Telangana

News May 24, 2024

ములుగు: గుండె మార్పిడితో మరొకరికి ప్రాణదానం

image

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ యువకుడు మరో మనిషికి ప్రాణం పోశాడు. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన షేక్ షానాజ్‌కు గుండె సంబంధిత సమస్య ఉంది. గుండె మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడికి 2 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో నిమ్స్ వైద్యులు అతడి గుండెను మార్పిడి చేసి షానాజ్‌కు విజయవంతంగా అమర్చారు.

News May 24, 2024

కల్హేర్: సినీ ఫక్కీలో కిడ్నాప్..

image

సినీ ఫక్కీలో కళ్లల్లో కారం చల్లి ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన సంఘటన గురువారం కల్హేర్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రిష్ణాపూర్‌‌కు చెందిన వెంకటేశం గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తితో కలసి కల్హేర్ తహసీల్ ఆఫీసుకు పనిమీద వచ్చారు. ఇంతలో ఒక మహిళ మరో ఇద్దరు వచ్చి నీతో మాట్లాడాలని వెంకటేశంకు తీసుకెళ్లారు. తర్వాత కళ్ల‌లో కారంపొడి చల్లి కిడ్నాప్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 24, 2024

HYD: నూతన చట్టాలు భద్రతకు మైలురాయి: రాచకొండ సీపీ

image

త్వరలో అమల్లోకి రానున్న నూతన చట్టాలు మన దేశ శాంతి భద్రతల పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తాయని రాచకొండ CP తరుణ్ జోషి అన్నారు. జులై 1 నుంచి భారత ప్రభుత్వ నూతన నేర న్యాయ చట్టాలు అమలులోకి రానున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి RCIలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన చట్టాలతో కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందన్నారు.

News May 24, 2024

పతాక స్థాయికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

image

NLG-KMM-WGL పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడనుంది. 27న పోలింగ్ జరగనుండడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ముఖ్య నేతలంతా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులతోపాటు స్థానిక నేతలతో ప్రచారం నిర్వహిస్తోంది. స్వతంత్రులు బరిలో ఉండడంతో ప్రధాన పార్టీలపై ఎఫెక్ట్ పడనుంది.

News May 24, 2024

HYD: నూతన చట్టాలు భద్రతకు మైలురాయి: రాచకొండ సీపీ 

image

త్వరలో అమల్లోకి రానున్న నూతన చట్టాలు మన దేశ శాంతి భద్రతల పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తాయని రాచకొండ CP తరుణ్ జోషి అన్నారు. జులై 1 నుంచి భారత ప్రభుత్వ నూతన నేర న్యాయ చట్టాలు అమలులోకి రానున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి RCIలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన చట్టాలతో కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందన్నారు.

News May 24, 2024

HYD: గర్భస్థ లింగ నిర్ధారణ చేస్తే క్రిమినల్ కేసులు: వైద్యాధికారి

image

గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేసే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రఘునాథ స్వామి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. గర్భధారణ, లింగ నిర్ధారణ ప్రక్రియ నిషేధ చట్టం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సలహా కమిటీ సభ్యులకు సూచించారు.

News May 24, 2024

HYD: గర్భస్థ లింగ నిర్ధారణ చేస్తే క్రిమినల్ కేసులు: వైద్యాధికారి

image

గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేసే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రఘునాథ స్వామి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. గర్భధారణ, లింగ నిర్ధారణ ప్రక్రియ నిషేధ చట్టం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సలహా కమిటీ సభ్యులకు సూచించారు.

News May 24, 2024

భద్రాచలం: మారుతి నర్సింగ్ కాలేజ్ వద్ద ఆందోళన

image

భద్రాచంలోని మారుతి నర్సింగ్ కాలేజ్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిన్న కాలేజ్ ప్రాంగణలో నర్సింగ్ విద్యార్థిని కారుణ్య గాయాలతో పడి ఉండగా యాజమాన్యం ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కారుణ్య నిన్న సాయంత్రం మృతి చెందింది. విద్యార్థిని మృతితో ప్రభుత్వాస్పత్రి నుంచి ర్యాలీగా కాలేజ్ వద్దకు చేరుకున్న విద్యార్థులు, బంధువులు కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.

News May 24, 2024

HYD: ఆస్ట్రేలియాలో BJP నాయకుడి కుమారుడు మృతి

image

ఆస్ట్రేలియాలో HYD శివారు షాద్‌నగర్‌ వాసి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. BJP దివంగత నేత కృష్ణ కుమారుడు అరవింద్ యాదవ్(30) 12ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ AUSలోని సిడ్నీలో స్థిరపడ్డారు. సోమవారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన అరవింద్ కనిపించకపోవడంతో అక్కడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సముద్రంలో అరవింద్ మృతదేహం ఈరోజు లభించడంతో హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో విచారణ చేపట్టారు.

News May 24, 2024

HYD: ఆస్ట్రేలియాలో BJP నాయకుడి కుమారుడు మృతి

image

ఆస్ట్రేలియాలో HYD శివారు షాద్‌నగర్‌ వాసి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. BJP దివంగత నేత కృష్ణ కుమారుడు అరవింద్ యాదవ్(30) 12ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ AUSలోని సిడ్నీలో స్థిరపడ్డారు. సోమవారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన అరవింద్ కనిపించకపోవడంతో అక్కడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సముద్రంలో అరవింద్ మృతదేహం ఈరోజు లభించడంతో హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో విచారణ చేపట్టారు.