 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వాహనదారులు, యువత పాల్గొన్నారు.

నార్కట్పల్లి మండలం చెర్వుగట్టులో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 52 రోజులకు గాను గట్టుపైన రూ.28,98,762, గట్టు కింద అమ్మవారి ఆలయంలో రూ.3,85,695, (మొత్తం రూ.32 లక్షల 84 వేల 457) ఆదాయం వచ్చింది. హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఈవో ఎస్ మోహన్ బాబు, దేవాదాయశాఖ పరిశీలకులు సుమతి పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి జూడో ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సపావత్ రమ్యకు జిల్లా యంత్రాంగం అండగా నిలిచింది. కలెక్టర్ చంద్రశేఖర్ బడుగు ఆదేశాల మేరకు డీవైఎస్ఓ అక్బర్ అలీ రూ.15,000 చెక్కును అందజేశారు. జనవరి 23 నుంచి కోల్కతాలో జరిగే జాతీయ పోటీల్లో రమ్య పాల్గొననుంది. ఈ సందర్భంగా అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

HYD దాహాన్ని తీర్చడానికి ప్రభుత్వం రూ.7,360 కోట్లతో ‘అండర్ గ్రౌండ్ రివర్’ను సృష్టిస్తోంది. ఇప్పటిదాకా మనం విన్నది కేవలం పైప్లైన్ల గురించి మాత్రమే. కానీ ఈ ప్రాజెక్టు అసలు ఉద్దేశం సిటీకి 50 ఏళ్ల వాటర్ గ్యారెంటీ ఇవ్వడం. 50 TMC మల్లన్నసాగర్ను ఒక భారీ ‘పవర్ బ్యాంక్’లా వాడుకుంటూ అందులోని 20 TMCలను సిటీకి మళ్లించబోతున్నారు. వాతావరణం ఎలా ఉన్నా నగరం చుట్టూ ఉన్న రిజర్వాయర్లు ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటాయి.

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై MBNR జిల్లా అదనపు ఎస్పీకి మాజీ గ్రంథాలయ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ యాదయ్య మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈనెల 18న ఖమ్మంలో జరిగిన మహాసభలో రాష్ట్ర సీఎం బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, సీఎం హోదాలో ఉండి ఈ విధంగా చేసిన ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మెదక్ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటులేకుండా చూడాలన్నారు.

ఎప్పుడూ బిజీగా ఉండే మెట్రోలో మంగళవారం ఓ వింత దృశ్యం కనిపించింది. ఎల్బీనగర్ వెళ్లే రైలులో ఎవరో ఒక ‘జెన్-జీ’ కుర్రాడో, అమ్మాయో అతికించిన గ్రీన్ స్టిక్కీ నోట్స్ ప్రయాణికుల మనసు గెలుచుకుంటున్నాయి. “ప్రతిఫలం ఆశించకుండా సాయం చెయ్.. నీ మనసు చెప్పిందే విను” అంటూ డయానా చెప్పిన మంచి మాటలను ఆ నోట్స్పై రాశారు. యాంత్రికమైన ఈ కాలంలో నలుగురికి మంచిని పంచాలనే ఈ చిన్న ప్రయత్నం ప్రయాణికుల్లో నవ్వులు పూయించింది.

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష పడినట్లు ఐదో టౌన్ ఎస్ఐ గంగాధర్ మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి వర్ని చౌరస్తా వద్ద తనిఖీల్లో బీహార్కు చెందిన హీరాలాల్ యాదవ్ పట్టుబడగా, కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. ఆర్మూర్కు చెందిన నందుకు రూ. 10 వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.

మహబూబ్నగర్ పట్టణంలోని పారిశ్రామిక వాడలో గల ఓ బెడ్ వర్క్స్లో మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పక్కనే గ్యాస్ సిలిండర్ల గోదాం ఉండటంతో ప్రమాద ముప్పు పొంచి ఉందని, ఆ బెడ్ వర్క్స్ను అక్కడి నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాల్లో నేల కలుషితమవుతున్న వేళ ‘మైకోరైజా’ అనే మేలు చేసే శిలీంధ్రాలు రైతులకు వరంగా మారనున్నాయి. ఈ ప్రత్యేక శిలీంధ్రాలు భూమిలోని పోషకాలను వేర్లకు అందించి, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిస్తాయి. హైదరాబాద్ కేంద్రంగా వీటి ఉత్పత్తి పెరగడం వల్ల తక్కువ ఖర్చుతోనే ఆరోగ్యకరమైన పంటలు పండించే అవకాశం లభిస్తుంది. దీంతో పర్యావరణాన్ని కాపాడుకుంటూ విషం లేని ఆహారాన్ని అందించనుంది.
Sorry, no posts matched your criteria.