India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ జిల్లాలో పాలిసెట్ పరీక్ష మొదలైంది. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ ఉండదు. కాగా ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు జరగనుంది. ఇందు కొరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా పలు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి నెలకొంది. 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,586 మంది విద్యార్థులు పరీక్ష కు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు
రోడ్డు ప్రమాదంలో రికార్డ్ అసిస్టెంట్ దుర్మరణం చెందిన ఘటన గురువారం రాత్రి సత్తుపల్లిలో చోటుచేసుకుంది. JVR ప్రభుత్వ కాలేజ్లో రికార్డ్ అసిస్టెంట్గా పని చేసే ప్రసాద్(38) స్థానిక కృషి బైపాస్లో నివాసం ఉంటున్నారు. ఆయన ద్విచక్రవాహనంపై రాజీవ్నగర్ నుంచి ఇంటికి వస్తుండగా ట్రాక్టర్కు ఉన్న కల్టివేటర్ను ఢీకొన్నాడు. పేగులు బయట పడటంతో స్థానికులు వెంటనే స్థానిక CHCకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో పత్తి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గత 3 రోజులతో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,040, మంగళవారం రూ.7,070 పలికింది. గురువారం రూ.7,210 ధరతో పోలిస్తే మరింత పెరిగి రూ.7,245 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ధరలు మరింత పెరగాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు.
ఇంటర్ ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన శ్రీనిధి (18) ఇంటర్ ఫెయిల్ అయ్యానని మనోవేదన చెందింది. దీంతో ఈ నెల 8న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. గురువారం చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
చింత చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మేళ్లచెరువు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన హుస్సేన్ గ్రామంలోని చెరువు కట్ట సమీపంలో ఉన్న చింత చెట్టు ఎక్కి చిగురు కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య షాజిదా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టు సమీపంలోని అభయారణ్యంలో 140 జింకలు పర్యాటకులను అలరిస్తున్నాయి. 1974లో 8 జింకలతో ఈ అరణ్యం మొదలైంది. ప్రస్తుతం జింకల సంతతి 140కి చేరింది. గతంలో సింగరేణి సంస్థ వీటి బాధ్యతను చూసేది. ప్రస్తుతం అటవీశాఖ ఆధ్వర్యంలో అభయారణ్యం కొనసాగుతోందని రేంజర్ శ్రీనివాస్ తెలిపారు.
Ed.CET పరీక్ష రాయటానికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన ఆదిలాబాద్లో జరిగింది. పట్టణ టూ టౌన్ SI లాల్ సింగ్ నాయక్ తెలిపిన వివరాలు.. నిర్మల్కు చెందిన ఓ యువతి తన తండ్రితో ఆదిలాబాద్లోని నలంద కళాశాలలో పరీక్ష రాసేందు వచ్చింది. ఇద్దరూ బస్టాండ్లో దిగిన అనంతరం మూత్రశాలకు వెళ్తానని చెప్పి తిరిగి రాలేదు. పలు చోట్ల తండ్రి గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాన్సువాడ అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. వివరాలిలా.. మృతదేహంపై దుస్తులు చిందరవందరగా ఉండటం, పుర్రె పగిలి, దవడ విరిగి ఉంది. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి చంపేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన SP పోస్టుమార్టం నిర్వహించి కుంటుబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి అక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆమనగల్లులో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆమనగల్లు మండలం రామంతల గడ్డ సమీపంలో గల శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతులు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆమనగల్లు మండలం రామంతల గడ్డ సమీపంలో గల శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతులు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
Sorry, no posts matched your criteria.