Telangana

News August 27, 2025

HYD: భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు

image

భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నేడు పలు రైళ్లు రద్దు చేసింది. నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను రద్ద అయింది. మెదక్ – కాచిగూడ రైలు నేడు పాక్షికంగా రద్దు చేశారు. హైదరాబాద్ రైల్వే డివిజన్‌లోని భిక్నూర్ – తల్మడ్ల సెక్షన్, అకన్నపేట్ – మెదక్ సెక్షన్‌లో ట్రాక్‌లపై వరద నీరు పొంగిపొర్లుతుంది.

News August 27, 2025

గణపతి పల్లకి మోసిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయిని

image

వేయి స్తంభాల గుడిలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య గణపతి మహారాజ్‌కి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణపతికి నిర్వహించిన పల్లకి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేయి స్తంభాల దేవాలయం చుట్టూ గణపతి పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని పల్లకిని భుజాలపై మోశారు.

News August 27, 2025

ఆదిలాబాద్: భారీ వర్షాలు.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

image

రానున్న 3, 4 రోజుల పాటు ఆదిలాబాద్‌లో మోస్తరు నుంచి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితిలో 18004251939 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. అధికారులు పూర్తి అప్రమత్తతో ఉన్నారని పేర్కొన్నారు.

News August 27, 2025

ఐఐటీ HYDతో మిలిటరీ అధికారుల ఒప్పందం

image

ఐఐటీ హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని సిమ్యులేటర్ డెవలప్‌మెంట్ డివిజన్ మధ్య ఒప్పందం కుదిరింది. దీని ద్వారా సికింద్రాబాద్‌లో ఏఆర్‌/వీఆర్‌ టెక్నాలజీ నిపుణుల కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ భాగస్వామ్యం లక్ష్యం.. ఆధునిక పరిశోధనలను సైనిక అవసరాలకు అనుగుణంగా మార్చి, సైనికులకు అధునాతన శిక్షణను అందించే సాంకేతికతను అభివృద్ధి చేయడం. భవిష్యత్ మిలిటరీ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు

News August 27, 2025

వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన

image

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలకు అలుగులు పొంగుతున్నాయి. ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైదరాబాద్‌లోని నీరు నిలిచే ప్రాంతాల వద్ద జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News August 27, 2025

శంకర్‌పల్లి మీదుగా తిరుపతి రైలు రద్దు

image

నిజామాబాద్ నుంచి శంకర్‌పల్లి మీదుగా తిరుపతికి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం రద్దయింది. భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. వికారాబాద్, తాండూర్, మంత్రాలయం, గుంతకల్లు, కడపకు వెళ్లే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించగలరని రైల్వే అధికారులు కోరారు.

News August 27, 2025

కృష్ణాన‌గ‌ర్‌లో హైడ్రా నాలా ఆప‌రేష‌న్‌

image

నాలాలో ఒకటిరెండు అడుగుల పూడిక సహజమే. కానీ.. HYD కృష్ణానగర్‌లో 8 అడుగుల లోతైన నాలాలో 6 అడుగుల మేర సిల్ట్ పేరుకుపోవడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. 2 మీటర్ల పూడిక తీయగానే 7,8 ట్రాక్టర్లు నిండుతున్నాయి. 8 అడుగుల లోతు, ఆర‌డుగుల మేర పూడిక‌తీత పనులు నిర్వహిస్తున్నట్లు హైడ్రాధికారులు తెలిపారు. కమిషనర్ రంగనాథ్ సైతం పరిశీలించినట్లు వివరించారు.

News August 27, 2025

HYD: 20 నిమిసాల్లో భార్యను ముక్కలుగా చేశాడు!

image

మేడిపల్లి స్వాతి దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మహేందర్ రెడ్డి తన భార్య స్వాతి మృతదేహాన్ని 20 నిమిషాల్లోనే ముక్కలు చేసి మూసీ నదిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. గత 4 రోజులుగా DRF బృందాలు ఆమె శరీర భాగాల కోసం గాలిస్తున్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

News August 27, 2025

HYD: వర్షం పడిన ప్రతీసారి ఈ మార్గాల్లో ట్రాఫిక్

image

వర్షం పడితే HYDలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. గచ్చిబౌలి- మియాపూర్, లింగంపల్లి- హైటెక్ సిటీ, జేఎన్టీయూ- హఫీజ్‌పేట్- KPHB, బొటానికల్ గార్డెన్- కొత్తగూడ, టోలిచౌకి- రాయదుర్గం, షేక్‌పేట్ ఫ్లూఓవర్, కోఠి- ఎల్బీనగర్ వంటి ప్రధాన మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ సమస్యలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఐటీ కారిడార్‌ ప్రాంతంలో వాహనాల రద్దీ పెరగడం కారణంగా సమస్యలు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

News August 27, 2025

సికింద్రాబాద్‌లో 5 ఏళ్లలో 149 స్నాచింగ్ కేసులు!

image

సికింద్రాబాద్ పరిధిలో గత 5 ఏళ్ల నేర గణాంకాలను పోలీసులు విడుదల చేశారు. ఈ కాలంలో 149 స్నాచింగ్ కేసులు నమోదైనట్లు రిపోర్టులో వెల్లడించారు. దొంగతనం, దోపిడి వంటి కేసుల్లో 694 మంది నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. నేర నియంత్రణకు ప్రత్యేక దళాలతో చర్యలు కొనసాగిస్తున్నామని, భద్రత కోసం సీసీ కెమెరాలు, పహారా బలగాలు పెంచినట్లు పోలీసులు స్పష్టం చేశారు.