Telangana

News May 24, 2024

MBNR: దోస్త్ దరఖాస్తు గడువు పొడిగింపు

image

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశానికి DOST(డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) మొదటి విడత దరఖాస్తుకు ఈనెల 29 వరకు అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దోస్త్ మొదటి విడత సీట్ అలాట్మెంట్ JUNE 6న ప్రకటించనున్నారు. వివరాలకు dost.cgg.gov.in లాగిన్ కావచ్చు
#SHARE IT.

News May 24, 2024

MBNR: గుర్తు తెలియని మహిళ హత్య

image

దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ పురపాలక పరిధిలోని అమిస్తాపూర్ శివారులోని సాక్షి గణపతి దేవాలయ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ శవం కలకలం రేపింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు శవాన్ని గమనించి అమిస్తాపూర్ ప్రాంత ప్రజలకు తెలపగా వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. బండరాయితో మెది హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

News May 24, 2024

ఖమ్మం: ప్రచార పర్వానికి రేపటితో తెర

image

ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వీరందరూ శుక్రవారం వరకు ఓటు వేసే అవకాశం ఉంది. ప్రచార పర్వానికి శనివారం సాయంత్రానికి తెరపడనుంది. సోమవారం ఉదయం 7నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఖమ్మం జిల్లాలో 118, భద్రాద్రిలో 55 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

News May 24, 2024

వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో శుక్రవారం తేజ మిర్చి నాన్ ఏసీ క్వింటా రూ.17,200 పలికింది. అలాగే ఏసీ తేజ మిర్చి రూ.19,000 ధర, 341 రకం ఏసీ మిర్చికి రూ.17,000 ధర రాగా.. వండర్ హాట్ ఏసీ మిర్చికి సైతం రూ.18,500 ధర వచ్చింది. కాగా నిన్నటితో పోలిస్తే ఈరోజు అన్ని రకాల మిర్చి ధరలు భారీగా తగ్గాయి. దీంతో రైతన్నలు కొంత నిరాశ చెందుతున్నారు.

News May 24, 2024

అయోమయంలో ఉమ్మడి జిల్లాలోని రైతులు!

image

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ప్రస్తుత వానాకాలం సీజన్ నుంచి సన్నరకం ధాన్యం పండించిన రైతులకు మాత్రమే క్వింటాకు రూ. 500 బోనస్ సెల్ ఇస్తామని ప్రకటించింది. కానీ దొడ్డు రకం వడ్లపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం వానకాలం సీజన్ నుంచి సన్నాలు సాగు చేయాలా లేదా దొడ్డు రకం వరి సాగు చేయాలా అని అయోమయంలో ఉమ్మడి జిల్లాలోని రైతులు పడిపోయారు.

News May 24, 2024

NLG: బల్క్ ఎస్ఎంఎస్ లపై నిషేధం: కలెక్టర్

image

ఈనెల 25న సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు రాజకీయ పరమైన బల్క్ ఎస్ఎంఎస్ లపై నిషేధం ఉంటుందని కలెక్టర్, పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరి చందన తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పట్టభద్రుల ఉపఎన్నికల పోలింగ్ ముగిసే 48 గంటల ముందు నుండి పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్ లు ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.

News May 24, 2024

NLG: మైనర్‌ను గర్భవతిని చేసి నిమ్స్‌లో వదిలేశాడు!

image

నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు.. మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను లోబర్చుకున్నాడు.. ఆమె గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా HYDలోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. తనకు పరిచయం ఉన్న ఓ ఉద్యోగి సాయంతో నిమ్స్ అధికారిని కలిశాడు. ఆ అధికారి సహకారంతో మైనర్‌ను నిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయించాడు. కానీ ఈ విషయం బయటికి లీకైంది. పోలీసులు నిమ్స్‌కు చేరుకుని బాలికను NLGకు తరలించినట్టు సమాచారం.

News May 24, 2024

HYD: మమ్మల్ని కొనసాగించండి: ఔట్ సోర్సింగ్ సిబ్బంది

image

తమకు పూర్తి వేతనం చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం HYDలో వారు మాట్లాడుతూ.. కేవలం 10 నెలలకే జీతం ఇవ్వడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇతర గురుకుల సంస్థల్లో ఇచ్చినట్లు తమకు 12 నెలలపాటు వేతనాలు చెల్లించాలన్నారు. గత నెలలో 4వేల మంది సిబ్బందిని 2 నెలలపాటు తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు.

News May 24, 2024

HYD: మమ్మల్ని కొనసాగించండి: ఔట్ సోర్సింగ్ సిబ్బంది

image

తమకు పూర్తి వేతనం చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం HYDలో వారు మాట్లాడుతూ.. కేవలం 10 నెలలకే జీతం ఇవ్వడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇతర గురుకుల సంస్థల్లో ఇచ్చినట్లు తమకు 12 నెలలపాటు వేతనాలు చెల్లించాలన్నారు. గత నెలలో 4వేల మంది సిబ్బందిని 2 నెలలపాటు తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు.

News May 24, 2024

ఆస్ట్రేలియాలో షాద్ నగర్ యువకుడు మృతి

image

ఆస్ట్రేలియాలో షాద్‌నగర్‌ వాసి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. BJP నేత కృష్ణ కుమారుడు అరవింద్ యాదవ్(30) 12ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ AUSలోని సిడ్నీలో స్థిరపడ్డారు. సోమవారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన అరవింద్ కనిపించకపోవడంతో అక్కడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సముద్రంలో అరవింద్ మృతదేహం ఈరోజు లభించడంతో హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో విచారణ చేపట్టారు.