India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
SRSPకి వరద నీరు పోటెత్తడంతో మొత్తం 25 వరద గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు 8 గేట్లు ఓపెన్ చేసిన అధికారులు మధ్యాహ్నం 12 గంటలకు మరో 9 గేట్లు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. 25 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ ఫ్లోగా 50 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా వివిధ మార్గాల ద్వారా 1,30,392 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
గణేశ్ నవరాత్రుల నేపథ్యంలో మహిళల భద్రత కోసం షీ టీమ్స్ రంగంలోకి దిగాయి. అన్ని ప్రధాన గణేశ్ మండపాల వద్ద షీ టీమ్స్ నిఘా పెట్టాయి. మహిళా భక్తులు, యువతుల పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ DCPలు హెచ్చరించారు. ఈ మేరకు మహిళలు, యువతులు వేధింపులకు గురైతే సమాచారం ఇవ్వాలంటే HYD 9490616555, రాచకొండ 8712662111, సైబరాబాద్ 9490617444,100/112 నం.లకు కాల్ చేయాలని తెలిపాయి.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. నేడు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి అత్యధికంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 14.8 మిల్లీమీటర్లు, కూకట్నల్లి 10, కుత్బుల్లాపూర్ 8, అల్వాల్ 7.8, షేక్పేట 6, మారేడుపల్లిలో 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. గణపతి పండుగ వేళ వర్షం కురుస్తుండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇకపై కరెంట్ కనెక్షన్ తీసుకోవడం భారంగా మారేలా కనిపిస్తోంది. నగరంలో అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తులు ఉండటం సహజం. అయితే.. కనీసం లోడ్ 1BHK ఫ్లాట్కు 2 కిలోవాట్లు, 2BHKకు 5 కిలోవాట్లు, 3BHKకు 10 కిలోవాట్లు, 4BHK అంతకంటే ఎక్కువ ఉన్న వాటికి 15 కిలోవాట్ల లోడ్ తీసుకోవాలని TGSPDCL జారీ చేసిన ఆదేశాలు కీలకంగా మారనున్నాయి. గతం కంటే ఇవి అధికమని వినియోగదారులంటున్నారు. దీనిపై మీకామెంట్.
మహబూబ్నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 91.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. కోయిలకొండ మండలం పారుపల్లి 76.3, MBNR అర్బన్ 62.0, భూత్పూర్ 55.3, మహమ్మదాబాద్ 49.0, మిడ్జిల్ 48.8, జడ్చర్ల 45.0, రాజాపూర్ 43.8, నవాబుపేట 34.5, బాలానగర్ 31.3, మూసాపేట 28.0, కౌకుంట్ల 25.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
జిల్లా వ్యాప్తంగా పూలు, పండ్లు, కొబ్బరికాయలు, ఇతర పూజ సామగ్రి ధరలు అమాంతం పెరిగిపోయాయి. నేడు వినాయక చవితి పర్వదినం సందర్భంగా చామంతి పూలు కేజీ రూ.450, బంతిపూలు కిలో రూ.150 నుంచి రూ.200, మూర పూలు రూ.50కి విక్రయిస్తున్నారు. అలాగే డజను అరటి పండ్లు రూ.70-100 ధర పలుకుతున్నాయి. కొబ్బరికాయలు సైతం ఒకటి రూ.35-40 ధర ఉంది.
SRSPకి వరద నీరు పోటెత్తుడడంతో మొత్తం 17 వరద గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు 8 గేట్లు ఎత్తగా ఇన్ ఫ్లో పెరగడంతో మధ్యాహ్నం 12 గంటలకు మరో 9 గేట్లు ఓపెన్ చేసి మొత్తం 17 గేట్ల ద్వారా 51,578 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ ఫ్లోగా 50 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా వివిధ మార్గాల ద్వారా 82,105 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. బుధవారం ఉదయం 11 గంటలకు 1,090.90 అడుగులకు(80.053TMC) నీటి మట్టం చేరినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి 45 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 55,527 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు వివరించారు.
1954లో ఒక్క అడుగుతో సింగరి శంకరయ్య కృషితో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశ్ చరిత్ర నేటికీ పదిలంగా కొనసాగుతోంది. 2014లో 60 ఏళ్లు పూర్తైనందున 60 ఫీట్లు, 2024లో 70 ఏళ్లు పూర్తైనందున 70 ఫీట్ల గణపతిని ప్రతిష్ఠించారు. ఈఏడాది ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో యుద్ధాలు ముగిసి శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూ.. 69 ఫీట్ల విశ్వశాంతి మహాశక్తి గణపతిని ప్రతిష్ఠించారు.
HYDలో ఓ దిక్కు భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు యువకులను వినాయక చవితి ఉత్సాహం అలరిస్తోంది. ఈ వర్షాన్ని లెక్కచేయకుండా గణపయ్యలను తమ ఇళ్లకు తీసుకెళ్తున్నారు. వార్షానికి తడవొద్దని వెంకటాద్రి టౌన్షిప్లో ఓ బాలుడు తన బైక్పై విగ్రహాన్ని మోసుకెళ్తూ, పూజ దుకాణం వద్ద ఆగి గొడుగు పట్టిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. భక్తి, ఆరాధన, కర్తవ్య సమ్మేళనంగా మారిన ఈ క్షణాన్ని Way2News కెమెరాలో బంధించింది.
Sorry, no posts matched your criteria.