Telangana

News April 7, 2025

ఖమ్మం జిల్లా ప్రజలకు CM గుడ్ న్యూస్

image

శ్రీరామనవమి సందర్భంగా ఖమ్మం జిల్లా రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.13,057 కోట్లను సవరించి రూ.19,324 కోట్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అలాగే కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News April 7, 2025

ADB: మహిళల బంగారు పుస్తెల తాళ్లు చోరీ: CI

image

పండుగ సందర్భంగా గుడికి వెళ్లిన మహిళల మెడల్లో నుంచి పుస్తెల తాళ్లు చోరీ అయిన ఘటన ADBలో చోటుచేసుకుంది. వన్ టౌన్ సీఐ సునీల్ వివరాల మేరకు.. తిర్పల్లికు చెందిన ఠాకూర్ పద్మజ, మావలకు చెందిన సుమ బ్రాహ్మణ సమాజ్ రామమందిర్‌లో పూజకు వెళ్లారు. క్యూలైన్లో నిలబడి భోజనాలు చేశారు. అనంతరం చూసుకుంటే పద్మజ, సుమ మెడలోని బంగారు పుస్తెల తాళ్లు కనబడలేదు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News April 7, 2025

ADB: వారంలో 8 సైబర్ మోసాలు: SP

image

ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ ఫ్రాడ్, మొబైల్ హ్యాకింగ్ లాంటి సైబర్ నేరాలకు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గత వారంలో జిల్లాలో 8 సైబర్ ఫిర్యాదులు స్వీకరించామన్నారు. ఎటువంటి గుర్తు తెలియని స్కాం నంబర్లు, లింక్లు ఓపెన్ చేయొద్దన్నారు. సైబర్ క్రైమ్‌కు గురైతే 1930కు కాల్ చేయాలని పేర్కొన్నారు.

News April 7, 2025

తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నర్సంపేట వాసుల ప్రతిభ

image

నర్సంపేట పట్టణానికి చెందిన కరాటే క్రీడాకారులు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రతిభ కనబర్చారు. వరంగల్‌లో ఆదివారం నిర్వహించిన పోటీల్లో నర్సంపేటకు చెందిన కరాటే క్రీడాకారులు రెండు గంటల పాటు పార్టిసిపేట్ చేశారు. ప్రత్యేక సర్టిఫికెట్‌ను అందుకున్నారు. కోచ్‌లు జానీ మాస్టర్, శ్రీనాథ్, ఆరుగురు విద్యార్థులను నిర్వాహకులు అభినందించారు.

News April 7, 2025

బెట్టింగ్.. నలుగురి అరెస్ట్ : SP

image

ADBలో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న రియాజ్, పిట్టలవాడకు గంథాడే సోహన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా వారిని పట్టుకొని కేసు నమోదు చేశారు. వన్ టౌన్ పరిధిలో సుల్తాన్, ఒక మైనర్ సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ బెట్టింగ్ పాల్పడగా వారిపై కేసు నమోదు చేశారు. నగదు స్వాధీనం చేసుకున్నారు.

News April 7, 2025

ADB: ‘గంజాయి విక్రేత ARREST.. నలుగురికి నోటీసులు’

image

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించినట్లు ADB వన్ టౌన్ CI సునిల్ కుమార్ తెలిపారు. ఖానాపూర్ చెరువు కట్ట వద్ద షేక్ కలీం గంజాయి విక్రయించగా అతని వద్ద కొనుగోలు చేసి తాగుతున్న అనంద్, అజహర్, ఫారూఖ్, రోషన్‌లను SI అశోక్ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రేత కలీంను రిమాండ్ తరలించి మిగిలిన నలుగురికి నోటీసులు ఇచ్చారు.

News April 7, 2025

HYD: గ్రేటర్లో కల్తీరాయుళ్లకు ఇక తప్పవు కష్టాలు

image

మహానగరంలోని హోటళ్లలో ఎక్కడ చూసినా కల్తీ ఆహారమే దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సిటీలో అనేక చోట్ల అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. దీంతో నగరంలో ఆరు ఆహార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని GHMC నిర్ణయించింది. వీటి ఏర్పాటు కోసం రూ.30 కోట్ల నిధులు (ఒక్కో కేంద్రానికి రూ.6 కోట్లు) కావాలని ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు నివేదికలు పంపారు. నిధులు విడుదలైతే ఫుడ్ టెస్టింగ్ సిటీలో జోరందుకుంటుంది.

News April 7, 2025

HYD: MMTS రైళ్లలో మహిళల రక్షణ కోసం వాట్సప్ గ్రూప్

image

ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళల రక్షణకు ఆర్పీఎఫ్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఏ రైలులో ఎవరు డ్యూటీలో ఉన్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా మహిళా కోచ్‌లలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారనే విషయంపై దృష్టి సారిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాట్సప్లో ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

News April 7, 2025

మెదక్: సన్నబియ్యం పంపిణీని వేగవంతం చేయాలి: కలెక్టర్

image

రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం పాపన్నపేట పాతూరులోని పౌర సరఫరాల శాఖ గోదాంలోని నిల్వ ఉన్న బియ్యం నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీ, హాస్టల్స్‌కు సరఫరా చేసే బియ్యం, రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీకి సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

News April 7, 2025

ADB: ఎప్పటికప్పుడు ఎస్పీ శాంతి భద్రతల పర్యవేక్షణ

image

ఆదిలాబాద్ శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న భారీ శోభాయాత్రలో శాంతిభద్రతలను ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా పరిశీలించారు. శోభాయాత్ర ముందర మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎస్పీ సీసీ కెమెరాల ద్వారా నిఘాను పర్యవేక్షించారు. శాంతి భద్రతలపై ఎప్పటికప్పుడు పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు.

error: Content is protected !!