Telangana

News May 23, 2024

5ఏళ్లు రేవంత్ రెడ్డే CM: జగ్గారెడ్డి

image

5ఏళ్లు రేవంత్ రెడ్డే CMగా ఉంటారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘మంత్రి ఉత్తమ్‌పై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదు. ఉత్తం వైట్ పేపర్ లాంటివారు. ఆయనపై ఇంక్ చల్లకండి. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం, మంత్రులు చెప్పారు. అయినా అధికార పార్టీపై ప్రతిపక్షాలు బురదజల్లడం సహజమే’ అని జగ్గారెడ్డిని అన్నారు.

News May 23, 2024

SRPT:పోస్టల్ బ్యాలెట్ కు రేపే చివరి రోజు: కలెక్టర్

image

MLC ఉపఎన్నిక నేపథ్యంలో పోలింగ్ రోజు విధులు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఉద్యోగులు కోసం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ వెంకట్రావు,ఆదనపు కలెక్టర్ ప్రియాంకతో కలసి గురువారం సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 182 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారని తెలిపారు. రేపే చివరి రోజు అని తెలిపారు.

News May 23, 2024

VKB జిల్లాలోని రైతులకు పలు సూచనలు!

image

✓ తీరా వర్షాలు కురిసే సమయం వరకు దుక్కులు దున్నకుండా ఉండొద్దు.
✓వేసవిలోనే దుక్కి సిద్ధం చేయడం మంచిది
✓విత్తనం వేసే నెలరోజుల ముందుగానే దుక్కి సిద్ధం చేసుకోండి
✓వేసవి దుక్కులు లోతుగా చేయడం వల్ల, ఎండ వేడికి పలు రకాల చీడపీడ పురుగులు చచ్చిపోతాయి
✓ మొలకెత్తి మొలకల శాతం పెరుగుతుంది
✓ మొలిచిన మొలకలు ఆరోగ్యంగా ఎదుగుతాయి
•పై సూచనలు పాటించాలని AO సూర్య ప్రకాష్ తెలిపారు.

News May 23, 2024

పెద్దపల్లి: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

పెద్దపల్లి ఆదర్శ్‌నగర్‌లో గల బంధంపల్లి చెరువును అనుకొని ఉన్న వ్యవసాయ కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనది. పెద్దపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 40 నుంచి 45 మధ్య ఉంటుందన్నారు. తెల్లని చొక్కా, నీలిరంగు లుంగీ పంచ కలిగి ఉందని తెలిపారు. వివరాలు తెలిసినవారు పెద్దపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

News May 23, 2024

భైంసా: మనస్తాపం చెంది ఉరేసుకున్నాడు..!

image

మనస్తాపంతో ఒకరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా భైంసా మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కథనం మేరకు మాటేగాంకి లక్ష్మణ్(3౦) కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 22న ఓ ఫ్లాట్ విషయంలో భార్యతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. మనస్తాపం చెందిన లక్ష్మణ్ గురువారం మాటేగాం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

News May 23, 2024

HYD నగరంపై బ్రిటిష్ హై కమిషనర్ ప్రశంసలు

image

HYD నగరంలోని ఆర్కిటెక్చర్ అందాలు, పురాతన కట్టడాలపై బ్రిటిష్ హై కమిషనర్ కామెరాన్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా 300 ఏళ్ల చరిత్ర కలిగిన బన్సీలాల్ పేట మెట్ల బావిని సందర్శించిన ఆమె పునరుద్ధరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం చార్మినార్ వద్ద ఇరానీ టీ, ఉస్మానియా బిస్కెట్ తిని ఆస్వాదించారు. HYD నగరాన్ని సందర్శించడంతో తనివి తీర ఆనందం లభించిందని పేర్కొన్నారు.

News May 23, 2024

HYD నగరంపై బ్రిటిష్ హై కమిషనర్ ప్రశంసలు

image

HYD నగరంలోని ఆర్కిటెక్చర్ అందాలు, పురాతన కట్టడాలపై బ్రిటిష్ హై కమిషనర్ కామెరాన్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా 300 ఏళ్ల చరిత్ర కలిగిన బన్సీలాల్ పేట మెట్ల బావిని సందర్శించిన ఆమె పునరుద్ధరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం చార్మినార్ వద్ద ఇరానీ టీ, ఉస్మానియా బిస్కెట్ తిని ఆస్వాదించారు. HYD నగరాన్ని సందర్శించడంతో తనివి తీరా ఆనందం లభించిందని పేర్కొన్నారు.

News May 23, 2024

ఎడపల్లి: యువతిపై ఆగంతకుల దాడి..!

image

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో దారుణం జరిగింది. జాన్కంపేట శివారులోని కెనాల్ వద్ద ఇవాళ ఉదయం ఓ యువతి తీవ్రగాయాలతో అపస్మారక స్థతిలో పడి ఉంది. ఇది గమనించిన వాకర్స్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని తీవ్రగాయలతో ఉన్న యువతిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. యువతి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.

News May 23, 2024

BRS నేత హత్యను ఖండించిన హరీశ్ రావు

image

వనపర్తి జిల్లాలో BRS నేత శ్రీధర్‌ హత్య ఘటనను మాజీ మంత్రి హరీశ్‌రావు ఖండించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. జగిత్యాల జిల్లాలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 5నెలల్లోనే దాడులు పెరిగాయని ఆరోపించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోనే ఇద్దరు BRS నేతలు హత్యకు గురయ్యారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను కాంగ్రెస్‌ భయపెట్టలేదన్నారు. BRS శ్రేణులు ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందన్నారు.

News May 23, 2024

WGL: కలెక్టర్ పేరిట నకిలీ సోషల్ మీడియా ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు.

image

వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేరిట సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉపయోగించుకుని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సైబర్ నేరగాళ్లు యత్నిస్తున్నారు. ‘ నేను మీటింగ్‌లో ఉన్నాను. నాకు డబ్బులు కావాలంటూ’ కలెక్టర్ ఐడీతో మేసేజ్ వచ్చింది. ఇది గమనించిన కలెక్టర్ తక్షణమే పోలీసులకు ఫిర్యాదుచేశారు. తన పేరుతో వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని ఆమె ప్రజలకు సూచించారు