India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
SC గురుకుల సొసైటీ పరిధిలోని నాన్ CEO విద్యాలయాల్లో జూనియర్ ఇంటర్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి శుక్రవారం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 24 నుంచి 31 వరకు గురుకుల సొసైటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. MPC, బైపీసీ, MEC, సీఈసీ, HEC, వృత్తివిద్య కోర్సుల్లో సీట్లు ఉన్నాయని చెప్పారు.
అనుమానాదస్పదంగా యువకుడు మృతి చెందిన ఘటన MBNR పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ స్వామి వివరాల ప్రకారం.. పాన్ సాబ్ గుట్ట ప్రాంతానికి చెందిన సందీప్ రెడ్డి (27) ఈనెల 23న సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన మిత్రుడు గణేశ్ ఇంటికి వెళ్ళాడు. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. గొంతుకు ఉరితీసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని, క్లూజ్ టీంతో వివరాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సీఐ తెలిపారు.
తిమ్మాపూర్ మండలం అలుగునూర్లో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. కరీంనగర్ పట్టణం నంగునూరుకు చెందిన నరసయ్య శుక్రవారం రాత్రి కారులో వెళ్తుండగా మార్గమధ్యంలో అలుగునూర్ వద్ద కారు అదుపు తప్పి రహదారి పక్కన గల గోడకు ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్కు గాయాలవ్వగా నరసయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD బాచుపల్లిలో భార్యను భర్త పాశవికంగా<<13309581>> హత్య చేసిన విషయం<<>> తెలిసిందే. అయితే భార్యను హత్య చేసిన భరద్వాజ్ చందానగర్లోని స్నేహితుడు ఇంటికి వెళ్లాడు. తాను భార్యను హత్య చేశానని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి భార్యను పొడిచిన కత్తి తోనే పొడుచుకున్నాడు. దీంతో భయాందోళనకు గురైన శ్రీనివాస్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చికిత్స చేయించి రిమాండ్కు తరలించారు.
HYD బాచుపల్లిలో భార్యను భర్త పాశవికంగా<<13309581>> హత్య చేసిన విషయం<<>> తెలిసిందే. అయితే భార్యను హత్య చేసిన భరద్వాజ్ చందానగర్లోని స్నేహితుడు ఇంటికి వెళ్లాడు. తాను భార్యను హత్య చేశానని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి భార్యను పొడిచిన కత్తి తోనే పొడుచుకున్నాడు. దీంతో భయాందోళనకు గురైన శ్రీనివాస్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చికిత్స చేయించి రిమాండ్కు తరలించారు.
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కలంచెరువుకు చెందిన రితీశ్(6) వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరైన ఖమ్మం రూరల్ ముత్తగూడెం వచ్చాడు. వీరి ఇంట్లో త్వరలోనే ఫంక్షన్ ఉండగా మేనమామలు కరుణాకర్, వెంకన్నలతో కలిసి పాలేరు సంత నుంచి గొర్రెలు బైక్పై తెస్తుండగా.. తిరుమలాయపాలెం KGBV వద్ద ఆగి ఉన్న కారును వీరి బైక్ ఢీకొట్టింది. పెట్రోల్ ట్యాంక్పై కూర్చున్న రితీశ్ తలకు తీవ్రగాయమైంది. ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు.
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కలంచెరువుకు చెందిన రితీష్(6) వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరైన ఖమ్మం రూరల్ ముత్తగూడెం వచ్చాడు. వీరి ఇంట్లో త్వరలోనే ఫంక్షన్ ఉండగా మేనమామలు కరుణాకర్, వెంకన్నలతో కలిసి పాలేరు సంత నుంచి గొర్రెలు బైక్పై తెస్తుండగా.. తిరుమలాయపాలెం KGBV వద్ద ఆగి ఉన్న కారును వీరి బైక్ ఢీకొట్టింది. పెట్రోల్ ట్యాంక్పై కూర్చున్న రితీష్ తలకు తీవ్రగాయమైంది. ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు.
కామారెడ్డి జిల్లాలో ఎలుగు బంటి కలకలం రేపింది. లింగంపేటలోని మేంగారం-బోనాల్ మధ్య ఉన్న రోడ్డు పై ఎలుగుబంటి సంచరించడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నీరు తాగేందుకు వచ్చిందని ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
‘అమ్మ నేను చనిపోతున్నా.. నాకోసం వెతకొద్దు’ అని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన కొద్ది నిమిషాల్లోనే ఖమ్మంకు చెందిన ఓ మైనర్ హంటర్ రోడ్డు సమీపంలో 2 మోరీల జంక్షన్ వద్ద రైలు కింద పడి మృతి చెందింది. ఓ బాలికకు వరంగల్ కాశిబుగ్గకు చెందిన చెన్నకేశవ మధ్య ఫోన్ కాల్ ద్వారా బంధం ఏర్పడింది. ఇద్దరూ మైనర్లు కావడంతో ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమనే చర్చ జరుగుతుంది.
తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్లో శుక్రవారం వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చల్ల నర్సయ్య(53) ముగ్గురు కుమార్తెల వివాహాల కోసం రూ.8 లక్షలు అప్పు చేశాడు. అప్పు భారం పెరగడంతో ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో శుక్రవారం ఇంటి ఎదుట ఉన్న రేకుల షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.