Telangana

News May 24, 2024

NZB: పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

image

పాలిసెట్- 2024కు ఏర్పాట్లు పూర్తయ్యాయని నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్, సమన్వయకర్త ఫణిరాజ్ తెలిపారు. 16 పరీక్ష కేంద్రాల్లో 5,586 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. పరీక్ష ఉ. 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఉంటుందని విద్యార్థులు 10 గంటలలోపు చేరుకోవాలన్నారు. విద్యార్థులు హాల్ టికెట్లు, పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ పెన్ను తీసుకురావాలని తెలిపారు.

News May 24, 2024

560 గ్రాములతో పుట్టిన పాపకు ట్రీట్మెంట్

image

ఆదిలాబాద్‌కు చెందిన ముస్కాన్ రిజ్వాన్ దంపతులకు రెండు నెలల క్రితం 560 గ్రాములతో పాప జన్మించింది. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో.. నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆసుపత్రి వైద్యులు పాపకు రెండు నెలల పాటు చికిత్సలు నిర్వహించి, బరువు కిలో 465 గ్రాముల వరకు పెరిగేలా చేశారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉండడంతో బేబీని డిశ్చార్జ్ చేశారు.

News May 24, 2024

ఖమ్మం: రైస్ మిల్లును తనీఖీ చేసిన కలెక్టర్

image

సిఎంఆర్ రైస్ దిగుమతి లక్ష్యం త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ అన్నారు. నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలోని అరుణాచల శివ రైస్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్ ని క్షేత్ర స్థాయిలో కలెక్టర్ తనిఖీలు చేశారు. మిల్లు సామర్థ్యం, రోజుకు ఎంత మేర ధాన్యం పట్టేది, ఎంత ధాన్యం నిల్వ ఉన్నవి, హమాలీలు ఎంత మంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్ లో వచ్చే పంటపై వివరాలు సేకరించారు.

News May 24, 2024

WGL: ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కౌంటింగ్ ఏర్పాట్లు : రిటర్నింగ్ అధికారి

image

ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేయాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి ప్రావీణ్య ఆదేశించారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుపనున్న దృష్ట్యా గురువారం కలెక్టరేట్‌లో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశమై ఎన్నికల సంఘం నిబంధనల కచ్చితంగా పాటించాలన్నారు.

News May 24, 2024

NLG : 48 గంటల ముందు నుంచే వీటిపై నిషేధం: కలెక్టర్

image

NLG -KMM- WGL శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికలో భాగంగా పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి బహిరంగ సభలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహించడం నిషేధమని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. ఈ ఉపఎన్నికకు ఈనెల 27న ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు.

News May 23, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సైదాపూర్ మండలంలో 26 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ మెట్పల్లి మండలంలో లారీ, కారు ఢీ.. కుమారుడి మృతి, తండ్రికి గాయాలు. @ ఓదెల మండలంలో చిరుత పులి సంచారం కలకలం. @ ఎల్లారెడ్డిపేట మండలంలో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య. @ కొడిమ్యాల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్. @ పెద్దపల్లి లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.

News May 23, 2024

HYD: ఈ జిల్లాలో రిజిస్ట్రేషన్ల జోరు!

image

HYD జిల్లా పరిధిలో మార్చి నెలలో మొత్తం స్థిరాస్తుల సంఖ్య 4,376, మేడ్చల్ జిల్లాలో 13,051, రంగారెడ్డి జిల్లాలో 19,663గా ఉంది. మరోవైపు ఇళ్లులు,ప్లాట్లు, స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లకు HYD జిల్లాలో రూ.120.53 కోట్లు, మేడ్చల్ జిల్లాలో రూ.213.19 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.432.60 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా రిపోర్టు విడుదల చేసి, పేర్కొన్నారు.

News May 23, 2024

HYD: ఎన్నికల్లో EVM యంత్రాలు మన ECIL వే!

image

దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(EVM)లలో 90 శాతం HYDలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL) రూపొందించినవే. 543 ఎంపీ స్థానాలలో దాదాపు 500 చోట్ల ECIL తయారుచేసిన EVMలనే వాడుతున్నారు. 2 నెలల కిందటే 6.25 లక్షలకు పైగా కంట్రోల్ యూనిట్లు, 8.39 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 5.45 లక్షల వీవీ ప్యాట్లను ఈసీఐకి సరఫరా చేసినట్లు తెలిపారు.

News May 23, 2024

HYD: ఎన్నికల్లో EVM యంత్రాలు మన ECIL వే!

image

దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(EVM)లలో 90 శాతం HYDలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL) రూపొందించినవే. 543 ఎంపీ స్థానాలలో దాదాపు 500 చోట్ల ECIL తయారుచేసిన EVMలనే వాడుతున్నారు. 2 నెలల కిందటే 6.25 లక్షలకు పైగా కంట్రోల్ యూనిట్లు, 8.39 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 5.45 లక్షల వీవీ ప్యాట్లను ఈసీఐకి సరఫరా చేసినట్లు తెలిపారు.

News May 23, 2024

కొడిమ్యాల: ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలి: అడిషనల్ కలెక్టర్

image

ధాన్యం కొనుగోళ్లను 2, 3 రోజుల్లో పూర్తిచేయాలని అడిషనల్ కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. కొడిమ్యాల మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. అకాల వర్షాల వలన నష్టపోయిన పంట వివరాలను తెలుసుకున్నారు. రైస్ మిల్లు లను సందర్శించి వెంటనే ధాన్యాన్ని అన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.