Telangana

News May 25, 2024

ఆదిలాబాద్: అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

image

పలు జిల్లాల్లో దొంగతనాలు చేసిన నిందితుడిని సిద్దిపేట 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన రామారావు సిద్దిపేట 2 టౌన్, 3 టౌన్, చేర్యాల PSల పరిధితో పాటు ఆయా స్టేషన్లలోని మొత్తం 24 దొంగతనాలు చేసినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి 47.70 తులాల బంగారం, 65 తులాల వెండి, రూ.34,500, స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

News May 25, 2024

KNR: రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి సూసైడ్

image

చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన కదురు లక్ష్మీరాజం అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి శనివారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 25, 2024

నిజామాబాద్: SRH గెలవాలని ప్రత్యేక పూజలు

image

రేపు జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో హైదరాబాద్ జట్టు గెలవాలని ఇందల్వాయి గ్రామంలో ప్రత్యేక పూజలు చేశారు. కోల్‌కతాతో జరిగే ఫైనల్ మ్యాచులో హైదరాబాద్ జట్టు సభ్యులు రాణించాలని కోరారు. ఈ మేరకు రామాలయంలో దీపక్ పంతులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. గోపి, అశోక్, సతీశ్ కుమార్, మను సందీప్ తదితరులు ఉన్నారు.

News May 25, 2024

MBNR: భూముల విలువ పెంపునకు కసరత్తు !

image

భూముల మార్కెట్ విలువలు సవరించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి ద్వారా ఖజానాకు ఏటా రూ.250 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. గత ప్రభుత్వం 2సార్లు భూముల విలువలు పెంచింది. ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో గజం కనిష్టంగా రూ.1000లకు గరిష్టంగా రూ. 5వేలు, పట్టణ ప్రాంతాల్లో కనిష్టంగా రూ.10వేల, గరిష్టంగా రూ.20 వేలకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News May 25, 2024

ఆదిలాబాద్: పదిరోజుల్లో ఫలితాలు.. MPఎవరో?

image

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఈనెల 13న ముగిసింది. పోలింగ్ జరిగి నేటికి 12 రోజులు కావస్తుండగా ఫలితాలు మరో 10 రోజుల్లో జూన్ 4న వెలువడనున్నాయి. ఇక ఫలితాల్లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది. అటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం మేమే గెలుస్తున్నామన్న ధీమాలో ఎవరికి వారు ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి ఎవరు పార్లమెంట్‌లో అడుగు పెడతారో తెలియాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.
-మరి గెలిచేదెవరో మీ కామెంట్

News May 25, 2024

ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ హత్య..?

image

ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. చింతలమానేపల్లి మండలం కోర్చిని గ్రామానికి చెందిన సదయ్యను కుమార్ అనే వ్యక్తి రాడ్‌తో తలపై కొట్టి హత్య చేసినట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

News May 25, 2024

వరంగల్: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు 3 రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుని ప్రచారం చేశాయి. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రేమేందర్ రెడ్డి, రాకేశ్ రెడ్డిలు వరంగల్ జిల్లాకు చెందిన వారే కాగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న నల్గొండ జిల్లాకు చెందిన వారు. 27వ తేదీన జరిగే ఎన్నికల్లో వరంగల్ గ్రాడ్యుయేట్లు ఎవరికి పట్టం కడతారో చూడాల్సి ఉంది.

News May 25, 2024

మెదక్: కుంటలో యువకుడి మృతదేహం

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన దోమకొండ సాయి(20) ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. కాళ్లకల్లో నివాసముండే సాయి మూడు రోజులుగా కనిపించకుండా పోయారు. ఈరోజు గ్రామ శివారులోని మాదన్న కుంటలో మృతదేహం దొరికింది. సాయి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మనోహరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 25, 2024

పిట్లం: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పిట్లం మండలం చిల్లర్గిలో జరిగింది. SI నీరేశ్ వివరాలిలా.. చిల్లర్గి వాసి చాకలి సాయిలు (52) గురువారం సాయంత్రం తన పొలంలో వరి కొయ్య కాళ్ళు కాల్చుతుండగా.. ఒకే సారి మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో నీళ్లతో మంటలు ఆర్పడానికి బోరు స్టార్టర్ బాక్స్ వద్దకు వెళ్లి మోటారు ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 25, 2024

మెదక్: నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు

image

ఉమ్మడి జిల్లాలో ఎవరైన నకిలీ విత్తనాలను, ఎరువులు, నాసిరకం పురుగు మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పి డా.బాలస్వామి ఒక ప్రకటనలో హెచ్చరించారు. దేశానికి రైతు వెన్నెముక లాంటివాడని గుర్తుచేశారు. ఆరుగాలం కష్టించి దేశం కడుపు నింపే రైతులను మోసం చేస్తూ కొంతమంది నకిలీ విత్తనాలు సరఫరా చేసి వారిని అప్పుల్లోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు.