India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోకసభ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బంది ర్యాoడమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఖమ్మం లోకసభ సాధారణ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టర్ ఛాంబర్ లో ఆన్లైన్ ద్వారా పూర్తి పారదర్శకంగా ర్యాoడమైజేషన్ చేపట్టి పూర్తి చేశారు. కౌంటింగ్ కొరకు రిజర్వ్ తో కలిపి 148 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 173 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 150 మంది సూక్ష్మ పరిశీలకులు నియమించినట్లు చెప్పారు.
ప్రేమ వ్యవహారంలో పెద్దలు మందలించారన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డిన ఘటన గోపాల్పేట మండలం కేశంపేటలో శుక్రవారం జరిగింది. SI తిరుపతిరెడ్డి వివరాలు.. గ్రామానికి చెందిన మల్లేశ్(24) ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలియడంతో ఇంట్లో మందలించారు. దీంతో మల్లేశ్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సిద్దిపేట జిల్లా భూంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ వి.రవి కాంత్ రావును సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. రవికాంత్.. మెదక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పని చేస్తున్న సమయంలో మామిడికాయల చోరీ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై శాఖా పరంగా ఉన్నతాధికారులు విచారణ జరిపారు. విధుల్లో అలసత్వం, అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కేంద్రంలోని రామన్నపేట క్రాస్ రోడ్డు హంటర్ రోడ్డు సమీపంలో 12 మోరీల జంక్షన్ వద్ద రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్యాయత్నం చేశారు. కాగా, యువతి మృతి చెందగా.. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లైసెన్స్ కలిగిన దుకాణాల్లో రైతులు విత్తనాలు, ఎరువులను కొనుగోళ్లు చేయాలని జిల్లా వ్యవసాయశాఖాధికారి పుల్లయ్య తెలిపారు. జిల్లాలో 518 షాపులకు లైసెన్స్లు ఇచ్చామన్నారు. జిల్లాలో 4 లక్షల 50 వేల ఎకరాల్లో పత్తి సాగవుతున్నట్లు అంచనా వేశామన్నారు. 10 లక్షల ప్యాకెట్లు అవసరమని గుర్తించి 55 కంపెనీలతో మాట్లాడి 8 లక్షల ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటివరకు 2 లక్షలకు పైగా కొనుగోలు చేశారన్నారు.
హైదరాబాద్లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి సాయి అనురాగ్ కాలనీలో కుటుంబ కలహాలతో భర్త నాగేంద్ర భరద్వాజ.. భార్య మధులత(సాఫ్ట్వేర్ ఉద్యోగి)ను హత్య చేశాడు. ముక్కలు ముక్కలుగా నరకడానికి ప్రయత్నించినట్లు మృతురాలి తండ్రి రంగనాయకులు PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడిని తాజాగా అరెస్ట్ చేశారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఓ భారీ చేప చిక్కింది. అన్నారం గ్రామానికి చెందిన రవి చేపల వేటకు వెళ్లి గోదావరిలో వల వేయగా 23 కిలోల భారీ చేప చిక్కింది. విషయం తెలుసుకున్న పరిసర ప్రాంత ప్రజలు చేపను ఆసక్తిగా తిలకించారు. అనంతరం నందిపేటకు చెందిన ఓ వ్యక్తికి చేపను విక్రయించినట్లు రవి తెలిపారు.
హైదరాబాద్లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి సాయి అనురాగ్ కాలనీలో కుటుంబ కలహాలతో భర్త నాగేంద్ర భరద్వాజ.. భార్య మధులత(సాఫ్ట్వేర్ ఉద్యోగి)ను హత్య చేశాడు. ముక్కలు ముక్కలుగా నరకడానికి ప్రయత్నించినట్లు మృతురాలి తండ్రి రంగనాయకులు PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడిని తాజాగా అరెస్ట్ చేశారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివార సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున, రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్కి సరుకులు తీసుకురావద్దని అధికారులు తెలిపారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అనుమానాస్పదంగా మృతి చెందిన షాదీనగర్ కు చెందిన అరవింద్ యాదవ్ మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు డీకే అరుణ తెలిపారు. శుక్రవారం మృతుని కుటుంబ సభ్యులతో ఆమె ఫోన్లో మాట్లాడారు. ఈ విషయమై కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో సంప్రదింపులు జరుపగా, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారని అరుణ తెలిపారు.
Sorry, no posts matched your criteria.