Telangana

News May 24, 2024

HYD: భార్య‌ను చంపేసి‌ పరారీ.. అరెస్ట్

image

హైదరాబాద్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధి సాయి అనురాగ్‌ కాలనీలో కుటుంబ కలహాలతో భర్త నాగేంద్ర భరద్వాజ.. భార్య మధులత(సాఫ్ట్‌వేర్ ఉద్యోగి)ను హత్య చేశాడు. ముక్కలు ముక్కలుగా నరకడానికి ప్రయత్నించినట్లు మృతురాలి తండ్రి రంగనాయకులు PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడిని తాజాగా అరెస్ట్ చేశారు.

News May 24, 2024

నందిపేట: వలకు చిక్కిన భారీ చేప

image

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఓ భారీ చేప చిక్కింది. అన్నారం గ్రామానికి చెందిన రవి చేపల వేటకు వెళ్లి గోదావరిలో వల వేయగా 23 కిలోల భారీ చేప చిక్కింది. విషయం తెలుసుకున్న పరిసర ప్రాంత ప్రజలు చేపను ఆసక్తిగా తిలకించారు. అనంతరం నందిపేటకు చెందిన ఓ వ్యక్తికి చేపను విక్రయించినట్లు రవి తెలిపారు.

News May 24, 2024

HYD: భార్య‌ను చంపేసి‌ పరారీ.. అరెస్ట్

image

హైదరాబాద్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధి సాయి అనురాగ్‌ కాలనీలో కుటుంబ కలహాలతో భర్త నాగేంద్ర భరద్వాజ.. భార్య మధులత(సాఫ్ట్‌వేర్ ఉద్యోగి)ను హత్య చేశాడు. ముక్కలు ముక్కలుగా నరకడానికి ప్రయత్నించినట్లు మృతురాలి తండ్రి రంగనాయకులు PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడిని తాజాగా అరెస్ట్ చేశారు. 

News May 24, 2024

వరంగల్ మార్కెట్‌కి 2 రోజుల సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివార సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున, రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకురావద్దని అధికారులు తెలిపారు.

News May 24, 2024

అరవింద్ మృతదేహాన్ని రప్పించేందుకు DK అరుణ చర్యలు

image

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అనుమానాస్పదంగా మృతి చెందిన షాదీనగర్ కు చెందిన అరవింద్ యాదవ్ మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు డీకే అరుణ తెలిపారు. శుక్రవారం మృతుని కుటుంబ సభ్యులతో ఆమె ఫోన్లో మాట్లాడారు. ఈ విషయమై కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో సంప్రదింపులు జరుపగా, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారని అరుణ తెలిపారు.

News May 24, 2024

KNR: గడ్డి మందు తాగి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

KNR జిల్లా వీణవంక మండలంలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. కొండపాకకు చెందిన సాయి కీర్తన(17) ఇంటర్ ఫస్టియర్ పూర్తి చేసుకుంది. పరీక్షల అనంతరం ఇంటికి వచ్చిన కీర్తనకు కడుపునొప్పి రావడంతో భరించలేక ఈనెల 17న ఉదయం గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో వాంతులు చేసుకోడం గమనించిన బంధువులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నేడు మృతి చెందగా తండ్రి రాజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 24, 2024

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

మెదక్- చేగుంట హైవేపై చిన్నశంకరంపేట మండలం మాందాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు(TS35JO156)మూల మలుపు వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, కొంతమంది కారులో ఇరుక్కుపోయారు. మృతుడు నవాపేట వాసి మేకల మహేష్‌గా గుర్తించారు. ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న జడ్పీ ఛైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ ఆగి కారులో ఉన్న వారిని బయటకు తీయించి ఆస్పత్రికి పంపించారు.

News May 24, 2024

గాదిగూడ: కలుషిత నీరు తాగి 8 మందికి అస్వస్థత

image

కలుషిత నీరు తాగి 8 మంది అస్వస్థతకు గురైన ఘటన శుక్రవారం గాదిగూడ మండలం లోకారి (బి)లో చోటుచేసుకుంది. 108 అంబులెన్స్ సిబ్బంది కిషన్, ముజఫర్ తెలిపిన ప్రకారం లోకారి (బి) లో కలుషిత నీరు తాగి 8 మందికి అస్వస్థకు కావడంతో ప్రథమ చికిత్స అందించినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి 108 అంబులెన్స్‌లో తరలించినట్లు వెల్లడించారు.

News May 24, 2024

KNR: దుబాయ్‌లో మృతి.. స్వగ్రామం చేరిన DEAD BODY

image

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని మోత్కురావుపేట గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తి ఇటీవల దుబాయ్‌లో మ్యాన్ హోల్‌లో పడి మృతి చెందాడు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో అతని మృతదేహం శుక్రవారం గ్రామానికి చేరుకుంది. మృతదేహాన్ని చూడగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరారు.

News May 24, 2024

NZB: విషాదం.. 15 నిమిషాల్లో తండ్రి, కూతురు మృతి

image

తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 15 నిమిషాల వ్యవధిలోనే ఆయన కూతురు జిల్లా ఆసుపత్రిలో మృతి చెందిన విషాద ఘటన ఇది. రెంజల్ మండలం వీరన్నగుట్టకు చెందిన జ్యోతి భర్త వేధింపులు భరించలేక ఈ నెల21న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు GGHలో చేర్పించారు. ఆమెకు భోజనం తెద్దామని బయలుదేరిన తండ్రి లక్ష్మణ్ రాథోడ్ (60) రాత్రి ప్రమాదంలో మృతి చెందగా కూతురు జ్యోతి చికిత్స పొందుతూ మృతి చెందింది.