Telangana

News May 23, 2024

HYD: ఈ జిల్లాలో రిజిస్ట్రేషన్ల జోరు!

image

HYD జిల్లా పరిధిలో మార్చి నెలలో మొత్తం స్థిరాస్తుల సంఖ్య 4,376, మేడ్చల్ జిల్లాలో 13,051, రంగారెడ్డి జిల్లాలో 19,663గా ఉంది. మరోవైపు ఇళ్లులు,ప్లాట్లు, స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లకు HYD జిల్లాలో రూ.120.53 కోట్లు, మేడ్చల్ జిల్లాలో రూ.213.19 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.432.60 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా రిపోర్టు విడుదల చేసి, పేర్కొన్నారు.

News May 23, 2024

HYD: ఎన్నికల్లో EVM యంత్రాలు మన ECIL వే!

image

దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(EVM)లలో 90 శాతం HYDలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL) రూపొందించినవే. 543 ఎంపీ స్థానాలలో దాదాపు 500 చోట్ల ECIL తయారుచేసిన EVMలనే వాడుతున్నారు. 2 నెలల కిందటే 6.25 లక్షలకు పైగా కంట్రోల్ యూనిట్లు, 8.39 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 5.45 లక్షల వీవీ ప్యాట్లను ఈసీఐకి సరఫరా చేసినట్లు తెలిపారు.

News May 23, 2024

HYD: ఎన్నికల్లో EVM యంత్రాలు మన ECIL వే!

image

దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(EVM)లలో 90 శాతం HYDలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL) రూపొందించినవే. 543 ఎంపీ స్థానాలలో దాదాపు 500 చోట్ల ECIL తయారుచేసిన EVMలనే వాడుతున్నారు. 2 నెలల కిందటే 6.25 లక్షలకు పైగా కంట్రోల్ యూనిట్లు, 8.39 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 5.45 లక్షల వీవీ ప్యాట్లను ఈసీఐకి సరఫరా చేసినట్లు తెలిపారు.

News May 23, 2024

కొడిమ్యాల: ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలి: అడిషనల్ కలెక్టర్

image

ధాన్యం కొనుగోళ్లను 2, 3 రోజుల్లో పూర్తిచేయాలని అడిషనల్ కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. కొడిమ్యాల మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. అకాల వర్షాల వలన నష్టపోయిన పంట వివరాలను తెలుసుకున్నారు. రైస్ మిల్లు లను సందర్శించి వెంటనే ధాన్యాన్ని అన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.

News May 23, 2024

చెన్నరావుపేట: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

image

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నారావుపేట మండలం మగ్దుంపురంలో చోటుచేసుకుంది. మగ్దుంపురం గ్రామానికి చెందిన తోట రాజు(40)కు కొన్నేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. భార్య భర్తల మధ్య గొడవతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య కాపురానికి రాకపోవడం, మద్యానికి బానిసైన రాజు రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.

News May 23, 2024

BSWD: మహిళ మృతదేహం వివరాలను గుర్తించిన పోలీసులు

image

బాన్సువాడ మండలంలోని కృష్ణా నగర్ తండా అటవీ ప్రాంతంలో గురువారం లభ్యమైన గుర్తు తెలియని మహిళ (35) వివరాలను పోలీసులు గుర్తించారు. మృతురాలిని గాంధారి మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన వారాంతపు సంతలో కూరగాయలు అమ్మే లక్ష్మీగా గుర్తించారు. వారం క్రితం బాన్సువాడ వెళ్లి తిరిగి రాకపోవడంతో గాంధారి పోలీసు స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కాగా సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ సింధూ శర్మ పరిశీలించారు.

News May 23, 2024

ADB: పర్స్ కొట్టేసిన మహిళా దొంగ.. అరెస్టు

image

ఆదిలాబాద్ RTC బస్ స్టాండ్ నుంచి గురువారం బేల వెళ్ళటానికి సయ్యద్ అనే వ్యక్తి బస్సు ఎక్కుతుండగా ఒక మహిళ ఆయన పర్సును దొంగిలించింది. ఈ క్రమంలో ఆమె పారిపోతుండగా అక్కడున్న టూటౌన్ పోలీసులు ఆమెను పట్టుకొని పర్సును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం టౌన్‌లో కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు CI అశోక్ తెలిపారు. SI లాల్ సింగ్ నాయక్, సిబ్బంది గంగకుమారి, రజిత, నరేష్, రమేష్, క్రాంతి, నరేందర్ ఉన్నారు.

News May 23, 2024

ఫారుక్‌నగర్: బొలెరో ఢీకొని యువతి దుర్మరణం

image

ఫారుక్‌నగర్ మండలం అన్నారం తండాలో గురువారం విషాదం నెలకొంది. ఇంటి ముందు నిలబడి ఉన్న యువతిని బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమయంలో వాహనాన్ని మైనర్ నడిపినట్లు సమాచారం. ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 23, 2024

BSWD: అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం

image

బాన్సువాడ మండలంలోని కృష్ణా నగర్ తండా అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ (35) మృతదేహం లభ్యమైనట్లు బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మృతురాలు ఒంటిపై గులాబీ రంగు చీర, బంగారు రంగు జాకెట్ ధరించి ఉందని, నలుపు రంగు స్కార్ఫ్ కూడా ఉన్నట్లు సీఐ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా మృతురాలి ఆచూకీ తెలిస్తే తమను సంప్రదించాలని ఆయన సూచించారు.

News May 23, 2024

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భద్రాద్రి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పారామెడికల్ విద్యార్థిని మృతి చెందింది. దీంతో మృతిరాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.